JPC : గతంలో కుంభకోణాలపై జేపీసీ.. అవి ఏం చేశాయంటే..?
అదానీ గ్రూప్ అవకతవకలపై విచారణ చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు జేపీసీ ఎలా పని చేస్తుందో చదివేయండి.
అదానీ గ్రూప్(Adani Group)పై హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా పతనమైంది. దీంతో మదుపరులు సహా, కొన్ని బ్యాంకులు, ఎల్ఐసీ వంటి సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే షేర్ల ధరల్లో అవకతవకలు, ఖాతా పుస్తకాల్లో మోసాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(Joint Parliamentary Committee)తో విచారణ జరిపించాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇంతకీ, సంయుక్త పార్లమెంటరీ సంఘం అంటే ఏంటి? గతంలో అదెలాంటి విచారణలు చేసిందో తెలుసుకోండి.
ఏమిటీ జేపీసీ?
ఏదైనా కుంభంకోణం గురించి లేదా ఒక నిర్దిష్టమైన బిల్లుకు సంబంధించిన సమాచారంపై విశ్లేషణ చేయడానికి జేపీసీ ఏర్పాటవుతుంది. అందుకు లోక్సభ, రాజ్యసభ రెండింటిలో ఏదైనా ఒక చోట సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)పై తీర్మానం చేసి మరో సభ దాన్ని బలపరచాల్సి ఉంటుంది. ఇంకో విధానంలో.. లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఇద్దరూ సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో జేపీసీని ఏర్పాటు చేయవచ్చు. ఈ సంఘంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఎంపికైన లోక్సభ సభ్యుల సంఖ్యలో సగ భాగానికి సమానమైన సభ్యులను రాజ్యసభ నుంచి ఎన్నుకుంటారు. మొత్తం సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది.
ఎలాంటి అధికారాలుంటాయి?
జేపీసీ ఏర్పాటైన తరువాత అందులోని సభ్యులు విచారణ చేస్తున్న అంశం గురించి సంబంధిత నిపుణులు, ప్రజా ప్రతినిధులు, సంఘాలు, వ్యక్తులు, పార్టీల నుంచి ఆధారాలను(evidence), సమాచారాన్ని సేకరిస్తారు. ఎవరైనా.. విచారణకు సహకరించకపోయినా, జేపీసీ ఎదుట హాజరు కాకపోయినా సభా ధిక్కారంగా పరిగణిస్తారు. పరిశీలనలో భాగంగా జేపీసీ మౌఖిక, రాత పూర్వక ఆధారాలను సేకరిస్తుంది. కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కూడా పరిశీలిస్తుంది. ఈ విషయాలన్నీ గుట్టుగా జరుగుతాయి. ఒక వేళ సెక్యూరిటీస్, బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలను విచారిస్తున్నట్లయితే ఆ విచారణకు సంబంధించిన విషయాలను నిరభ్యంతరంగా ప్రజలకు తెలియజేస్తుంది. జేపీసీ ఛైర్మన్ కమిటీ సాగించిన చర్చల వివరాలను మీడియాకు బహిర్గతం చేస్తారు.
జేపీసీ విచారణలో భాగంగా ఎవరినైనా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించొచ్చు. మంత్రులను సహజంగా జేపీసీ పిలవదు. అయితే సెక్యూరిటీస్, బ్యాంకింగ్ లావాదేవీల అక్రమాలపై విచారణ సాగిస్తుంటే స్పీకర్ అనుమతి తీసుకొని మంత్రులనూ విచారించే అవకాశముంటుంది. జేపీసీ అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు.. వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం (government) నిరాకరించవచ్చు. అటువంటి సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని ఆయన సమ్మతి తెలిపితే తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ కుంభకోణాలపై జేపీసీలు ఏర్పాటయ్యాయి. అవేంటంటే..
బోఫోర్స్ కుంభకోణం
1987లో తొలిసారి బోఫోర్స్ కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత బి.శంకరానంద దానికి అధ్యక్షత వహించారు. నాటి రక్షణమంత్రి కేసీ పంత్ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారం రోజుల తర్వాత రాజ్యసభ దాన్ని ఆమోదించింది. 50 సార్లు సమావేశమైన ఈ కమిటీ 1988 ఏప్రిల్ 26న తుది నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ సభ్యులు అధికంగా ఉన్నారని విమర్శిస్తూ ఈ కమిటీని అప్పటి విపక్షాలు వ్యతిరేకించాయి. పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన నివేదికను సైతం తిరస్కరించాయి.
హర్షద్ మెహతా కుంభకోణం
జేపీసీ రెండోసారి 1992లో ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్నేత, అప్పటి కేంద్రమంత్రి రామ్నివాస్ మ్రిధా దానికి అధ్యక్షత వహించారు. హర్షద్ మెహతా కుంభకోణంతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో సెక్యూరిటీస్, బ్యాంకింగ్ లావాదేవీలపై విచారణ జరిగింది. నాటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మరుసటి రోజు రాజ్యసభ దాన్ని ఆమోదించింది. ఈ విచారణ సంఘం సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు. అమలు కూడా చేయలేదు.
కేతన్ పరేఖ్ షేర్ మార్కెట్ కుంభకోణం
హర్షద్ మెహతా కుంభకోణం తరువాత కేతన్ పరేఖ్ షేర్ మార్కెట్ కుంభకోణంపై 2001లో జేపీసీని ఏర్పాటు చేశారు. నాటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భాజపా సీనియర్ నేత, మాజీ లెఫ్ట్నెంట్ జనరల్ ప్రకాశ్ మణి త్రిపాఠి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 105సార్లు సమావేశమైన కమిటీ 2002 డిసెంబరు 19న నివేదిక ఇచ్చింది. స్టాక్ మార్కెట్ నిబంధనల్లో భారీగా మార్పులు తీసుకురావాల్సి ఉందని ఈ కమిటీ అభిప్రాయంపడింది. కానీ, అవన్నీ బుట్టదాఖలయ్యాయి.
శీతల పానియాల్లో పురుగుమందులు
శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని తెలియడంతో 2003లో జేపీసీ ఏర్పాటు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్పవార్ దీనికి అధ్యక్షత వహించారు. పురుగుమందుల అవశేషాలు ఉండటం నిజమేనని ఈ కమిటీ నిర్ధారించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అధ్యక్షత వహించాలని చెప్పింది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
2జీ స్పెక్ట్రం కుంభకోణం
2జీ కేసు విచారణ కోసం 2011 ఫిబ్రవరిలో జేపీసీ ఏర్పాటైంది. దీనికి పీసీ చాకో అధ్యక్షత వహించారు. మొత్తం 30 మంది సభ్యుల్లో 15 మంది భాజపా, జేడీయూ, సీపీఐ, సీపీఎం, తృణమూల్, బిజద, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల నుంచి ఉన్నారు. అధ్యక్షుడు పీసీ చాకో పక్షపాతంతో వ్యహరిస్తున్నారని ఈ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఆయనను తొలగించాలని లోక్సభ స్పీకర్కు అవిశ్వాస పత్రం కూడా అందజేశారు. అంతేకాకుండా డ్రాఫ్ట్లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టారు. దాంతో దిగొచ్చిన పీసీ చాకో డ్రాఫ్ట్ సవరణకు అంగీకరించారు.
వీవీఐపీ ఛాపర్ స్కామ్
2013లో రాజ్యసభలో జేపీసీపై తీర్మానం ప్రవేశపెట్టారు. అగస్టా వెస్ట్లాండ్ నుంచి రక్షణశాఖ వీవీఐపీ హెలికాప్టర్లు పొందడానికి చేసిన లావాదేవీల్లో అవకతవకలు, లంచాలపై విచారణకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
భూ సేకరణ బిల్లు
భూమికి తగ్గ పరిహారం, భూ సేకరణలో పారదర్శకత, పునరావాస బిల్లు 2015కు సంబంధించి ఎస్.ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలో జేపీసీ ఏర్పాటు చేయాలని సూచించింది.
వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణ బిల్లు
2019 డిసెంబరులో వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భాజపా నేత మీనాక్షి లేఖి అధ్యక్షతన జేపీసీ పూర్తి విశ్లేషణ చేసి బడ్జెట్ సమావేశాలు ఉండటంతో 2020 మార్చి నాటికి ఆ బిల్లుపై డ్రాఫ్ట్ లాను అందజేసింది. 2022లో వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణకు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకొంటున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు