Hiroshima: అణుబాంబుకు ఆహుతై.. అగ్రరాజ్యాల సదస్సుకు వేదికై..!
రెండో ప్రపంచ యుద్ధకాలంలో (World War II) అణ్వాయుధ ప్రయోగంతో విధ్వంసానికి గురైన హిరోషిమా (Hiroshima) నగరం జీ7 దేశాల సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మానవ చరిత్రలో తొలిసారి అణుబాంబు (Nuclear Bomb) తీవ్రతను చవిచూసిన నగరంగా హిరోషిమా చరిత్రలో నిలిచిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం (World War II)లో ఈ అణుబాంబు విధ్వంసానికి వేల మందిని కోల్పోవడంతోపాటు దశాబ్దాల పాటు జపాన్ (Japan) పౌరుల మౌనవేదనకు మారుపేరుగా నిలిచిందీ నగరం. లక్షల కుటుంబాల్లో విషాదగాథకు సాక్ష్యంగా నిలిచిన ఆ ప్రదేశమే ఇప్పుడు అగ్రదేశాల సదస్సు (జీ7)కు వేదికయ్యింది. ఈ తరుణంలో 1945లో హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగిన విషయాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే..!
రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్లోని హిరోషిమా (Hiroshima) నగరంపై తొలిసారి అణుదాడి చేసింది. 1945ఆగస్టు 6న అమెరికా ఈ దాడి జరిపింది. అనంతరం మరో మూడు రోజులకు (ఆగస్టు 9) నాగసాకి (Nagasaki) నగరంపై రెండో అణుదాడి జరిగింది. అగ్రరాజ్యం ఆగ్రహానికి గురైన హిరోషిమా, నాగసాకిలపై ఈ దాడులతో రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడింది! చుట్టూ కొండలు.. మధ్యలో చదునైన ప్రదేశంలో హిరోషిమా నగరం ఉంది. తాము తయారు చేసిన అణ్వాయుధాన్ని పరీక్షించడంతోపాటు భారీ నష్టాన్ని కలిగించడమే అమెరికా లక్ష్యం. అణ్వాయుధాన్ని సరైన ఎత్తులో ప్రయోగిస్తే.. నగరం మొత్తం నాశనం అవుతుందనే ఉద్దేశంతోనే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
‘లిటిల్ బాయ్’తో..
అమెరికా తయారు చేసిన ఆ అణ్వాయుధానికి ‘లిటిల్ బాయ్’ (Little Boy) అని నిక్నేమ్ పెట్టారు. అమెరికా వాయుసేనకు చెందిన పైలట్ పాల్ టిబ్బెట్ దాని ప్రయోగానికి సిద్ధమయ్యారు. బోయింగ్ బీ-29 బాంబర్ విమానం ‘ఎనోలా గే’ (Enola Gay)ని నడిపించిన ఆయన.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.15 నిమిషాలకు హిరోషిమా నగరంపై ఆ అణుబాంబును జారవిడిచారు. ఈ క్రమంలోనే 15 కిలోటన్నుల టీఎన్టీ శక్తిని విడుదల చేస్తూ ‘లిటిల్బాయ్’ పేలిపోయింది. అక్కడ భూఉపరితల ఉష్ణోగ్రతలు సుమారు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్కు చేరినట్లు అంచనా. ఆ భారీ అణ్వాయుధం దెబ్బకు 70శాతం భవనాలు ధ్వంసమయ్యాయి. వాటి నుంచి వెలువడిన రేడియేషన్ ప్రభావం దశాబ్దాల పాటు ఆ నగరాన్ని వెంటాడింది. దాడి చేసిన 16 గంటల తర్వాత అది అణ్వాయుధమని అమెరికా ప్రకటించింది.
‘ఫ్యాట్మ్యాన్’ రూపంలో..
హిరోషిమాపై దాడి నుంచి తేరుకోకముందే.. ఆగస్టు 9న నాగసాకి నగరంపై ‘ఫ్యాట్మ్యాన్’(Fat Man)ను అమెరికా ప్రయోగించింది. ఫ్యాట్మ్యాన్ అనేది మరో అణుబాంబుకు పెట్టిన పేరు. లిటిల్ బాయ్ కంటే ఇది మరింత శక్తిమంతమైనది. అయినప్పటికీ కొంత తక్కువ విధ్వంసాన్ని సృష్టించింది. నాగసాకి నగరం చదునుగా కాకుండా, ఎత్తుపల్లాలుగా ఉండటంతో తక్కువ నష్టం వాటిల్లినట్లు చెబుతారు. ఇలా ఈ రెండు నగరాలపై జరిగిన అణుదాడిలో సుమారు మొత్తంగా 1.10 లక్షల నుంచి 2.10లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. హిరోషిమాలో పేలుడు సంభవించిన వెంటనే 80వేల మంది మృత్యువాతపడగా.. రేడియేషన్ దాటికి వేల మంది జీవచ్ఛవాలుగా మారారు. ఆ మారణహోమం నుంచి బతికి బయటపడిన వారు కూడా కొన్నేళ్ల తర్వాత క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డారు. ఆ దుర్ఘటన జరిగి 77 ఏళ్లు పూర్తైనప్పటికీ.. నాటి చేదు జ్ఞాపకాల నుంచి జపాన్ మాత్రం పూర్తిగా బయటపడలేదు.
అమెరికా ఏం చేసింది..?
రెండో ప్రపంచయుద్ధం సమయంలో మాన్హటన్ ప్రాజెక్టు పేరుతో అణ్వాయుధ సాంకేతికతను అమెరికా రహస్యంగా అభివృద్ధి చేసింది. బాంబు రూపకర్తల్లో ఒకరైన రాబర్ట్ ఒపెన్హైమెర్.. 1945 జులైలో దీనిని పరీక్షించారు. అనంతరం నెల తిరగకముందే.. ఈ ‘లిటిల్ బాయ్’ను ఆగస్టు 6న హిరోషిమాపై ప్రయోగించారు. మరుసటి బాంబును ఆగస్టు 9న నాగసాకిపై వేశారు. హిరోషిమాలో 70శాతం భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆస్కారం లేకుండా పోయింది. ముఖ్యంగా నగరంలోని ఆస్పత్రులతో పాటు 90శాతం మంది వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.
జపాన్ నగరాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దాడుల అనంతరం అణ్వాయుధాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆ ఘటన తర్వాత ఎన్నో దేశాలు అణ్వాయుధాలను భారీగా సమకూర్చుకొన్నాయి. ఎన్నోసార్లు అణ్వాయుధాల ప్రయోగాస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ దేశం కూడా వాటిని ఉపయోగించలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సందర్భంగా అణ్వాయుధాల ప్రయోగంపై మరోసారి చర్చ జరుగుతోన్న వేళ.. తీవ్ర విషాదాన్ని చవిచూసిన హిరోషిమా నగరం చేదు జ్ఞాపకాలతో అగ్రరాజ్యల సదస్సు (జీ7)కు వేదికగా మారింది. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె