Charles Bronson : అతడో కరుడుగట్టిన ఖైదీ.. అయినా మూడు పెళ్లిళ్లు!
తోటి నేరస్థులు, జైలు అధికారులపై దాడికి పాల్పడిన కారణంగా ఓ ఖైదీ 50ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు.
బ్రిటన్లో కరుడుగట్టిన ఖైదీగా ముద్రపడిన ఛార్లెస్ బ్రాన్సన్ ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని పెరోల్ ఇవ్వాలని ప్రస్తుతం న్యాయమూర్తులను అభ్యర్థిస్తున్నాడు.
ఎవరీ ఛార్లెస్ బ్రాన్సన్?
ఛార్లెస్ బ్రాన్సన్ అసలు పేరు మైకేల్ గార్డన్ పీటర్సన్. ఐరా, జో పీటర్సన్ దంపతులకు 1952లో ఛార్లీ జన్మించాడు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం(Political background) కూడా ఉంది. ఛార్లీ అత్త, మామ అబెరిస్ట్విత్ పట్టణ మేయర్లుగా పనిచేశారు. అదే పట్టణంలో ఛార్లీ తండ్రి కన్జర్వేటివ్ క్లబ్ను నడిపించేవాడు. బాల్యంలో ఛార్లెస్ ఎంతో వినయంగా ఉంటూ.. మంచి పిల్లాడిలా మెలిగేవాడని అతని అత్త ఓ సందర్భంలో మీడియాతో అన్నారు. ఛార్లీ నాలుగేళ్ల ప్రాయం నుంచి లూటన్(Luton)లోనే నివాసం ఉన్నారు. అతడు టీనేజ్లోకి అడుగుపెట్టగానే ఛెషైర్కు మారిపోయారు. దాంతో ఛార్లీ జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. క్రమంగా నేర ప్రపంచం వైపు అడుగులు వేశాడు.
దోపిడీలు.. దొంగతనాలు
యువకుడిగా ఉన్న ఛార్లీకి తన వద్ద తుపాకీ(Gun) ఉండాలనే కోరిక కలిగింది. 1974లో తొలిసారి ఆయుధాల దొంగతనానికి యత్నించి దొరికిపోయాడు. దాంతో అతడిని లివర్పూల్లోని హెచ్ఎం జైలుకు తరలించారు. ఆ కేసులో ఛార్లీకి ఏడేళ్ల జైలు శిక్ష(jail term) పడింది. కానీ, జైల్లో ఉండగా అధికారులు, తోటి ఖైదీల(prisoners)పై దాడికి పాల్పడ్డాడు. ఈ పరిణామంతో శిక్ష పొడిగించారు. అలా 1987లో జైలు నుంచి విడుదల అయ్యాడు. ఓ నగల దుకాణం(Jewellery shop)లో దొంగతనం చేయడంతో 1988లో మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు. 1992లో మళ్లీ జైలు నుంచి బయటికొచ్చాడు. ఆ తరువాత మరోసారి దొంగతనం చేయడంతో కటకటాల పాలయ్యాడు. కస్టడీలో ఉండగా విధ్వంసం చేసినందుకు అతడి శిక్ష పొడిగిస్తూ వచ్చారు. 1997లో బ్రాన్సన్ డిప్యూటీ ప్రిజన్ గవర్నర్పై దాడి చేశాడు. సిబ్బంది, తోటి ఖైదీలను కూడా గాయపరచడంతో 5ఏళ్ల జైలు శిక్ష పడింది. జైలులో ఖైదీలకు ఆర్ట్స్ క్లాసులు బోధించడానికి వచ్చిన ఓ టీచర్ను(teacher) బ్రాన్సన్ బంధించాడు. తరువాత ఆ టీచర్ను విడిచిపెట్టాడు. దాంతో 2003 వరకు జైలు శిక్ష పొడిగింపు జరిగింది. ఛార్లీ తోటి ఖైదీలను గాయపరుస్తాడన్న ముద్ర పడటంతో అతడిని ఒంటరిగా జైలు గదుల్లో ఉంచేవారు. 2014లోనూ మరోసారి ప్రిజన్ గవర్నర్పై దాడి చేయడంతో మరో మూడేళ్ల జైలుశిక్ష పడింది.
పిచ్చి ముదిరిందని ఆస్పత్రికి..
జైల్లో వరుసగా దాడులు చేస్తుండటంతో ఛార్లెస్ను పలు జైళ్లకు తిప్పారు. అతడి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని గమనించి 1978లో బ్రాడ్మోర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ఉండటం కూడా ఛార్లెస్కు నచ్చలేదు. అక్కడ కూడా పలువురిని గాయపరిచాడు. ఓ ఖైదీని చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఏమైందో తెలియదు.. ఉన్నట్లుండి ఛార్లెస్ నిరాహార దీక్ష(Hunger strike)కు దిగాడు. 18 రోజులపాటు దీక్ష కొనసాగించడంతో అతడి ఆరోగ్యం క్షీణించింది. దాంతో పార్క్లేన్ హాస్పటల్కు తరలించారు.
అక్రమ బాక్సింగ్ పోటీల్లో..
సుదీర్ఘ జైలు జీవితం గడిపిన ఛార్లెస్ కొద్ది రోజులు మాత్రమే బయట ఉన్నాడు. అయినా తాను బేర్-నకిల్ బాక్సింగ్(boxing) నేర్చుకున్నాడు. అక్రమంగా నిర్వహించే పలు బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అప్పుడే తాను మైకేల్ పీటర్సన్ పేరును ఛార్లెస్ బ్రాన్సన్గా మార్చుకున్నాడు. బ్రాన్సన్పై ఓ సినిమా(Film) కూడా తీశారు. టామ్హార్డీ కథానాయకుడిగా బ్రాన్సన్ జీవితాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రానికి బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.
జైలు జీవితం గడిపిన సమయంలో ఛార్లెస్ పలు బొమ్మలు గీశాడు. వాటితో కొందరు బయటి వ్యక్తులు తాజాగా ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్(art exhibition)ను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఛార్లెస్కు పెరోల్ రావడానికి సహకరిస్తుందని వారు భావిస్తున్నారు. ఛార్లెస్ డ్రాయింగ్లు ఎక్కువగా అతడి జైలు జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కేవలం బొమ్మలు వేయడమే కాకుండా పుస్తకాలు కూడా రాశాడు. అవి ప్రచురితమయ్యాయి.
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు
ఇంత నేర చరిత్ర ఉన్న ఛార్లెస్కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1971లో బ్రాన్సన్.. ఐరీన్ కెల్సీని తొలిసారి కలిశాడు. ఎనిమిది నెలలు గడిచిన తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొడుకు పుట్టడంతో ఆ చిన్నారికి మైకేల్ జొనాథన్ పీటర్గా నామకరణం చేశారు. అయితే ఐదేళ్ల తరువాత విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.
మళ్లీ 2001లో ఛార్లెస్.. ఫాతిమా సైరా రెహ్మాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి హెచ్ఎంపీ వుడ్హిల్ ప్రిజన్లో జరిగింది. వార్తాపత్రికలో బ్రాన్స్న్ గురించి చదివిన తరువాత ఆమె అతడిని ప్రేమించింది. ఈ పెళ్లి తరువాత ఛార్లెస్ తన పేరును ఛార్లెస్ అలీ అహ్మద్గా మార్చుకున్నాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. నాలుగేళ్ల తరువాత ఈ ఇద్దరూ విడిపోయారు. అనంతరం పేరు మార్చుకున్నాడు.
బ్రాన్సన్ ముచ్చటగా మూడోపెళ్లి ఓ నటిని చేసుకున్నాడు. ఆమె పేరు పౌలా విలియమ్సన్. 2016, 17 సంవత్సరాల్లో వీరిద్దరూ జైల్లో కలుసుకున్నారు. బ్రాన్సన్ ఆమెకు ప్రపోజ్ చేయడంతో అంగీకరించడంతో పెళ్లిచేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాడు. బ్రాన్సన్ జైలు నుంచి తప్పకుండా విడుదల అవుతాడని పౌలా నమ్మేది. అనూహ్యంగా ఆమె 2019లో చనిపోయింది. అయితే ఆమె మరణం అనుమానాస్పదంగా లేదని అప్పట్లో పోలీసులు తెలిపారు.
స్వేచ్ఛ కోసం పోరాటం
బ్రాన్సన్ తనను విడుదల చేయాలంటూ అనేక సార్లు పెరోల్కు దరఖాస్తు చేసుకున్నాడు. అతని గత హింసాత్మక ప్రవృత్తి కారణంగా న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పు ఇవ్వడం లేదు. తాజాగా సోమవారం బ్రాన్సన్ తరఫున వాదించిన న్యాయవాది అతడిని విడుదల చేయాలని కోరాడు. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
తన విడుదల విషయంపై అతను మీడియాతో మాట్లాడుతూ ‘నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి. నేను ఎవరినీ చంపలేదు. ఎవరిపైనా అత్యాచారం చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు జైల్లో ఉన్నానో చెబితే ప్రజలు నమ్మరు. వారు నన్నొక సీరియల్ కిల్లర్ అనుకుంటారని’ ఆవేదన వెలిబుచ్చాడు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి