Hockey world cup : నవీన్ పట్నాయక్ ప్రోత్సాహం.. హాకీ జట్టులో నూతనోత్సాహం
హాకీ ప్రపంచకప్ పోటీలకు మూడో సారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. చివరిసారిగా 1975లో జగజ్జేతగా నిలిచిన భారత్.. సొంతగడ్డపై ఈ సారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది.
హాకీ ప్రపంచకప్ పోటీ(Hockey World Cup)లకు మూడో సారి భారత్(india) ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయి. చివరిసారిగా 1975లో జగజ్జేతగా(winner) నిలిచిన భారత్(india).. సొంతగడ్డపై ఈ సారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది.
నవీన్ పట్నాయక్ చొరవతో..
దేశీయ హాకీ క్రీడాకారులను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Naveen Patnaik) ఎంతో ప్రోత్సహిస్తున్నారు. హాకీ అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయించారు. విదేశీ కోచ్లు, ఫిట్నెస్ నిపుణులను రప్పించి ఆటగాళ్లకు శిక్షణ ఇప్పించారు. హాకీ ప్రపంచకప్ గెలిస్తే భారత జట్టులోని ఒక్కో ఆటగాడికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారంటే హాకీ పట్ల ఆయనకున్న మక్కువను అర్థం చేసుకోవచ్చు.
(Image : Hockey India)
ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేడియం
హాకీ ప్రపంచకప్((Hockey World Cup) కోసం రావుర్కెలాలో ఒడిశా(Odisha) ప్రభుత్వం రూ.260 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో బిర్సాముండా స్టేడియం నిర్మించింది. అందులో 20వేలకు పైగా సీటింగ్ సామర్థ్యం ఉంది. క్రీడాకారుల కోసం ఫైవ్స్టార్ సదుపాయాలతో రెండు వందలకు పైగా గదులున్నాయి. ఈ నెల 5న సీఎం నవీన్ దీనిని ప్రారంభించారు. ప్రపంచంలోని పెద్ద స్టేడియాల్లో ఇది నాలుగోది. దాదాపు 20 మ్యాచ్లు ఇక్కడ జరగనున్నాయి. దీంతోపాటు భువనేశ్వర్(Bhuvaneswar)లో కళింగ స్టేడియం ఉంది. ఇందులో సెమీస్ సహా మొత్తం 24 మ్యాచ్లు నిర్వహించనున్నారు.
తగ్గేదేలే అంటోన్న జట్టు
కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలో జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. 2019లో ప్రధాన కోచ్గా నియమితులైన గ్రాహమ్ రీడ్ చక్కటి సూచనలు ఇస్తూ క్రీడాకారులను ముందుకు నడిపిస్తున్నారు. దాంతో 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సొంతమైంది. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ (2021-22)లో మూడో స్థానం ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోంది.
(Image : Hockey India)
జట్టు సభ్యులు వీరే : హర్మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), అమిత్ రోహిదాస్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సురేందర్ కుమార్, మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, మణ్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, క్రిషన్ పాథక్, సంజీప్, శ్రీజేష్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వరుణ్ కుమార్, ఆకాశ్దీప్ సింగ్, వివేక్ సాగర్, సుఖ్జీత్ సింగ్.
తొలి ఢీ స్పెయిన్తోనే..
భారత్ తొలి మ్యాచ్ ఇవాళ సాయంత్రం స్పెయిన్తో జరగనుంది. తొలిసారి కప్పును ముద్దాడాలనే లక్ష్యంతో ఆ దేశం కూడా తహతహలాడుతూ ఉంది. 1971, 1998లో రన్నరప్గా నిలిచిన స్పెయిన్ జట్టు.. 2006లో కాంస్యం సొంతం చేసుకుంది.
ప్రపంచ కప్లో మనం..
మొట్టమొదటి పురుషుల ప్రపంచకప్ (1971)లో కాంస్యం, రెండో ప్రపంచకప్ (1973)లో రజతం, మూడో ప్రపంచకప్ (1975)లో పసిడి భారత్ గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?