Coral Reefs : ప్రమాదంలో పగడపు దీవులు.. మేలుకోకపోతే అంతమే!
వివిధ వర్ణాల్లో కనువిందు చేసే అందమైన పగడపు దీవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి.
ఈ ప్రపంచంలోని ఎన్నో అద్భుతాల్లో పగడపు దీవులు కూడా ఒకటి. మానవాళికి, సముద్ర జీవులకు మేలు చేస్తూ ఇవి వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి. అసలు పగడపు దిబ్బలు ఎలా ఏర్పడతాయి? అవి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి..
ఏమిటీ పగడపు దీవులు?
సముద్ర తీరాల్లో అందమైన పగడపు దిబ్బలంటాయి(Coral Reefs). రంగు రంగుల్లో ఉన్న వాటిని చూడగానే రాళ్లుగా భావిస్తాము. నిజానికి అవి రాళ్లు కావు. పాలిప్స్ అనే జీవులు. జూజాంతలీ(Zooxanthellae)గా పిలిచే అల్గే(algae) పాలిప్స్ సమూహాలకు అతుక్కొని వాటికి కావాల్సిన కిరణజన్య సంయోగ క్రియ(photosynthesis), పోషకాలను అందిస్తాయి. దాంతో పగడపు దిబ్బలు రంగు సంతరించుకుంటాయి. పాలిప్స్, అల్గేలు సహజీవనం సాగిస్తుంటాయి. పగడపు దిబ్బలు సమూహంతో పగడపు దీవి ఏర్పడాలంటే ఆ ప్రక్రియ ఒక రోజులో జరిగేది కాదు. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న భూతాపం, కాలుష్యం కారణంగా జూజాంతలీ.. పాలిప్స్ను విడిచి వెళ్తోందట. దాంతో పగడపు దిబ్బలు రంగు కోల్పోతున్నాయి. క్రమంగా అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. భూతాపం, కాలుష్యం తగ్గించడానికి మానవులు ప్రయత్నిస్తే మళ్లీ పగడపు దీవులు పునరుజ్జీవం పోసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎందుకంత ప్రత్యేకం?
దాదాపు వందకుపైగా దేశాల్లో పగడపు దీవులున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై కనిపించే వాటిలో పగడపు దీవులు కూడా ఉంటాయి. అంతటి ప్రత్యేకత వీటికి ఉంది. గడిచిన మూడు దశాబ్దాల్లో నీటిలోపల ఉండే పగడపు దీవుల్లో సగం మాయమైపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్దం మధ్య కల్లా అది 90 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద గ్రేట్ బారియర్ రీఫ్(Great Barrier Reef)పై ఇప్పటికే వాతావరణంలోని మార్పుల ప్రభావం కనిపిస్తోంది.
పగడపు దిబ్బలు లేకుండా బతకలేమా?
ప్రకృతి వేటినీ అనవసరంగా సృష్టించదు. సృష్టిలో చాలా వరకు మానవులకు మేలు చేస్తున్నాయే కానీ, కీడు చేయట్లేదు. అలా పగడపు దిబ్బలు కూడా మానవులకు మంచి చేస్తున్నాయి. సముద్రంలోని బలమైన అలలు, తుపానులు(storm) వచ్చినప్పుడు తీర ప్రాంతాలు ప్రభావితం కాకుండా 97శాతం తరంగ శక్తికి(wave energy) పగడపు దిబ్బలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఫలితంగా తుపానుల తీవ్రత తగ్గుతోంది. తీరం కోతకు గురి కాకుండా ఉంటోంది. దాంతో పరోక్షంగా దాదాపు 20 కోట్ల మంది జనాభాను ఇవి రక్షిస్తున్నాయి. అమెరికాకు చెందిన భూగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 1.8లక్షల కోట్ల డాలర్ల(dollar) నష్టాన్ని పగడపు దీవులు తగ్గిస్తున్నాయి. ఫ్లోరిడా, హవాయ్, ప్యూర్టోరికో వంటి ప్రసిద్ధ నగరాల మనుగడ పగడపు దీవుల చలువేనని చెప్పవచ్చు. పగడపు దిబ్బలు 1 మీటరు ఎత్తు తగ్గితే దాదాపు 5 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక మానవులకు అవసరమైన ప్రాణాధార ఔషధాలు(medicine) చాలా వరకు సముద్ర జీవుల నుంచి సేకరించిన పదార్థాల నుంచి తయారవుతున్నాయి. పగడపు దీవులు లేని చోట ఆ సముద్ర జీవులు బతుకు సాగించలేవు. దాంతో మార్కెట్లో దొరకుతున్న రకరకాల మందులు, ప్రాణాంతక వ్యాధుల్ని కట్టడి చేసే ఔషధాలు సమీప భవిష్యత్తులో లభించకుండా పోయే ప్రమాదం ఉంది. మానవులు ఏటా 150 మిలియన్ టన్నులు చేపలను(fish) తింటున్నారు. దాంతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఒమెగా లాంటివన్నీ సమృద్ధిగా పొందుతున్నారు. సముద్ర జీవులు అంతరించిపోతే ఇక ప్రతి మనిషి రోగాలతో రొప్పుతూ ఉండాల్సిందే. పగడపు దిబ్బలున్న చోట పర్యాటకం కూడా వృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలకు పగడపు దీవుల ఆధారంగా ఆదాయం లభిస్తోంది. ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ను సందర్శించడానికి ఏటా లక్షల మంది పర్యాటకులు వెళ్తుంటారు. మన దేశంలో గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ మయన్మార్, అండమాన్ అండ్ నికోబార్, లక్షదీవుల్లో పగడపు దిబ్బలున్నాయి. కేరళ(kerala), తమిళనాడు, పాండిచ్చేరి తీరాల్లోనూ అక్కడక్కడా పగడపు దిబ్బలు కనిపిస్తాయి. వాటిని కాపాడటానికి భారత ప్రభుత్వం(indian government) ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చింది. పగడపు దిబ్బలున్న ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, మైనింగ్ వంటి కార్యకలాపాలు చేయకూడదని స్పష్టం చేసింది.
మేలు మనుషులకే కాదు!
భూమిపై 0.5శాతం లోపే పగడపు దిబ్బలున్నాయి. కానీ, సముద్రపు జీవుల్లో 25 శాతం అక్కడే తలదాచుకుంటున్నాయి. మనం అక్వేరియాల్లో చూస్తున్న రంగురంగుల చేపలు ఇక్కడే సంచరిస్తుంటాయి.
తక్షణ కర్తవ్యం ఏమిటి?
పగడపు దిబ్బలు ఒక్క రోజుతో పుట్టికొచ్చినవి కావు. వాటికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే మానవాళి వాటిని రక్షిస్తూ.. మనుగడ సాగించాలి. ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను(temperature) కట్టడి చేయాలి. వీలైనంత వరకు చెట్లను నాటాలి. తద్వారా భూతాపాన్ని తగ్గించాలి. క్రిమి సంహారక మందుల(pesticides) వాడకం మంచిది కాదు. వాటి తాలుకా అవశేషాలు సముద్రంలోకి చేరడంతో పగడపు దీవులు దెబ్బతింటున్నాయి. పగడపు దీవులున్న చోట భారీ ఓడల లంగర్ వేయకూడదు. ఇలాంటి చర్యలతో పగడపు దిబ్బలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్