India-Pak Heritage : వారసత్వ జ్ఞాపకాలకు వారధి.. ఈ ఫేస్బుక్ గ్రూప్!
దేశ విభజన కారణంగా పాక్ నుంచి భారత్కు వలసొచ్చిన ప్రజలకు మంచి జ్ఞాపకాలను పంచుతోంది ఓ సామాజిక మాధ్యమ గ్రూపు(Social media).
(Image : Noshaba facebook)
అవిభక్త భారత దేశం 1947లో భారత్-పాక్(India-Pak)లుగా విడిపోయాయి. కలలో కూడా ఊహించని ఈ పరిణామంతో సామాన్యులు అభద్రతా భావానికి గురయ్యారు. అప్పటికప్పుడు పాక్(Pak) భూభాగంలోని కొందరు హిందువులు భారత్(India) వైపు, ఇక్కడి ముస్లింలు పాక్ వైపు మూటాముల్లె సర్దుకుని పయనమయ్యారు. ఇరుదేశాల్లో వివిధ చోట్ల వారు స్థిరపడిపోయారు. ఇప్పటికి 75 ఏళ్లు గడిచిపోయాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో చిన్న పిల్లలుగా ఉన్న వారంతా ఇప్పుడు దాదాపుగా భూమిపై లేరు. ఉన్న కొద్ది మందీ ఎప్పుడైనా అవకాశం వస్తే తమ సొంతింటిని, ఊరిని, పొలాలను చూడాలని పరితపిస్తున్నారు. కానీ పాక్ వెళ్లే సాహసం చేయలేక తమ కొడుకులకు, మనవళ్లకు ఆ బాల్య స్మృతులను చెబుతూ తృప్తి పడుతున్నారు.
1.5లక్షల మంది సభ్యులు
పాక్ నుంచి వలస వచ్చిన చాలా కుటుంబాలు ఉత్తర భారతంలో స్థిరపడ్డాయి. వారి పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకొనేందుకు వారధిలా నిలుస్తోంది ‘ఇండియా పాకిస్థాన్ హెరిటేజ్ క్లబ్’ ఫేస్బుక్(Facebook) గ్రూపు. 1.5లక్షల మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఎక్కడా విద్వేషం కనపడదు. ఇరు దేశాల్లోని చారిత్రక కట్టడాలు, అందమైన ప్రదేశాలు, ప్రముఖులు, పురాతన నివాసాలు తదితర అంశాలపై మాత్రమే పోస్టులుంటాయి. వాటి ద్వారా అనేక చారిత్రక విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఎక్కువగా 1947లో విభజన సందర్భంగా విడిపోయిన అనేక కుటుంబాలను ఈ గ్రూపు దగ్గర చేస్తోంది.
వలస కథలు పంచుకుంటూ..
ఈ గ్రూప్ అడ్మిన్లలో ఒకరైన ఇమ్రాన్ విలియం భారతీయులు ఎవరైనా తమ పూర్వీకులు నివాసం ఉన్న స్థలం చూపించమని అడిగితే వారికి సహాయం చేస్తున్నారు. ఆ ప్రదేశాన్ని వీడియో కాల్స్లో చూపిస్తున్నారు. ఇక్కడి వారు ఆ ప్రాంతాన్ని చూసి తమ తాతలు, తండ్రులు చెప్పిన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటున్నారు. ఈ గ్రూపులో వలస వెళ్లిన వ్యక్తుల కథలు, వారి అనుభవాలను తరచూ పంచుకుంటారు. తమ తాతలు, తండ్రులు కోల్పోయిన పూర్వ స్నేహితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తొలుత ఈ గ్రూప్నకు ‘పంజాబ్ ఖోజ్’(డిస్కవరీ ఆఫ్ పంజాబ్) పేరు పెట్టారు. ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశంతో తరువాత పేరు మార్చారు.
ఎలా పని చేస్తుందంటే..
సామాజిక మాధ్యమాలపై అవగాహన ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ గ్రూప్లో చురుగ్గా ఉంటారు. ఉదాహరణకు ఎవరైనా ‘మా పూర్వీకుల పేరు X.. పాక్లో ఆయన Y అనే ప్రదేశంలో ఉండేవారు. ఆయన స్నేహితుడి పేరు Z. తెలిస్తే చెప్పండి’ అంటూ పోస్టు పెడతారు. ఇదే గ్రూప్లో ఉన్న అవతలి వారిలో ఎవరికైనా ఆ వివరాలపై అవగాహన ఉంటే వెంటనే స్పందిస్తారు. ఆయన మాకు బంధువనో, ఒకే ఊరి వాడనో.. ఇలా తెలిసిన సమాచారం పంచుకుంటారు.
అడ్మిన్ల సహాయం
ఈ గ్రూప్లో చాలా మంది చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అందులోని అడ్మిన్లు పాక్కు చెందిన నోషబా, ఇమ్రాన్ విలియమ్స్, జహీద్ కర్మన్వాలాలు భారత్ నుంచి పాక్ వెళ్లే వారికి తమ వంతు సహాయం చేస్తున్నారు. అక్కడి పూర్వీకుల ఇళ్లు, ఊర్లు, పొలాలు, ఇతర ప్రదేశాలను చూపిస్తూ సహాయపడుతున్నారు. నోషబా ఒక్కరే ఇప్పటి దాకా 200 మంది భారతీయులకు ఈ వెతుకులాటలో సహాయం అందించారు. భారత్ నుంచి కర్తార్పూర్ కారిడార్కు వెళ్లిన చాలా మంది ఆమెను పాక్లో కలుస్తుంటారు. ఆమె సహాయం చేసేందుకు ముందుకొచ్చినా కొన్నిసార్లు వీసా లేకపోవడంతో భారతీయులు ఇతర ప్రాంతాల్లోకి వెళ్లడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
శిథిల దృశ్యాలు
దేశ విభజన సమయంలో ఖాళీ చేసిన చాలా నివాసాలు ఇప్పుడు శిథిలమైపోయాయి. నివాసానికి అనువుగా ఉన్నవాటిలో అక్కడి స్థానికులు ఉంటున్నారు. కొన్నిచోట్ల పెద్ద భవంతులను కళాశాలలు, కార్యాలయాలుగా వినియోగిస్తున్నారు. లాహోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువగా నివాసం ఉండేవారు. దాంతో అప్పట్లో కొన్ని గురుద్వారాలు ఉండేవి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి