Tulip Flowers: కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది.. ‘తులిప్’ విశేషాలు తెలుసా?
జమ్మూకశ్మీర్లో తులిప్ గార్డెన్ తెరుచుకుంది. ఏప్రిల్ 3 నుంచి 20వరకు తులిప్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ అరుదైన పుష్పాలగురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్ పుష్పాల(Tulip flowers) గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకొనేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. భూలోకంలో స్వర్గసీమను తలపించేలా ఉండే ఈ పుష్పాలు ఏటా వసంత రుతువు(spring season)లో విరబూస్తూ పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఈ ఏడాది శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. ఏప్రిల్ 3 నుంచి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివ్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తులిప్ పుష్పాలంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విశేషాలివే..!
- తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి.
- ఈ పూల మొగ్గల్లోని ఎక్కువ రకాలు ఒకే విధమైన ఆకృతితో ఉంటాయి. తులిప్ పూలలో చాలా వరకు మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కొన్ని రకాల్లో మాత్రం ఒకే కాండానికి నాలుగు పూలు పూస్తాయి.
- వసంత కాలంలో మూడు నుంచి ఏడు రోజుల పాటు వికసించే ఈ తులిప్ పుష్పాలు.. దాదాపు అన్ని రంగుల్లో కనులవిందు చేస్తాయి.
- తులిప్లలో ప్రతి రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది. ఉదాహరణకు ఎర్రని రంగుతో ఆకట్టుకొనే పూలను నిజమైన ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అలాగే, ఊదా రంగులో ఉన్న పుష్పాలను విధేయతకు సంకేతంగా పరిగణిస్తుంటారు.
- ఏదైనా తప్పు చేసినప్పుడు అవతలి వారి క్షమాపణ కోరేందుకు తెలుపు రంగు తులిప్ పుష్పాలను గుర్తుగా భావిస్తారు..
- తులిప్ పూలు వికసిస్తే అది వసంత కాలం ఆరంభానికి గుర్తుగా భావిస్తారు. వాస్తవానికి తులిప్ పుష్పాలు మధ్య ఆసియాకు చెందినవి. కానీ, ఇవి నెదర్లాండ్స్కు చేరిన తర్వాతే మంచి ఆదరణ పొందాయి.
- పార్కిన్సన్ వ్యాధి ఫౌండనేషన్ తమ సంస్థ చిహ్నంగా తులిప్ పుష్పాలనే ఎంచుకొంది. తులిప్ పుష్పాలు అత్యంత ఖరీదైనవి. 1600 సంవత్సరంలో నెదర్లాండ్స్లో ఒక ఉద్యోగి సగటు జీతం కంటే తులిప్ పుష్పాల ఖరీదు 10 రెట్లు ఎక్కువగా ఉండేదట. 1634 నుంచి 1637 మధ్య కాలాన్ని తులిప్ మానియాగా పేర్కొంటారు. ఆ సమయంలో తులిప్ పుష్పాలు అత్యంత ఎక్కువ ధర పలికాయట.
- తులిప్ రెమ్మలను తినొచ్చు. ఇప్పటికీ కొన్ని వంటకాల్లో ఉల్లిపాయలకు బదులు తులిప్ రెబ్బలనే వాడుతుంటారు. ప్రపంచంలోనే తులిప్ పుష్పాలను పెద్ద ఎత్తున సాగు చేసి మార్కెట్ చేస్తున్న దేశం నెదర్లాండ్స్. ఏడాదిలో దాదాపు మూడు బిలియన్లకు పైగా తులిప్ పుష్పాలను సాగు చేస్తుంటుంది.
- తులిప్ పూలను ఒక్కసారి కత్తిరిస్తే అవి మరో అంగుళం వరకు పెరుగుతూనే ఉంటాయి. ఆకురాలే కాలాన్ని తులిప్ పూలను నాటేందుకు అనువైన సమయంగా భావిస్తారట. ఆ సమయంలో నాటితే వసంత కాలం వచ్చేసరికి మూలాలను బలంగా తయారు చేసుకుంటాయి.
- తులిప్ పుష్పాలు పెరిగేందుకు వీలుగా కాంతి వైపు వంగి మెలి తిరుగుతాయి. ఫ్లవర్వాజ్లో పెట్టినా అవి కాంతి ఉండే వైపే తిరుగుతాయట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.