Olive ridley : ఆలివ్ రిడ్లీల ‘అమ్మ ఒడి’శా!
ఒడిశాలోని (Odisha) గంజాం జిల్లాలో రుషికుల్యా సముద్ర తీరంలో (Sea coast) తాజాగా ఆలివ్ రిడ్లీ (Olive ridley) తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఏటా నవంబరు, డిసెంబరు మాసాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఈ తీరానికి వస్తాయి. ఇక్కడ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లే ఇప్పుడు పిల్లలై కడలి బాట పట్టాయి.
అరుదైన ఆలివ్ రిడ్లీ (సముద్ర తాబేళ్ల)లకు (Olive ridley) అమ్మ ఒడిలా ఆత్మీయత పంచుతోంది ఒడిశా (Odisha) రాష్ట్రం. ప్రపంచ నలుమూలల నుంచి ఏటా వేలాది ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఇక్కడకు వస్తున్నాయి. తీరంలో గుడ్లు (Eggs) పెట్టి తిరిగి సముద్రంలోకి పయనమవుతున్నాయి. ఒడిశా అటవీ అధికారులు అవి వదిలి వెళ్లిన గుడ్లను అపురూపంగా సంరక్షిస్తున్నారు. అవి పిల్లలుగా మారిన తరువాత సముద్రంలోకి వదులుతున్నారు. ఆలివ్ రిడ్లీల పునరుత్పత్తికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రాలు ఒడిశాలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని గహీర్మఠ (కేంద్రపడ జిల్లా), రుషికుల్యా ముఖద్వారం (గంజాం జిల్లా), దేవీ ముఖద్వారం (పూరీ జిల్లా) తాబేళ్ల పునరుత్పత్తికి ప్రధాన కేంద్రాలు.
రక్షణ చర్యలు భేష్
వేల కి.మీ. దూరం ప్రయాణించి పునరుత్పత్తి కోసం తాబేళ్లు ఒడిశా తీరాలకు వస్తుంటాయి. ఏటా నవంబరు నుంచి మే వరకూ వీటి పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుందని స్థానిక అటవీ అధికారులు చెబుతున్నారు. తాబేళ్ల పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేందుకు భద్రతా శిబిరాలు, తీరాన ఇనుప జాలీలతో రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఆలివ్ రిడ్లీలు గుడ్లు పెట్టే తీరాన్ని శుభ్రపరుస్తున్నారు. ఒక్కో శిబిరంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించి గస్తీ నిర్వహిస్తున్నారు. ఇసుక లోపల ఉన్న వీటి గుడ్లను వీధి కుక్కలు, నక్కలు తినేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తరువాత ఆలివ్ రిడ్లేలు సముద్రంలో ఎంతదూరం వెళుతున్నాయి? మళ్లీ ఎప్పుడు తీరానికి వస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు వాటిలో కొన్నింటికి జియో ట్యాగ్లు అమర్చుతున్నారు. పరిశోధనలకు ఆ చర్య ఉపయుక్తం కానుంది.
ఏమిటీ ఆలివ్ రిడ్లీలు?
సముద్ర తాబేళ్లలో ఎక్కువగా కన్పించేవి ఆలివ్ రిడ్లీ. ఇవి చూడటానికి ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. పుట్టిన వెంటనే ఇవి బూడిద రంగులో ఉన్నప్పటికీ యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా ఆలివ్ వర్ణంలోకి మారిపోతాయి. వీటిపై రక్షణ పొర హృదయాకారంలో ఉంటుంది. పశ్చిమ అట్లాంటిక్ తీరంలో నివసించే ఆలివ్ రిడ్లీలు తూర్పు పసిఫిక్ ఆలివ్ రిడ్లీల కంటే ముదురు రంగులో ఉంటాయి. యుక్త వయసు వచ్చినా వీటి పరిమాణం 2 నుంచి 2.5 అడుగులు మాత్రమే పెరుగుతుంది. ఒక్కొక్కటి 36 నుంచి 49 కిలోల బరువుంటాయి. వీటిలో అతిపెద్దగా కన్పించే జాతి మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఉంది.
ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి?
ఆలివ్ రిడ్లీలు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్టపడతాయి. పసిఫిక్, అంట్లాంటిక్, హిందూ మహాసముద్ర తీరాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇక మన దేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం తీరాల్లో ఆలివ్ రిడ్లీల సంతతి అత్యధికంగా ఉంటుంది. శ్రీలంకలోనూ ఇవి కన్పిస్తాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రంలో వీటి సంతతి గణనీయంగా క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏం తింటాయి?
ఆలివ్ రిడ్లీలు సర్వభక్షకాలు. అంటే ఇవి మొక్కలను తింటాయి.. అలాగే జంతువులను కూడా భుజిస్తాయి. ఎక్కువగా తీరంలో దొరికే ఆల్గే, ఎండ్రకాయలు, పీతలు, రొయ్యలు, చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు ఆలివ్ రిడ్లీలు తమ ఆహార వేటలో భాగంగా సముద్రంలో 500 అడుగుల లోతుకు కూడా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ ఆలివ్ రిడ్లీలు తమ జీవితాంతం ఎలా ప్రవర్తిస్తాయనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే, చల్లని నీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి సమూహంగా ఏర్పడతాయి. ఎండలో అలా గుంపులుగా నిల్చొని పరస్పరం తోసుకుంటూ కన్పిస్తాయి.
ఉష్ణోగ్రత ఆధారంగా లింగం
ఈ సముద్ర తాబేళ్లు తీరంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి. ఇవి ఏడాది కాలంలో కొన్ని వందల, వేల మైళ్లు సునాయాసంగా ప్రయాణిస్తాయి. అలా వచ్చినవన్నీ ఒక చోట గూడు కట్టుకునే ప్రాంతాన్ని ‘అర్రిబడాస్’ అని అంటారు. ఇక్కడే ఆడ తాబేళ్లు సంవత్సరంలో మూడు సార్లు.. వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి. వాటిని పొదగడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బయటి ఉష్ణోగ్రత ఆధారంగా గుడ్డులోని తాబేలు ఆడ లేదా మగా అనేది నిర్ణయమవుతుంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువుంటే.. అధికంగా ఆడ తాబేళ్లు జన్మిస్తాయి. ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంటే మగ, ఆడ రెండూ జన్మించే అవకాశం ఉంటుంది.
అంతరించిపోతున్నాయట!
అనేక కారణాల వల్ల ఆలివ్ రిడ్లీ జాతి తాబేళ్లు అంతరించిపోతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర కాలుష్యం, చేపల వేట వలలకు చిక్కడం, వీటి గుడ్లను అపహరించడం, పడవలు గుడ్లపై ఎక్కడం, మాంసం కోసం తాబేళ్లను వధించడం వంటి చర్యల కారణంగా వీటి సంఖ్య పడిపోతోంది. అందుకే వీటిని రక్షించడం కోసం కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా చట్టాలు చేశారు. భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఆలివ్రిడ్లీ తాబేళ్లు అరుదైన జీవజాతుల జాబితాలో ఉన్నాయి. వీటిని పెంచుకోవడం, వేటాడటం, అక్రమంగా తరలించడం, వ్యాపారాలు నిర్వహించడం చట్ట ప్రకారం నిషేధం. వీటిని సంరక్షించే బాధ్యతలను ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్ర అటవీశాఖ కూడా చర్యలు చేపడుతోంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్