china : ఆ ‘కూతురు ఉద్యోగం’ వెరైటీగా చేస్తోంది.. చైనాలో వింత సంఘటన!
తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి ఓ మహిళ తాను చేస్తున్న ఉద్యోగం (Job) మానేసింది. మంచిదేగా అనుకుంటున్నారా?‘ఫుల్ టైమ్ డాటర్’గా (Full time daughter) కొనసాగేందుకు ఆమె వారి దగ్గర జీతం (Salary) తీసుకుంటోంది. చైనాలో (China) చోటు చేసుకున్న ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకోండి.
చైనాకు (China) చెందిన నియానన్ అనే మహిళ ఏడాది కిందట ఓ న్యూస్ ఏజెన్సీలో పనిచేసేది. అందువల్ల 24 గంటలూ ఆమెకు ఫోన్లు వస్తుండేవి. గత 15 ఏళ్లుగా ఆ పని చేస్తూ తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైంది. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేస్తే.. అంత కన్నా మంచి ఉద్యోగం ఇస్తామని ఆమె తల్లిదండ్రులు తనకు భరోసా ఇచ్చారు. అంతే కాదు ఆర్థికంగానూ అండగా నిలబడతామని చెప్పారు. ఇంతకీ వారు ఇస్తామన్న ఉద్యోగం ఏంటో తెలుసా? ‘కూతురు ఉద్యోగం’. అవును.. మీరు చదువుతున్నది నిజమే. నియానన్ ఇంట్లోనే ఉంటూ తమ బాగోగులు చూసుకుంటే నెలకు 4వేల యువాన్లు ఇస్తామని చెప్పారు. దాంతో నియానన్ ఇంట్లో ఉద్యోగం చేయడానికి వెంటనే ఓకే చెప్పేసింది. ఫలితంగా ఆమెకు అద్దె ఇంట్లో ఉండాల్సిన బాధలు తప్పాయి. తిండిపై పెట్టే ఎన్నో ఖర్చులు తగ్గాయి. ఇంకా గృహోపకరణాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె ‘ఫుల్ టైమ్ డాటర్’గా కొనసాగుతోంది.
ఇదే ఉద్యోగ జీవితం!
నియానన్ ఏడాది కాలంగా ఇంటిపట్టున ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటోంది. దాని గురించి చెబుతూ ఈ కొత్త వృత్తి ‘ప్రేమతో నిండిపోయిందని’ అంటోంది. ఆమె తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కు వెళ్తోంది. వారితో కలిసి వంట చేస్తోంది. ఎక్కడికెళ్లాలన్నా తానే డ్రైవింగ్ చేస్తోంది. అంతే కాదు రోజూ ఓ గంటపాటు వారితో కలిసి నృత్యం చేస్తోంది.
ఇవే కాకుండా ఇంట్లో, బయట ఉన్న ఎలక్ట్రానిక్ సామగ్రి నిర్వహణ చూడటం, నెలకు ఒకటి లేదా రెండు ట్రిప్ల విహార యాత్ర ప్లాన్ చేయడం కూడా ఆమె ఉద్యోగంలో ఓ భాగం. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్నప్పటికీ ఆమెకు మరింత ధనం సంపాదించాలనే ఆలోచనలు వస్తున్నాయట. వాటి గురించి ప్రస్తావిస్తే ‘నీకు ఏ పని నచ్చితే దానికే వెళ్లమని’ ఆ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఒక వేళ ఏ పనీ చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండి మాతో గడపమని చెబుతున్నారు.
జీతం ఎలా ఇస్తున్నారంటే..
వృద్ధులైన తల్లిదండ్రులు నియానన్కు జీతం ఎలా ఇస్తున్నారనే సందేహం చాలా మందికి ఈ పాటికే వచ్చి ఉంటుంది. వారికి నెలకు లక్ష యువాన్ల పింఛను వస్తుంది. అందులో నుంచే నియానన్కు 4వేల యువాన్లు చెల్లిస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఆన్లైన్లో పెద్ద చర్చకు తావిచ్చింది. కొందరు ఆ మహిళ తీరును విమర్శిస్తుండగా.. మరికొందరు తల్లిదండ్రులను మెచ్చుకుంటున్నారు.
కొందరికి మోదం.. ఖేదం
‘ఇలా తల్లిదండ్రులపై ఆధారపడి బతకడాన్ని చైనీస్ భాషలో ‘కెన్ లావ్’ అంటారు. అయినా ‘ఫుల్ టైమ్ డాటర్’ అని పిలవడం ఏంటని’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఆ తల్లిదండ్రులు, కూతురు సంతోషంగా జీవిస్తుంటే మధ్యలో మనకెందుకు అభ్యంతరం’ అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
చైనాలో గత కొన్ని దశాబ్దాలుగా ‘996’ పని సంస్కృతి ఉంది. అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేయడం. దీంతో చాలా మంది అక్కడ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. యువత ఏకంగా పని చేయడమే మానేసి ‘లేయింగ్ డౌన్’ అనే సంస్కృతి వైపు మళ్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నియానన్ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండటం తప్పేమీ కాదని కొందరు వాదిస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్