Eye Health: పిల్లల కంటిచూపు మందగిస్తోందా? ఈ జాగ్రత్తలు పాటించండి
tips For preventing eye sight: చిన్నారుల్లో కంటి సమస్యలు ( Eye sight) తలెత్తిత్తే తొలినాళ్లలోనే గుర్తించినట్లయింతే పరిష్కారం మరింత సులభమవుతుంది. చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు రాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ ఫలితముంటుంది. అవేంటో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: పుట్టిన వెంటనే పిల్లల కంటిచూపు సరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొందరిలో కళ్లు పూర్తిగా అభివృద్ధి చెందవు. వాళ్లు పెరిగే కొద్దీ కంటిలోపలి నిర్మాణాలు పూర్తి స్థాయిలో తయారవుతాయి. చాలా మంది పిల్లలకు పుట్టినప్పుడు కంటి లోపాలు ఉంటాయి. క్రమంగా చాలా వరకు సర్దుకుంటాయి. కొన్నిసార్లు మాత్రం దీర్ఘదృష్టి, హ్రస్వదృష్టి లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా చిన్నారులు ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ స్క్రీన్ చూస్తే వారి కళ్లు ఒత్తిడి, అలసటకు గురవుతాయి. వాటివల్ల కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువ. ఇంతకీ చిన్నారుల కళ్లు బలహీనపడకుండా, వారి చూపు మందగించకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పిల్లల కళ్లపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకుంటే ఇవి వారి నేర్చుకునేతత్వంపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కంటిచూపు సరిగా లేని పిల్లలు చదువులోనూ వెనుకబడే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి.. భవిష్యత్లో చాలా నష్టం వాటిల్లవచ్చు. దృష్టి ప్రభావం పిల్లల శారీరక ఎదుగుదలపైనా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు కంటిచూపు తక్కువున్న వారిలో చేయి-కన్నుకు మధ్య సమన్వయం లోపిస్తుంది. అందువల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే క్రీడలు, వ్యాయామం తదితర ఫిజికల్ యాక్టివిటీస్పై వారు మొగ్గు చూపరు. ఫలితంగా దాని ప్రభావం శరీరక ఎదుగుదలపై పడుతుంది. పిల్లల కంటి చూపు మెరుగుపడేలా జాగ్రత్తలు తీసుకుంటే.. వారిని శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంచొచ్చని నిపుణులు చెబుతున్నారు.
1. ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించండి
ఈ తరం పిల్లలు ఎక్కువ మంది చాలా వరకు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వీలుదొరికితే చాలు మొబైల్ను చేతిలోకి తీసుకుంటున్నారు. ఫలితంగా శారీరక వ్యాయామం ఉండటం లేదు. వీలైనంత వరకు పిల్లల్ని ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. సహజ వెలుతురులో సమయం గడపడం వల్ల హ్రస్వదృష్టి (మయోపియా) వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో దగ్గరి వస్తువులు బాగానే కనిపిస్తాయి.కానీ, దూరంగా ఉన్న వస్తువులు మాత్రం సరిగా కనిపించవు.
2. స్క్రీన్ టైం తగ్గించండి
ఎక్కువగా ఎలక్ట్రానిక్ స్క్రీన్ చూస్తే.. కళ్లు బాగా ఒత్తిడికి గురవుతాయి. కొన్ని సార్లు పొడి బారిపోయి కంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పిల్లలకు వీలైనంత వరకు మొబైల్స్, టీవీలను చూపించకపోవడమే ఉత్తమం. ఒకవేళ చూపించాల్సి వస్తే.. మధ్య మధ్యలో విరామం ఇవ్వడం తప్పనిసరి.
3. తగినంత వెలుతురు ఉండేలా..
చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు ఆ ప్రదేశంలో సరైన వెలుతురు ఉండేలా జాగ్రత్తపడాలి. లేదంటే వారి కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
4. ఆరోగ్యకరమైన ఆహారం
చిన్నతనంలోనే శరీర ఎదుగుదల బాగుంటుంది. అందువల్ల వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా జాగ్రత్తపడాలి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు ఇవ్వాలి. దీనివల్ల వారి కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కుగా తినేలా ప్రోత్సహించండి.
5. కంటిపరీక్షలు తప్పని సరి
పిల్లలకు తరచూ కంటి పరీక్షలు చేయించడం ఉత్తమం. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలోనే సమస్యను నిర్ధారించడం వల్ల చికిత్స కూడా సులువవుతుంది.
6. పరిశుభ్రతను ప్రోత్సహించండి
చిన్నప్పటి నుంచే పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. వారిని ఆ దిశగా ప్రోత్సహించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా కళ్లను తాకేముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. దీనివల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు.
7. కళ్లకు దెబ్బలు తగలకుండా..
చిన్నతనంలో దెబ్బలు తగలటం సర్వసాధారణం. ప్రత్యేకంగా పిల్లలు ఆరుబయట ఆడుకునేటప్పుడు కళ్లలో ఇసుక పడిపోవడం లేదా చిన్నపాటి గాయాలవుతుంటాయి. వీటి నుంచి జాగ్రత్తపడేందుకు పిల్లలకు కళ్లజోడు, చిన్నపాటి హెల్మెట్ లాంటివి ఇస్తే బాగుంటుంది.
8. ఎలా చదవాలో చెప్పండి..
చాలా మంది పిల్లలు చదువుతున్నప్పుడు పుస్తకాలను కళ్లకు దగ్గరగా పెట్టుకుంటారు. పడుకొని కొందరు.. తక్కువ వెలుతురులో ఇంకొందరు ఇలా రకరకాలుగా చదువుతుంటారు. వాటన్నింటికీ బ్రేక్ చెప్పి.. ఎలా చదవాలో పిల్లలకు నేర్పించాలి. నిటారుగా కూర్చొని.. కంటికి, పుస్తకానికి కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలి. వివిధ భంగిమల్లో చదవడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి అవి తొందరగా అలసిపోతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పిల్లల కంటి ఆరోగ్యమే కాకుండా.. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. మీ పిల్లలకు ఏమైనా సమస్యలు సమస్యలు ఉంటే.. సంబంధిత వైద్యుడిని సంప్రదించి.. వారి సూచన మేరకు జాగ్రత్తలు తీసుకోగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి