Mukesh ambani: 2021లో ముకేశ్ అంబానీలో స్ఫూర్తి నింపినపుస్తకాలేవో తెలుసా?
కరోనా సంక్షోభంలో సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు అందరికీ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా కొందరు, మానసికంగా మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం కాస్త మానసిక ఆందోళనకు గురయ్యారట. అయితే, ఇలాంటి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభంలో అన్ని వర్గాలకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా కొందరు, మానసికంగా మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం కాస్త మానసిక ఆందోళనకు గురయ్యారట. అయితే, ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని పుస్తకాలు తనలో స్ఫూర్తి నింపాయని, 2021ను దాటుకొని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని అందించాయని ముకేశ్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా వీటిని చదవాలని సిఫార్సు చేశారు. మరి ఆ పుస్తకాలేవో చూద్దామా..?
‘టెన్ లెసెన్స్ ఫర్ ఏ పోస్ట్ పాండమిక్ వరల్డ్’ - ఫరీద్ జకారియా
ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారిని, గతంలో ప్రపంచాన్ని భయపట్టిన మరికొన్ని వైరస్ల వ్యాప్తి, ఎదురైన పరిస్థితుల మధ్య ఉన్న సారూప్యత గురించి వివరిస్తూ ఫరీద్ జకారియా ఈ పుస్తకాన్ని రచించారు. నిలకడలేని జీవనశైలి, బలహీనమైన ప్రభుత్వాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాల గురించి ఇందులో వివరించారు. తక్షణమే ఈ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని, సమర్థ నాయకత్వం, జీవనశైలిలో మార్పులు, అంతర్జాతీయంగా పరస్పర సహకారం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలియజేసే విధంగా ఈ పుస్తకం ఉంటుంది.
‘ప్రిన్సిపల్స్ ఫర్ డీలింగ్ విత్ ది చేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్’ - రే డాలియో
గత 5 శతాబ్దాల చరిత్రలో ప్రపంచంలోని గొప్ప దేశాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక విజయాలు, పరాజయాలపై విశ్లేషణాత్మకంగా రచించిన పుస్తకమిది. దీని రచయిత పేరు రే డాలియో. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కఠిన సమయం కంటే రాబోయే కాలం భిన్నంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడంలో ఈ పుస్తకం దోహదపడుతుందట. పాలకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, యువతరం ఈ పుస్తకాన్ని కచ్చితంగా చదివి తీరాలని ముకేశ్ అంబానీ సూచించారు.
‘ది ర్యాగింగ్ 2020ఎస్: కంపెనీస్, కంట్రీస్, పీపుల్ - అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూచర్’ - అలెక్ రాస్
కార్పొరేట్ కార్యకలాపాలు, ప్రభుత్వ వైఫల్యం, ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్న వినూత్న ఆర్థిక, రాజకీయ నమూనాలకు సంబంధించిన కథనాలను ఇందులో పొందుపరిచారు రచయిత అలెక్ రాస్. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల ఆలోచనాపరుల ఇంటర్వ్యూలనూ పొందుపర్చారు.
‘2030: హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొల్లైడ్ అండ్ రీషేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్’ - మౌరో గిల్లెన్
2030లో ప్రపంచం ఎలా ఉంటుంది? నగరీకరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అంశాలను కళ్లకు కట్టేవిధంగా రచించారు మౌరో గిల్లెన్. ఆయన అంచనాల ప్రకారం.. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల వినియోగదారులపై ఆధారపడకుండానే వృద్ధి సాధిస్తుంది. పురుషుల కన్నా మహిళల వద్దే సంపద ఎక్కువ ఉంటుంది. కార్మికుల స్థానంలో పెద్ద ఎత్తున రోబోలు వచ్చి చేరుతాయి. కార్మికుల సంఖ్య కంటే రోబోలు, దేశాల కంటే కరెన్సీలే ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, భవిష్యత్లో జరగబోయే విషయాలు, విపత్తులు వాటి పరిణామాలపై ఈ పుస్తకంలో అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది.
‘బిగ్ లిటిల్ బ్రేక్థ్రూస్: హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నోవేషన్స్ డ్రైవ్ ఓవరైజ్డ్ రిజల్ట్స్’ - జోస్ లింకర్
కరోనా సంక్షోభం అనంతర ప్రపంచంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితుల్ని సంస్థలు, వ్యక్తులు వినూత్న ఆవిష్కరణలతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఒక అవకాశం కోసం సుదీర్ఘ కాలం కష్టపడకుండా వినూత్న ఆలోచనలతో అనతికాలంలోనే గొప్ప గొప్ప అవకాశాల్ని సృష్టించుకుంటారు. ఈ పుస్తకం వివరించే ప్రధానాంశం ఇదే. దీన్ని జోస్ లింకర్ రచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం