Polar Bear Jail : ధ్రువపు ఎలుగుబంట్ల జైలు.. అందులో వేస్తే సత్ప్రవర్తన ఖాయం!
‘పోలార్ బేర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా కెనడా(Canada)లోని చర్చిల్ ప్రాంతం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ నివాసాలపై దాడికి యత్నించే ధ్రువపు ఎలుగుబంట్ల(Polar Bear)ను బంధించడానికి ఓ ప్రత్యేకమైన జైలు(Jail)ను ఏర్పాటు చేశారు. ఆ విశేషాలేంటో చదివేయండి.
కెనడా(Canada)లోని చర్చిల్కు చెందిన వన్యప్రాణి సంరక్షణ అధికారికి ఉదయాన్నే ఓ ఫోన్(Phone) కాల్ వచ్చింది. పట్టణంలో ధ్రువపు ఎలుగుబంటి(Polar Bear) సంచరిస్తోందని, దాన్ని బంధించాలని అవతలి వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెంటనే తన బృందంతో రంగంలోకి దిగిన ఆ అధికారి ధ్రువపు ఎలుగుబంటి ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆహారం దొరక్కపోవడంతో ఆ ఎలుగుబంటి కోపంతో ఇంటి కిటికీని బలంగా బాదుతోంది. దాంతో మత్తు తూటా అమర్చిన గన్(Gun)తో దాన్ని షూట్ చేశారు. అప్పటి వరకు బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి కాస్త మెత్తబడింది. మత్తు ప్రభావంతో ఓ చోట కుప్పకూలింది. వెంటనే అధికారులు వలలో దాన్ని బంధించి ‘పోలార్ బేర్ జైలు’కు తరలించారు.
దాడి చేస్తే కాల్చేసేవారు!
గతంలో చర్చిల్లో ధ్రువపు ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేయడానికి యత్నిస్తే వాటిని కాల్చి చంపేవారు. ఆహారం(Food) కోసం నివాసాల మధ్యలోకి వచ్చి అవి తూటాలకు బలయ్యేవి. కొన్నిసార్లు ఎలుగుబంట్లు దాడి చేయడంతో మనుషులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 1982లో తొలిసారి వాటిని బంధించడం మొదలుపెట్టారు. ‘హౌస్ డి-20’ పేరుతో ఉన్న భవనంలోకి ఎలుగుబంట్లను తరలించేవారు. ఈ భవనాన్ని గతంలో మిలటరీ అధికారులు శవాగారంలా ఉపయోగించేవారు. కాలక్రమంలో ఇదే ‘పోలార్ బేర్ జైల్’గా మారింది. అధికారికంగా దీన్ని ‘పోలార్ బేర్ హోల్డింగ్ ఫెసిలిటీ’గా పిలుస్తుంటారు. తొలుత ఈ జైలులో 20 సెల్స్ ఉండేవి. తరువాత అవసరాలు పెరగడంతో 28కి విస్తరించారు.
బంధిస్తే ఏమవుతుంది?
జైలు గదుల్లో రెండు ధ్రువపు ఎలుగుబంట్లను ఒక చోట కలిపి ఉంచితే అవి ఘర్షణకు దిగుతాయట. అందుకే విడివిడిగానే సెల్లో ఉంచుతారు. సాధారణంగా 2 నుంచి 30 రోజులపాటు ధ్రువపు ఎలుగుబంట్లను సెల్స్లోనే బంధిస్తారు. ఆ సమయంలో వాటి ప్రవర్తనలో మార్పును నిశితంగా గమనిస్తారు. ఒక చోట బంధించడం వల్ల ఎలుగుబంట్లు తాము జనావాసాల్లోకి వెళితే చిక్కుల్లో పడతామనే భావనకు వస్తాయి. వాటికి అవసరం మేరకు నీరు తప్ప ఆహారం కూడా ఇవ్వరు. ఎందుకంటే సహజంగానే ధ్రువపు ఎలుగుబంట్లకు ఆహారం లేకుండా కొన్ని నెలలపాటు జీవించగలిగే శక్తి ఉంటుంది. పైగా ఆహారం, నీరు ఇవ్వడం మొదలుపెడితే అవి జైలు వాతావరణానికి అలవాటుపడిపోతాయి. జైలు జీవితం పట్ల విరక్తి చెందిన ఎలుగుబంట్లు గోడలకు ఆనుకొని దీనంగా కూర్చుండిపోతాయి. ఎలుగుబంట్లకు ఆ శిక్ష సరిపోతుందని భావిస్తే వాటిని తిరిగి మంచు ప్రదేశంలో వదిలివేస్తారు. హుడ్సన్ బేలో సాధారణంగా వేసవి కాలంలో మంచు కరిగిపోతుంది. చలికాలంలో మంచు గడ్డకట్టడం మొదలవుతుంది. అందుకే చలికాలం మొదలుకాగానే వాటికి మత్తుమందు ఇచ్చి హెలికాప్టర్లలో తీసుకెళ్లి మంచు ప్రదేశాల్లో వదిలిపెడతారు.
మంచు కరిగి.. ఆహారం కరవు!
ప్రపంచంలో దాదాపు 31 వేల ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నట్లు ఒక అంచనా. కెనడాలోని చర్చిల్లో 850 నివాసాలున్నాయి. ఈ పట్టణానికి సమీపంలో ‘హడ్సన్ బే’లోనూ దాదాపు 900లకు పైగా ధ్రువపు ఎలుగుబంట్లు జీవిస్తున్నాయి. ఈ ధ్రువపు ఎలుగుబంట్లను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. చలికాలంలో మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో అవి సీల్స్ను వేటాడుతాయి. జులైలో మంచు కరగడం ప్రారంభం కాగానే మంచును విడిచి ధ్రువపు ఎలుగుబంట్లు నేలపైకి వెళ్లిపోతాయి. దాంతో వాటికి ఆహారం కరవవుతుంది.
అప్పటికే గతంలో తిన్న ఆహారాన్ని శరీరంలో కొవ్వుగా మార్చుకొని ఉంటాయి. ఆ కొవ్వు సహాయంతో కొన్ని నెలలపాటు ఆహారం లేకుండానే మనుగడ సాగించగలుగుతాయి. కొన్నిసార్లు మాత్రం ఆహారాన్వేషణలో భాగంగా జనావాసాల్లో వెళ్లే ప్రయత్నం చేస్తాయి. కెనడా అధికారిక లెక్కల ప్రకారం ధ్రువపు ఎలుగుబంట్ల జనాభా గత ఐదేళ్లలో 27 శాతం తగ్గింది. ప్రతి సంవత్సరం మంచు తగ్గడం మూలంగా ధ్రువపు ఎలుగుబంట్ల వేటకు కావాల్సినన్ని సీల్స్ దొరకడం లేదు. దాంతో అవి కొవ్వును దాచుకోవడం గగనమైపోయినట్లు సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్