Charles Bronson : అతడో కరుడుగట్టిన ఖైదీ.. అయినా మూడు పెళ్లిళ్లు!
తోటి నేరస్థులు, జైలు అధికారులపై దాడికి పాల్పడిన కారణంగా ఓ ఖైదీ 50ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు.
బ్రిటన్లో కరుడుగట్టిన ఖైదీగా ముద్రపడిన ఛార్లెస్ బ్రాన్సన్ ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని పెరోల్ ఇవ్వాలని ప్రస్తుతం న్యాయమూర్తులను అభ్యర్థిస్తున్నాడు.
ఎవరీ ఛార్లెస్ బ్రాన్సన్?
ఛార్లెస్ బ్రాన్సన్ అసలు పేరు మైకేల్ గార్డన్ పీటర్సన్. ఐరా, జో పీటర్సన్ దంపతులకు 1952లో ఛార్లీ జన్మించాడు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం(Political background) కూడా ఉంది. ఛార్లీ అత్త, మామ అబెరిస్ట్విత్ పట్టణ మేయర్లుగా పనిచేశారు. అదే పట్టణంలో ఛార్లీ తండ్రి కన్జర్వేటివ్ క్లబ్ను నడిపించేవాడు. బాల్యంలో ఛార్లెస్ ఎంతో వినయంగా ఉంటూ.. మంచి పిల్లాడిలా మెలిగేవాడని అతని అత్త ఓ సందర్భంలో మీడియాతో అన్నారు. ఛార్లీ నాలుగేళ్ల ప్రాయం నుంచి లూటన్(Luton)లోనే నివాసం ఉన్నారు. అతడు టీనేజ్లోకి అడుగుపెట్టగానే ఛెషైర్కు మారిపోయారు. దాంతో ఛార్లీ జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. క్రమంగా నేర ప్రపంచం వైపు అడుగులు వేశాడు.
దోపిడీలు.. దొంగతనాలు
యువకుడిగా ఉన్న ఛార్లీకి తన వద్ద తుపాకీ(Gun) ఉండాలనే కోరిక కలిగింది. 1974లో తొలిసారి ఆయుధాల దొంగతనానికి యత్నించి దొరికిపోయాడు. దాంతో అతడిని లివర్పూల్లోని హెచ్ఎం జైలుకు తరలించారు. ఆ కేసులో ఛార్లీకి ఏడేళ్ల జైలు శిక్ష(jail term) పడింది. కానీ, జైల్లో ఉండగా అధికారులు, తోటి ఖైదీల(prisoners)పై దాడికి పాల్పడ్డాడు. ఈ పరిణామంతో శిక్ష పొడిగించారు. అలా 1987లో జైలు నుంచి విడుదల అయ్యాడు. ఓ నగల దుకాణం(Jewellery shop)లో దొంగతనం చేయడంతో 1988లో మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు. 1992లో మళ్లీ జైలు నుంచి బయటికొచ్చాడు. ఆ తరువాత మరోసారి దొంగతనం చేయడంతో కటకటాల పాలయ్యాడు. కస్టడీలో ఉండగా విధ్వంసం చేసినందుకు అతడి శిక్ష పొడిగిస్తూ వచ్చారు. 1997లో బ్రాన్సన్ డిప్యూటీ ప్రిజన్ గవర్నర్పై దాడి చేశాడు. సిబ్బంది, తోటి ఖైదీలను కూడా గాయపరచడంతో 5ఏళ్ల జైలు శిక్ష పడింది. జైలులో ఖైదీలకు ఆర్ట్స్ క్లాసులు బోధించడానికి వచ్చిన ఓ టీచర్ను(teacher) బ్రాన్సన్ బంధించాడు. తరువాత ఆ టీచర్ను విడిచిపెట్టాడు. దాంతో 2003 వరకు జైలు శిక్ష పొడిగింపు జరిగింది. ఛార్లీ తోటి ఖైదీలను గాయపరుస్తాడన్న ముద్ర పడటంతో అతడిని ఒంటరిగా జైలు గదుల్లో ఉంచేవారు. 2014లోనూ మరోసారి ప్రిజన్ గవర్నర్పై దాడి చేయడంతో మరో మూడేళ్ల జైలుశిక్ష పడింది.
పిచ్చి ముదిరిందని ఆస్పత్రికి..
జైల్లో వరుసగా దాడులు చేస్తుండటంతో ఛార్లెస్ను పలు జైళ్లకు తిప్పారు. అతడి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని గమనించి 1978లో బ్రాడ్మోర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ఉండటం కూడా ఛార్లెస్కు నచ్చలేదు. అక్కడ కూడా పలువురిని గాయపరిచాడు. ఓ ఖైదీని చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఏమైందో తెలియదు.. ఉన్నట్లుండి ఛార్లెస్ నిరాహార దీక్ష(Hunger strike)కు దిగాడు. 18 రోజులపాటు దీక్ష కొనసాగించడంతో అతడి ఆరోగ్యం క్షీణించింది. దాంతో పార్క్లేన్ హాస్పటల్కు తరలించారు.
అక్రమ బాక్సింగ్ పోటీల్లో..
సుదీర్ఘ జైలు జీవితం గడిపిన ఛార్లెస్ కొద్ది రోజులు మాత్రమే బయట ఉన్నాడు. అయినా తాను బేర్-నకిల్ బాక్సింగ్(boxing) నేర్చుకున్నాడు. అక్రమంగా నిర్వహించే పలు బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అప్పుడే తాను మైకేల్ పీటర్సన్ పేరును ఛార్లెస్ బ్రాన్సన్గా మార్చుకున్నాడు. బ్రాన్సన్పై ఓ సినిమా(Film) కూడా తీశారు. టామ్హార్డీ కథానాయకుడిగా బ్రాన్సన్ జీవితాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రానికి బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.
జైలు జీవితం గడిపిన సమయంలో ఛార్లెస్ పలు బొమ్మలు గీశాడు. వాటితో కొందరు బయటి వ్యక్తులు తాజాగా ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్(art exhibition)ను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఛార్లెస్కు పెరోల్ రావడానికి సహకరిస్తుందని వారు భావిస్తున్నారు. ఛార్లెస్ డ్రాయింగ్లు ఎక్కువగా అతడి జైలు జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కేవలం బొమ్మలు వేయడమే కాకుండా పుస్తకాలు కూడా రాశాడు. అవి ప్రచురితమయ్యాయి.
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు
ఇంత నేర చరిత్ర ఉన్న ఛార్లెస్కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1971లో బ్రాన్సన్.. ఐరీన్ కెల్సీని తొలిసారి కలిశాడు. ఎనిమిది నెలలు గడిచిన తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొడుకు పుట్టడంతో ఆ చిన్నారికి మైకేల్ జొనాథన్ పీటర్గా నామకరణం చేశారు. అయితే ఐదేళ్ల తరువాత విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.
మళ్లీ 2001లో ఛార్లెస్.. ఫాతిమా సైరా రెహ్మాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి హెచ్ఎంపీ వుడ్హిల్ ప్రిజన్లో జరిగింది. వార్తాపత్రికలో బ్రాన్స్న్ గురించి చదివిన తరువాత ఆమె అతడిని ప్రేమించింది. ఈ పెళ్లి తరువాత ఛార్లెస్ తన పేరును ఛార్లెస్ అలీ అహ్మద్గా మార్చుకున్నాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. నాలుగేళ్ల తరువాత ఈ ఇద్దరూ విడిపోయారు. అనంతరం పేరు మార్చుకున్నాడు.
బ్రాన్సన్ ముచ్చటగా మూడోపెళ్లి ఓ నటిని చేసుకున్నాడు. ఆమె పేరు పౌలా విలియమ్సన్. 2016, 17 సంవత్సరాల్లో వీరిద్దరూ జైల్లో కలుసుకున్నారు. బ్రాన్సన్ ఆమెకు ప్రపోజ్ చేయడంతో అంగీకరించడంతో పెళ్లిచేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాడు. బ్రాన్సన్ జైలు నుంచి తప్పకుండా విడుదల అవుతాడని పౌలా నమ్మేది. అనూహ్యంగా ఆమె 2019లో చనిపోయింది. అయితే ఆమె మరణం అనుమానాస్పదంగా లేదని అప్పట్లో పోలీసులు తెలిపారు.
స్వేచ్ఛ కోసం పోరాటం
బ్రాన్సన్ తనను విడుదల చేయాలంటూ అనేక సార్లు పెరోల్కు దరఖాస్తు చేసుకున్నాడు. అతని గత హింసాత్మక ప్రవృత్తి కారణంగా న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పు ఇవ్వడం లేదు. తాజాగా సోమవారం బ్రాన్సన్ తరఫున వాదించిన న్యాయవాది అతడిని విడుదల చేయాలని కోరాడు. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
తన విడుదల విషయంపై అతను మీడియాతో మాట్లాడుతూ ‘నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి. నేను ఎవరినీ చంపలేదు. ఎవరిపైనా అత్యాచారం చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు జైల్లో ఉన్నానో చెబితే ప్రజలు నమ్మరు. వారు నన్నొక సీరియల్ కిల్లర్ అనుకుంటారని’ ఆవేదన వెలిబుచ్చాడు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు