Mukesh ambani: 2021లో ముకేశ్ అంబానీలో స్ఫూర్తి నింపినపుస్తకాలేవో తెలుసా?
కరోనా సంక్షోభంలో సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు అందరికీ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా కొందరు, మానసికంగా మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం కాస్త మానసిక ఆందోళనకు గురయ్యారట. అయితే, ఇలాంటి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభంలో అన్ని వర్గాలకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా కొందరు, మానసికంగా మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం కాస్త మానసిక ఆందోళనకు గురయ్యారట. అయితే, ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని పుస్తకాలు తనలో స్ఫూర్తి నింపాయని, 2021ను దాటుకొని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని అందించాయని ముకేశ్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా వీటిని చదవాలని సిఫార్సు చేశారు. మరి ఆ పుస్తకాలేవో చూద్దామా..?
‘టెన్ లెసెన్స్ ఫర్ ఏ పోస్ట్ పాండమిక్ వరల్డ్’ - ఫరీద్ జకారియా
ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారిని, గతంలో ప్రపంచాన్ని భయపట్టిన మరికొన్ని వైరస్ల వ్యాప్తి, ఎదురైన పరిస్థితుల మధ్య ఉన్న సారూప్యత గురించి వివరిస్తూ ఫరీద్ జకారియా ఈ పుస్తకాన్ని రచించారు. నిలకడలేని జీవనశైలి, బలహీనమైన ప్రభుత్వాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాల గురించి ఇందులో వివరించారు. తక్షణమే ఈ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని, సమర్థ నాయకత్వం, జీవనశైలిలో మార్పులు, అంతర్జాతీయంగా పరస్పర సహకారం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలియజేసే విధంగా ఈ పుస్తకం ఉంటుంది.
‘ప్రిన్సిపల్స్ ఫర్ డీలింగ్ విత్ ది చేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్’ - రే డాలియో
గత 5 శతాబ్దాల చరిత్రలో ప్రపంచంలోని గొప్ప దేశాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక విజయాలు, పరాజయాలపై విశ్లేషణాత్మకంగా రచించిన పుస్తకమిది. దీని రచయిత పేరు రే డాలియో. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కఠిన సమయం కంటే రాబోయే కాలం భిన్నంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడంలో ఈ పుస్తకం దోహదపడుతుందట. పాలకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, యువతరం ఈ పుస్తకాన్ని కచ్చితంగా చదివి తీరాలని ముకేశ్ అంబానీ సూచించారు.
‘ది ర్యాగింగ్ 2020ఎస్: కంపెనీస్, కంట్రీస్, పీపుల్ - అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూచర్’ - అలెక్ రాస్
కార్పొరేట్ కార్యకలాపాలు, ప్రభుత్వ వైఫల్యం, ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్న వినూత్న ఆర్థిక, రాజకీయ నమూనాలకు సంబంధించిన కథనాలను ఇందులో పొందుపరిచారు రచయిత అలెక్ రాస్. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల ఆలోచనాపరుల ఇంటర్వ్యూలనూ పొందుపర్చారు.
‘2030: హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొల్లైడ్ అండ్ రీషేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్’ - మౌరో గిల్లెన్
2030లో ప్రపంచం ఎలా ఉంటుంది? నగరీకరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అంశాలను కళ్లకు కట్టేవిధంగా రచించారు మౌరో గిల్లెన్. ఆయన అంచనాల ప్రకారం.. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల వినియోగదారులపై ఆధారపడకుండానే వృద్ధి సాధిస్తుంది. పురుషుల కన్నా మహిళల వద్దే సంపద ఎక్కువ ఉంటుంది. కార్మికుల స్థానంలో పెద్ద ఎత్తున రోబోలు వచ్చి చేరుతాయి. కార్మికుల సంఖ్య కంటే రోబోలు, దేశాల కంటే కరెన్సీలే ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, భవిష్యత్లో జరగబోయే విషయాలు, విపత్తులు వాటి పరిణామాలపై ఈ పుస్తకంలో అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది.
‘బిగ్ లిటిల్ బ్రేక్థ్రూస్: హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నోవేషన్స్ డ్రైవ్ ఓవరైజ్డ్ రిజల్ట్స్’ - జోస్ లింకర్
కరోనా సంక్షోభం అనంతర ప్రపంచంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితుల్ని సంస్థలు, వ్యక్తులు వినూత్న ఆవిష్కరణలతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఒక అవకాశం కోసం సుదీర్ఘ కాలం కష్టపడకుండా వినూత్న ఆలోచనలతో అనతికాలంలోనే గొప్ప గొప్ప అవకాశాల్ని సృష్టించుకుంటారు. ఈ పుస్తకం వివరించే ప్రధానాంశం ఇదే. దీన్ని జోస్ లింకర్ రచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్