Olive ridley : ఆలివ్ రిడ్లీల ‘అమ్మ ఒడి’శా!
ఒడిశాలోని (Odisha) గంజాం జిల్లాలో రుషికుల్యా సముద్ర తీరంలో (Sea coast) తాజాగా ఆలివ్ రిడ్లీ (Olive ridley) తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఏటా నవంబరు, డిసెంబరు మాసాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఈ తీరానికి వస్తాయి. ఇక్కడ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లే ఇప్పుడు పిల్లలై కడలి బాట పట్టాయి.
అరుదైన ఆలివ్ రిడ్లీ (సముద్ర తాబేళ్ల)లకు (Olive ridley) అమ్మ ఒడిలా ఆత్మీయత పంచుతోంది ఒడిశా (Odisha) రాష్ట్రం. ప్రపంచ నలుమూలల నుంచి ఏటా వేలాది ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఇక్కడకు వస్తున్నాయి. తీరంలో గుడ్లు (Eggs) పెట్టి తిరిగి సముద్రంలోకి పయనమవుతున్నాయి. ఒడిశా అటవీ అధికారులు అవి వదిలి వెళ్లిన గుడ్లను అపురూపంగా సంరక్షిస్తున్నారు. అవి పిల్లలుగా మారిన తరువాత సముద్రంలోకి వదులుతున్నారు. ఆలివ్ రిడ్లీల పునరుత్పత్తికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రాలు ఒడిశాలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని గహీర్మఠ (కేంద్రపడ జిల్లా), రుషికుల్యా ముఖద్వారం (గంజాం జిల్లా), దేవీ ముఖద్వారం (పూరీ జిల్లా) తాబేళ్ల పునరుత్పత్తికి ప్రధాన కేంద్రాలు.
రక్షణ చర్యలు భేష్
వేల కి.మీ. దూరం ప్రయాణించి పునరుత్పత్తి కోసం తాబేళ్లు ఒడిశా తీరాలకు వస్తుంటాయి. ఏటా నవంబరు నుంచి మే వరకూ వీటి పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుందని స్థానిక అటవీ అధికారులు చెబుతున్నారు. తాబేళ్ల పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేందుకు భద్రతా శిబిరాలు, తీరాన ఇనుప జాలీలతో రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఆలివ్ రిడ్లీలు గుడ్లు పెట్టే తీరాన్ని శుభ్రపరుస్తున్నారు. ఒక్కో శిబిరంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించి గస్తీ నిర్వహిస్తున్నారు. ఇసుక లోపల ఉన్న వీటి గుడ్లను వీధి కుక్కలు, నక్కలు తినేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తరువాత ఆలివ్ రిడ్లేలు సముద్రంలో ఎంతదూరం వెళుతున్నాయి? మళ్లీ ఎప్పుడు తీరానికి వస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు వాటిలో కొన్నింటికి జియో ట్యాగ్లు అమర్చుతున్నారు. పరిశోధనలకు ఆ చర్య ఉపయుక్తం కానుంది.
ఏమిటీ ఆలివ్ రిడ్లీలు?
సముద్ర తాబేళ్లలో ఎక్కువగా కన్పించేవి ఆలివ్ రిడ్లీ. ఇవి చూడటానికి ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. పుట్టిన వెంటనే ఇవి బూడిద రంగులో ఉన్నప్పటికీ యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా ఆలివ్ వర్ణంలోకి మారిపోతాయి. వీటిపై రక్షణ పొర హృదయాకారంలో ఉంటుంది. పశ్చిమ అట్లాంటిక్ తీరంలో నివసించే ఆలివ్ రిడ్లీలు తూర్పు పసిఫిక్ ఆలివ్ రిడ్లీల కంటే ముదురు రంగులో ఉంటాయి. యుక్త వయసు వచ్చినా వీటి పరిమాణం 2 నుంచి 2.5 అడుగులు మాత్రమే పెరుగుతుంది. ఒక్కొక్కటి 36 నుంచి 49 కిలోల బరువుంటాయి. వీటిలో అతిపెద్దగా కన్పించే జాతి మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఉంది.
ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి?
ఆలివ్ రిడ్లీలు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్టపడతాయి. పసిఫిక్, అంట్లాంటిక్, హిందూ మహాసముద్ర తీరాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇక మన దేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం తీరాల్లో ఆలివ్ రిడ్లీల సంతతి అత్యధికంగా ఉంటుంది. శ్రీలంకలోనూ ఇవి కన్పిస్తాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రంలో వీటి సంతతి గణనీయంగా క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏం తింటాయి?
ఆలివ్ రిడ్లీలు సర్వభక్షకాలు. అంటే ఇవి మొక్కలను తింటాయి.. అలాగే జంతువులను కూడా భుజిస్తాయి. ఎక్కువగా తీరంలో దొరికే ఆల్గే, ఎండ్రకాయలు, పీతలు, రొయ్యలు, చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు ఆలివ్ రిడ్లీలు తమ ఆహార వేటలో భాగంగా సముద్రంలో 500 అడుగుల లోతుకు కూడా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ ఆలివ్ రిడ్లీలు తమ జీవితాంతం ఎలా ప్రవర్తిస్తాయనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే, చల్లని నీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి సమూహంగా ఏర్పడతాయి. ఎండలో అలా గుంపులుగా నిల్చొని పరస్పరం తోసుకుంటూ కన్పిస్తాయి.
ఉష్ణోగ్రత ఆధారంగా లింగం
ఈ సముద్ర తాబేళ్లు తీరంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి. ఇవి ఏడాది కాలంలో కొన్ని వందల, వేల మైళ్లు సునాయాసంగా ప్రయాణిస్తాయి. అలా వచ్చినవన్నీ ఒక చోట గూడు కట్టుకునే ప్రాంతాన్ని ‘అర్రిబడాస్’ అని అంటారు. ఇక్కడే ఆడ తాబేళ్లు సంవత్సరంలో మూడు సార్లు.. వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి. వాటిని పొదగడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బయటి ఉష్ణోగ్రత ఆధారంగా గుడ్డులోని తాబేలు ఆడ లేదా మగా అనేది నిర్ణయమవుతుంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువుంటే.. అధికంగా ఆడ తాబేళ్లు జన్మిస్తాయి. ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంటే మగ, ఆడ రెండూ జన్మించే అవకాశం ఉంటుంది.
అంతరించిపోతున్నాయట!
అనేక కారణాల వల్ల ఆలివ్ రిడ్లీ జాతి తాబేళ్లు అంతరించిపోతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర కాలుష్యం, చేపల వేట వలలకు చిక్కడం, వీటి గుడ్లను అపహరించడం, పడవలు గుడ్లపై ఎక్కడం, మాంసం కోసం తాబేళ్లను వధించడం వంటి చర్యల కారణంగా వీటి సంఖ్య పడిపోతోంది. అందుకే వీటిని రక్షించడం కోసం కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా చట్టాలు చేశారు. భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఆలివ్రిడ్లీ తాబేళ్లు అరుదైన జీవజాతుల జాబితాలో ఉన్నాయి. వీటిని పెంచుకోవడం, వేటాడటం, అక్రమంగా తరలించడం, వ్యాపారాలు నిర్వహించడం చట్ట ప్రకారం నిషేధం. వీటిని సంరక్షించే బాధ్యతలను ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్ర అటవీశాఖ కూడా చర్యలు చేపడుతోంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి