India-Pak Heritage : వారసత్వ జ్ఞాపకాలకు వారధి.. ఈ ఫేస్బుక్ గ్రూప్!
దేశ విభజన కారణంగా పాక్ నుంచి భారత్కు వలసొచ్చిన ప్రజలకు మంచి జ్ఞాపకాలను పంచుతోంది ఓ సామాజిక మాధ్యమ గ్రూపు(Social media).
(Image : Noshaba facebook)
అవిభక్త భారత దేశం 1947లో భారత్-పాక్(India-Pak)లుగా విడిపోయాయి. కలలో కూడా ఊహించని ఈ పరిణామంతో సామాన్యులు అభద్రతా భావానికి గురయ్యారు. అప్పటికప్పుడు పాక్(Pak) భూభాగంలోని కొందరు హిందువులు భారత్(India) వైపు, ఇక్కడి ముస్లింలు పాక్ వైపు మూటాముల్లె సర్దుకుని పయనమయ్యారు. ఇరుదేశాల్లో వివిధ చోట్ల వారు స్థిరపడిపోయారు. ఇప్పటికి 75 ఏళ్లు గడిచిపోయాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో చిన్న పిల్లలుగా ఉన్న వారంతా ఇప్పుడు దాదాపుగా భూమిపై లేరు. ఉన్న కొద్ది మందీ ఎప్పుడైనా అవకాశం వస్తే తమ సొంతింటిని, ఊరిని, పొలాలను చూడాలని పరితపిస్తున్నారు. కానీ పాక్ వెళ్లే సాహసం చేయలేక తమ కొడుకులకు, మనవళ్లకు ఆ బాల్య స్మృతులను చెబుతూ తృప్తి పడుతున్నారు.
1.5లక్షల మంది సభ్యులు
పాక్ నుంచి వలస వచ్చిన చాలా కుటుంబాలు ఉత్తర భారతంలో స్థిరపడ్డాయి. వారి పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకొనేందుకు వారధిలా నిలుస్తోంది ‘ఇండియా పాకిస్థాన్ హెరిటేజ్ క్లబ్’ ఫేస్బుక్(Facebook) గ్రూపు. 1.5లక్షల మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఎక్కడా విద్వేషం కనపడదు. ఇరు దేశాల్లోని చారిత్రక కట్టడాలు, అందమైన ప్రదేశాలు, ప్రముఖులు, పురాతన నివాసాలు తదితర అంశాలపై మాత్రమే పోస్టులుంటాయి. వాటి ద్వారా అనేక చారిత్రక విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఎక్కువగా 1947లో విభజన సందర్భంగా విడిపోయిన అనేక కుటుంబాలను ఈ గ్రూపు దగ్గర చేస్తోంది.
వలస కథలు పంచుకుంటూ..
ఈ గ్రూప్ అడ్మిన్లలో ఒకరైన ఇమ్రాన్ విలియం భారతీయులు ఎవరైనా తమ పూర్వీకులు నివాసం ఉన్న స్థలం చూపించమని అడిగితే వారికి సహాయం చేస్తున్నారు. ఆ ప్రదేశాన్ని వీడియో కాల్స్లో చూపిస్తున్నారు. ఇక్కడి వారు ఆ ప్రాంతాన్ని చూసి తమ తాతలు, తండ్రులు చెప్పిన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటున్నారు. ఈ గ్రూపులో వలస వెళ్లిన వ్యక్తుల కథలు, వారి అనుభవాలను తరచూ పంచుకుంటారు. తమ తాతలు, తండ్రులు కోల్పోయిన పూర్వ స్నేహితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తొలుత ఈ గ్రూప్నకు ‘పంజాబ్ ఖోజ్’(డిస్కవరీ ఆఫ్ పంజాబ్) పేరు పెట్టారు. ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశంతో తరువాత పేరు మార్చారు.
ఎలా పని చేస్తుందంటే..
సామాజిక మాధ్యమాలపై అవగాహన ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ గ్రూప్లో చురుగ్గా ఉంటారు. ఉదాహరణకు ఎవరైనా ‘మా పూర్వీకుల పేరు X.. పాక్లో ఆయన Y అనే ప్రదేశంలో ఉండేవారు. ఆయన స్నేహితుడి పేరు Z. తెలిస్తే చెప్పండి’ అంటూ పోస్టు పెడతారు. ఇదే గ్రూప్లో ఉన్న అవతలి వారిలో ఎవరికైనా ఆ వివరాలపై అవగాహన ఉంటే వెంటనే స్పందిస్తారు. ఆయన మాకు బంధువనో, ఒకే ఊరి వాడనో.. ఇలా తెలిసిన సమాచారం పంచుకుంటారు.
అడ్మిన్ల సహాయం
ఈ గ్రూప్లో చాలా మంది చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అందులోని అడ్మిన్లు పాక్కు చెందిన నోషబా, ఇమ్రాన్ విలియమ్స్, జహీద్ కర్మన్వాలాలు భారత్ నుంచి పాక్ వెళ్లే వారికి తమ వంతు సహాయం చేస్తున్నారు. అక్కడి పూర్వీకుల ఇళ్లు, ఊర్లు, పొలాలు, ఇతర ప్రదేశాలను చూపిస్తూ సహాయపడుతున్నారు. నోషబా ఒక్కరే ఇప్పటి దాకా 200 మంది భారతీయులకు ఈ వెతుకులాటలో సహాయం అందించారు. భారత్ నుంచి కర్తార్పూర్ కారిడార్కు వెళ్లిన చాలా మంది ఆమెను పాక్లో కలుస్తుంటారు. ఆమె సహాయం చేసేందుకు ముందుకొచ్చినా కొన్నిసార్లు వీసా లేకపోవడంతో భారతీయులు ఇతర ప్రాంతాల్లోకి వెళ్లడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
శిథిల దృశ్యాలు
దేశ విభజన సమయంలో ఖాళీ చేసిన చాలా నివాసాలు ఇప్పుడు శిథిలమైపోయాయి. నివాసానికి అనువుగా ఉన్నవాటిలో అక్కడి స్థానికులు ఉంటున్నారు. కొన్నిచోట్ల పెద్ద భవంతులను కళాశాలలు, కార్యాలయాలుగా వినియోగిస్తున్నారు. లాహోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువగా నివాసం ఉండేవారు. దాంతో అప్పట్లో కొన్ని గురుద్వారాలు ఉండేవి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Medicine Racket: నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ ముమ్మర దాడులు
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!
-
BRS: ప్రవీణ్కుమార్ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం: కేసీఆర్
-
Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా తిరు కల్యాణ మహోత్సవం
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
-
PM CARES Fund: పీఎం కేర్స్ నిధులపై పారదర్శకత ఎక్కడ?: కాంగ్రెస్