cool sunglasses : చిప్స్ ప్యాకెట్స్ వ్యర్థాలతో కూలింగ్ గ్లాసెస్.. ఆలోచన అదిరింది!
మార్కెట్లో దొరికే లేస్, కుర్ కురే వంటి చిరుతిళ్ల ప్యాకెట్లను (Chips packets) ఖాళీ చేసి మనం చెత్తలో పడేస్తుంటాం. అలాంటి వాటిని సేకరించి ‘ఆశయ’ అనే స్టార్టప్ కంపెనీ స్టైలిష్ సన్గ్లాసెస్ (Sunglasses) తయారు చేస్తోంది.
(Image : Anish Malpani twitter)
ఆధునిక ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం రోడ్లపై ఎక్కడ చూసినా ఆ వ్యర్థాలే (Plastic waste) కన్పిస్తున్నాయి. వాటిని ఏరుకొని విక్రయించగా వచ్చిన ఆదాయంతో అనేక మంది బడుగు జీవులు పొట్ట నింపుకొంటున్నారు. ఆ వ్యర్థాలు కొన్ని ఫ్యాక్టరీలకు చేరి తిరిగి ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లుగా మారి మళ్లీ జనావాసంలోకి వస్తున్నాయి. కొన్ని మాత్రం భూమిలో కలిసిపోకుండా ఏళ్ల తరబడి అలానే ఉంటున్నాయి. ఈ ప్లాస్టిక్ సమస్యను నిర్మూలించేందుకు తన వంతుగా ఏం చేయొచ్చని ఆలోచించాడు అనిశ్ మల్పానీ (Anish Malpani) అనే యువకుడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసేందుకు ‘ఆశయ’ అనే స్టార్టప్ కంపెనీని (Startup company) నెలకొల్పాడు.
రెండేళ్లు కొనసాగిన పరిశోధన
ప్లాస్టిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తే బాగుంటుందనే విషయంపై అనిశ్ సుమారు రెండేళ్లు పరిశోధన చేశారు. అందు కోసం ల్యాబ్లో రకరకాల ప్రయత్నాలు జరిగాయి. చివరికి చలువ కళ్లద్దాలు తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాంతో చిప్స్ ప్యాకెట్లు మాత్రమే కాకుండా చాక్లెట్ పేపర్లు, టెట్రా ప్యాక్లు వినియోగించి స్టైలిష్ సన్ గ్లాసెస్ తయారు చేశారు. ‘ప్రపంచంలోనే తొలిసారి తాము చిప్స్ ప్యాకెట్ల వ్యర్థాల నుంచి చలువ కళ్లద్దాలు తయారు చేశామని’ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి అనిశ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తొలుత ఈ ప్రకటనను చాలా మంది కొట్టి పడేశారు. కానీ, కళ్లద్దాలు తయారు చేసిన విధానం గురించి పూర్తి వీడియో చూశాక అంతా నమ్మక తప్పలేదు. తమ ఈ వ్యాపార ప్రయత్నం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అనిశ్ విశ్వసిస్తున్నారు.
తొలుత 500 ఆర్డర్లు
అనిశ్ తాను తయారు చేసిన సరికొత్త కళ్లద్దాల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగానే సుమారు 500 ఆర్డర్లు వచ్చాయట. నిజానికి వీటిని ఎవరైనా కొంటారా?అనే సందేహం అనిశ్కు ఉండేదట. కానీ.. క్రమంగా ఆర్డర్లు ఊపందుకోవడంతో తన కష్టం వృథా కాలేదనుకున్నాడు. అనిశ్ చలువ కళ్లద్దాల తయారీతో కేవలం చెత్త సమస్యకు మాత్రమే పరిష్కారం చూపలేదు. చెత్త ఏరుకుంటూ జీవించే వారి బతుకుల్లో మార్పు తేవడం కోసం ఆ పని చేసే ఆరుగురిని తన ల్యాబ్లో ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. అంతే కాదు కంపెనీలో వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని చెత్త ఏరుకుని జీవించే వారి పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని ప్రకటించాడు.
పేరు సరికొత్తగా..!
అనిశ్ తన చలువ కళ్లద్దాలకు ‘విత్ అవుట్’ అని పేరు పెట్టాడు. కొత్త వస్తువు ఏదైనా మార్కెట్లోకి విడుదల చేస్తే దాని పేరు సరి కొత్తగా ఉంటేనే జనాలను ఆకర్షిస్తుంది. అందుకే ఓ స్నేహితుని సూచన మేరకు ఆ పేరు పెట్టాడు. ఇక ఈ విత్ అవుట్ సన్ గ్లాసెస్ మన్నిక కూడా ఎక్కువేనట. వాటిని కారుతో తొక్కించినా పగిలిపోవని చెబుతున్నారు. సూర్యకాంతి నుంచి రక్షణ కోసం ఈ అద్దాల్లో యూవీ పోలరైజ్డ్ సాంకేతికత వినియోగించారు. ఈ కళ్లద్దాల ఫ్రేమ్పై ఉన్న క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన వ్యర్థాలను ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు, తయారీలో ఎవరు పాల్గొన్నారు వంటి సమాచారం దొరుకుతుంది. ప్రస్తుతానికి అనిశ్ కంపెనీ ల్యాబ్లో మైక్రో పైలట్ ప్లాంట్ నడుస్తోంది. అది రోజుకు 5 కేజీల మల్టీ లేయర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్