Kedarnath : గడ్డకట్టే మంచులో కేదార్నాథ్ ఆలయం.. ఆరునెలల తరువాత దర్శనం!
హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 25వ తేదీన తెరచుకోనుంది. శీతాకాలం నేపథ్యంలో ఆరు నెలలు మూసి ఉన్న ఈ ఆలయం ఇప్పుడు తెరుస్తున్నారు. ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకతేంటో చదివేయండి మరి..
ఉత్తరాఖండ్లో (uttarakhand) యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్(badrinath) ఆలయాల సందర్శనను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. చార్ధామ్ యాత్ర ఈ హిమాలయ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఏటా యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది 15 లక్షలకు పైగా భక్తులు కేదార్నాథ్ను (Kedarnath Temple) సందర్శించారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయానికి దాదాపు 1200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో (Jyotirlingas) ఇది అత్యంత ఎత్తులో ఉన్న క్షేత్రం. 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయానికి సమీపంలో మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడికి నేరుగా రోడ్డుమార్గం ఉండదు. కాలినడకన లేదా డోలీలు, గాడిదలు, గుర్రాలపై ప్రయాణిస్తూ కొండమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
ఆలయం ఎప్పుడు తెరుస్తారు?
కేదార్నాథ్ ఆలయం తెరిచేందుకు అక్షయ తృతీయ పండగను పరిగణలోకి తీసుకుంటారు. ఏటా మహాశివరాత్రి (Mahashivratri) రోజున ఆలయం తెరిచే తేదీని వెల్లడిస్తారు. పంచాంగం ప్రకారం ఉఖీమఠ్లోని పూజారులు ఆలయాన్ని ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తారు. అలా ఈ ఏడాది ఏప్రిల్ 25న ఆలయ తలుపు తెరవాలని తీర్మానించారు. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను ఏప్రిల్ 22, 27 తేదీల్లో తెరవనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కేదార్నాథ్లో తొలిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రధాన పూజరులు తొలుత స్వామిని దర్శించుకుంటారు. లింగేశ్వరుడి ఆశీస్సులు పొందుతారు. కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరిచే తొలిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు తొలి రోజు దర్శనానికి పోటెత్తుతారు.
మళ్లీ ఎప్పుడు మూసివేస్తారంటే..
ఇక కేదార్నాథ్ ఆలయం (Temple) దీపావళి తరువాత రెండు రోజులకు మూసేస్తారు. రాఖీ పౌర్ణమి తరహాలో భాయ్దూజ్ పండగ తరువాత ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి. కాబట్టి నవంబర్ 14న ఈ ఆలయం మూసివేత ఉంటుందని చెబుతున్నారు. చలికాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో ఉదయం నాలుగు గంటలకే ప్రత్యేక పూజ, అర్చన చేస్తారు. ఆలయ పూజారులు మంత్రాలను పఠిస్తూ 8.30 గంటలకు తలుపులు మూసివేస్తారు. ఈ ఆలయం మూసివేత తేదీని విజయదశమి రోజున నిర్ణయిస్తారు. కేదార్నాథ్ ఆలయం తెరిచే కార్యక్రమంలాగే.. మూసే కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా నిర్వహిస్తారు. గఢ్వాల్ బ్యాండ్ వాయిస్తూ బాబా కేదార్ డోలీని ఉఖీమఠ్కు తరలిస్తారు. కేదారేశ్వరుడికి అక్కడి ఓంకారేశ్వర ఆలయంలో నివాసం ఏర్పాటు చేసి మిగతా ఆరునెలలు పూజలు చేస్తారు.
గడ్డకట్టే మంచు కారణంగానే..
నవంబరులో చలికాలం మొదలు కాగానే హిమాలయాల్లో మంచు కురవడం ప్రారంభమవుతుంది. దాంతో కేదార్నాథ్ ఆలయ పరిసరాలను మొత్తం మంచు కప్పేస్తుంది. ఆలయానికి చేరుకునే మార్గాలు సైతం మూసుకుపోతాయి. దీంతో ఆలయాన్ని ఆరునెలలపాటు మూసివేస్తారు. అందుకే శివుడి విగ్రహాన్ని కేదార్ఖండ్ నుంచి ఉఖీమఠ్కు తరలిస్తారు. యమునోత్రి నుంచి యమునాదేవిని జాంకిఛట్టి సమీపంలోని ఖార్సాలికి తరలిస్తారు. గంగోత్రి నుంచి గంగా మాతను ముఖ్బాకు పల్లకిలో తీసుకెళ్తారు. మంచు ప్రభావం పూర్తిగా తగ్గి వేసవి ప్రారంభమయ్యే సమయంలో తిరిగి ఆ విగ్రహాలను ధామ్లకు తీసుకొస్తారు. మే నెలలో కేదార్నాథ్ దర్శనానికి అత్యధిక మంది భక్తులు తరలివెళ్తారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది.
కేదార్నాథ్ చేరుకునే మార్గాలు..
బస్సు : ఎక్కువ శాతం మంది భక్తులు బస్సులోనే ఈ యాత్రకు వెళ్తుంటారు. రిషికేశ్, హరిద్వార్, శ్రీనగర్ ఇతర ప్రాంతాల నుంచి వెళ్లే బస్సు సర్వీసులతో కేదార్నాథ్ చేరుకోవచ్చు.
విమానం : దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు దేహ్రాదూన్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కేదార్నాథ్కు వెళ్లొచ్చు.
హెలికాప్టర్ : ఖర్చులకు వెనుకాడని యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వీసులు నడుస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థల హెలికాప్టర్లు కూడా కేదార్నాథ్కు తీసుకెళ్తాయి.
రైలు : రైలు ప్రయాణం ద్వారా వచ్చే యాత్రికులు రిషికేశ్ రైల్వేస్టేషన్కు వచ్చి అక్కడి నుంచి కేదార్నాథ్కు బయలుదేరాల్సి ఉంటుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)