Hiroshima: అణుబాంబుకు ఆహుతై.. అగ్రరాజ్యాల సదస్సుకు వేదికై..!
రెండో ప్రపంచ యుద్ధకాలంలో (World War II) అణ్వాయుధ ప్రయోగంతో విధ్వంసానికి గురైన హిరోషిమా (Hiroshima) నగరం జీ7 దేశాల సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మానవ చరిత్రలో తొలిసారి అణుబాంబు (Nuclear Bomb) తీవ్రతను చవిచూసిన నగరంగా హిరోషిమా చరిత్రలో నిలిచిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం (World War II)లో ఈ అణుబాంబు విధ్వంసానికి వేల మందిని కోల్పోవడంతోపాటు దశాబ్దాల పాటు జపాన్ (Japan) పౌరుల మౌనవేదనకు మారుపేరుగా నిలిచిందీ నగరం. లక్షల కుటుంబాల్లో విషాదగాథకు సాక్ష్యంగా నిలిచిన ఆ ప్రదేశమే ఇప్పుడు అగ్రదేశాల సదస్సు (జీ7)కు వేదికయ్యింది. ఈ తరుణంలో 1945లో హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగిన విషయాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే..!
రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్లోని హిరోషిమా (Hiroshima) నగరంపై తొలిసారి అణుదాడి చేసింది. 1945ఆగస్టు 6న అమెరికా ఈ దాడి జరిపింది. అనంతరం మరో మూడు రోజులకు (ఆగస్టు 9) నాగసాకి (Nagasaki) నగరంపై రెండో అణుదాడి జరిగింది. అగ్రరాజ్యం ఆగ్రహానికి గురైన హిరోషిమా, నాగసాకిలపై ఈ దాడులతో రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడింది! చుట్టూ కొండలు.. మధ్యలో చదునైన ప్రదేశంలో హిరోషిమా నగరం ఉంది. తాము తయారు చేసిన అణ్వాయుధాన్ని పరీక్షించడంతోపాటు భారీ నష్టాన్ని కలిగించడమే అమెరికా లక్ష్యం. అణ్వాయుధాన్ని సరైన ఎత్తులో ప్రయోగిస్తే.. నగరం మొత్తం నాశనం అవుతుందనే ఉద్దేశంతోనే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
‘లిటిల్ బాయ్’తో..
అమెరికా తయారు చేసిన ఆ అణ్వాయుధానికి ‘లిటిల్ బాయ్’ (Little Boy) అని నిక్నేమ్ పెట్టారు. అమెరికా వాయుసేనకు చెందిన పైలట్ పాల్ టిబ్బెట్ దాని ప్రయోగానికి సిద్ధమయ్యారు. బోయింగ్ బీ-29 బాంబర్ విమానం ‘ఎనోలా గే’ (Enola Gay)ని నడిపించిన ఆయన.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.15 నిమిషాలకు హిరోషిమా నగరంపై ఆ అణుబాంబును జారవిడిచారు. ఈ క్రమంలోనే 15 కిలోటన్నుల టీఎన్టీ శక్తిని విడుదల చేస్తూ ‘లిటిల్బాయ్’ పేలిపోయింది. అక్కడ భూఉపరితల ఉష్ణోగ్రతలు సుమారు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్కు చేరినట్లు అంచనా. ఆ భారీ అణ్వాయుధం దెబ్బకు 70శాతం భవనాలు ధ్వంసమయ్యాయి. వాటి నుంచి వెలువడిన రేడియేషన్ ప్రభావం దశాబ్దాల పాటు ఆ నగరాన్ని వెంటాడింది. దాడి చేసిన 16 గంటల తర్వాత అది అణ్వాయుధమని అమెరికా ప్రకటించింది.
‘ఫ్యాట్మ్యాన్’ రూపంలో..
హిరోషిమాపై దాడి నుంచి తేరుకోకముందే.. ఆగస్టు 9న నాగసాకి నగరంపై ‘ఫ్యాట్మ్యాన్’(Fat Man)ను అమెరికా ప్రయోగించింది. ఫ్యాట్మ్యాన్ అనేది మరో అణుబాంబుకు పెట్టిన పేరు. లిటిల్ బాయ్ కంటే ఇది మరింత శక్తిమంతమైనది. అయినప్పటికీ కొంత తక్కువ విధ్వంసాన్ని సృష్టించింది. నాగసాకి నగరం చదునుగా కాకుండా, ఎత్తుపల్లాలుగా ఉండటంతో తక్కువ నష్టం వాటిల్లినట్లు చెబుతారు. ఇలా ఈ రెండు నగరాలపై జరిగిన అణుదాడిలో సుమారు మొత్తంగా 1.10 లక్షల నుంచి 2.10లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. హిరోషిమాలో పేలుడు సంభవించిన వెంటనే 80వేల మంది మృత్యువాతపడగా.. రేడియేషన్ దాటికి వేల మంది జీవచ్ఛవాలుగా మారారు. ఆ మారణహోమం నుంచి బతికి బయటపడిన వారు కూడా కొన్నేళ్ల తర్వాత క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డారు. ఆ దుర్ఘటన జరిగి 77 ఏళ్లు పూర్తైనప్పటికీ.. నాటి చేదు జ్ఞాపకాల నుంచి జపాన్ మాత్రం పూర్తిగా బయటపడలేదు.
అమెరికా ఏం చేసింది..?
రెండో ప్రపంచయుద్ధం సమయంలో మాన్హటన్ ప్రాజెక్టు పేరుతో అణ్వాయుధ సాంకేతికతను అమెరికా రహస్యంగా అభివృద్ధి చేసింది. బాంబు రూపకర్తల్లో ఒకరైన రాబర్ట్ ఒపెన్హైమెర్.. 1945 జులైలో దీనిని పరీక్షించారు. అనంతరం నెల తిరగకముందే.. ఈ ‘లిటిల్ బాయ్’ను ఆగస్టు 6న హిరోషిమాపై ప్రయోగించారు. మరుసటి బాంబును ఆగస్టు 9న నాగసాకిపై వేశారు. హిరోషిమాలో 70శాతం భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆస్కారం లేకుండా పోయింది. ముఖ్యంగా నగరంలోని ఆస్పత్రులతో పాటు 90శాతం మంది వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.
జపాన్ నగరాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దాడుల అనంతరం అణ్వాయుధాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆ ఘటన తర్వాత ఎన్నో దేశాలు అణ్వాయుధాలను భారీగా సమకూర్చుకొన్నాయి. ఎన్నోసార్లు అణ్వాయుధాల ప్రయోగాస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ దేశం కూడా వాటిని ఉపయోగించలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సందర్భంగా అణ్వాయుధాల ప్రయోగంపై మరోసారి చర్చ జరుగుతోన్న వేళ.. తీవ్ర విషాదాన్ని చవిచూసిన హిరోషిమా నగరం చేదు జ్ఞాపకాలతో అగ్రరాజ్యల సదస్సు (జీ7)కు వేదికగా మారింది. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్