‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..!’
రాత్రి పన్నెండు దాటగానే ‘వరల్డ్ స్లీప్ డే’ అని ఫోన్లో నోటిఫికేషన్! అది చూసే సరికి ఒకటే ఆత్రం.. ఏం పోస్టింగులు పెట్టుకోవాలా అని. మనం నిద్రపోతున్నప్పుడు ఎవరైనా ఫొటో తీశారా అని అలారం మోగేదాకా వెతికేస్తాం......
సరైన నిద్రే రాదు..
రాత్రి పన్నెండు దాటగానే ‘వరల్డ్ స్లీప్ డే’ అని ఫోన్లో నోటిఫికేషన్! అది చూసే సరికి ఒకటే ఆత్రం.. ఏం పోస్టింగులు పెట్టుకోవాలా అని. మనం నిద్రపోతున్నప్పుడు ఎవరైనా ఫొటో తీశారా అని అలారం మోగేదాకా వెతికేస్తాం. అలాంటి చిత్రాలు దొరికితే అంతర్జాలంలో పెట్టి నాలుగు గురక ఎమోజీలు తగిలిస్తాం. లేకపోతే మనకు నిద్దరుండదు!
నిద్రకు ప్రధాన శత్రువు మొబైల్ అన్న మాట ఏకగ్రీవంగా ఒప్పుకొంటాం. దాన్ని చక్కబరచడం మనిషికి చేతకాని పని అయిపోయింది. అసలు మనిషి ఆ మొబైల్ని పడుకోనిస్తేగా! ఒక పక్క సెలైన్ బాటిల్లా ఛార్జరు పెట్టి మరీ దాన్ని వాడేస్తుంటాం.
ఇరవై ఒకటో శతాబ్దం ముందు వరకు నిద్ర రాత్రి పూట ఎనిమిది నుంచి పది గంటలు ఉండేది. గత రెండు దశాబ్దాల్లో మాత్రం మనిషికో తీరులో మారిపోయింది. ఎవరి కళ్లు చూసినా కరడుగట్టిన తీవ్రవాదుల్లా ఎరుపు రంగులోనే కనిపిస్తున్నాయి.
బడికెళ్లే పిల్లాడు రాత్రి పదో పదకొండో అయితేగానీ పడుకోవట్లేదు. హోంవర్కుల బాధ.. అవి చేయించేందుకు ఆలస్యంగా వచ్చే అమ్మానాన్నలకు అలారం పెట్టే వీలే లేదు మరి.
కాలేజీ పిల్లలకు చూడాల్సిన టీవీ ప్రోగ్రాములు, ఇవ్వాల్సిన సోషల్ రిప్లైలు.. అబ్బో.. వాళ్ల పనికే ఇరవైనాలుగు గంటలు చాలవు.. మళ్లీ నిద్రా? వాళ్లు పొద్దున్న పదకొండింటికి లేవలేక లేచి పళ్లు తోముకుంటుంటే పేస్టూ బ్రష్షూ టంగ్ క్లీనరూ ఎంత రోదిస్తాయో చెప్పలేం. అప్పటిదాకా పడుకుంటారా అంటే.. అబ్బే.. మధ్య మధ్యలో ఫోన్ పట్టుకుని సామాజిక మాధ్యమాల్లో మేము సైతం లేస్తుంటారు!
గృహిణికి నిద్రకు ముందే జగడం. ఆమె నిద్రను చందమామ ఏనాడూ చూసి ఉండదు. ఇంటి పనా.. మజాకా..? ఏ పదకొండు దాటాకో పడుకున్నా.. ఏ పద్దు లెక్కో నెమరేసుకోవడం ఓ రెండు గంటలన్నా ఉంటుంది.
చిరుద్యోగికి ప్రతి సెకెనుకూ వార్నింగు అలారంలా మోగుతూనే ఉంటుంది. ఉద్యోగార్థం అప్ అండ్ డౌన్ చేసే జీవులకు బస్సులో కునికిపాట్ల వల్ల పర్సులు పోగొట్టుకోవడం అస్సలు ఇష్టమే ఉండదు.
సాఫ్ట్వేరు ప్రాణులకు రాత్రి ఉండదు. ఇరవైనాలుగు గంటలూ పగలే. లాప్టాపే వాళ్ల బతుకుల్లో చందమామ.
'రైతు నిద్ర రుతువు చేతిలో ఉంటుంది. మత్తెక్కించే పురుగుల మందు సీసాలో ఉంటుంది.
శుష్కించిన సమాజాన్ని నడిపించే డాక్టర్లూ, ఇంజినీర్లూ, సైంటిస్టులూ, మేధావులూ నిద్రపోగలరా?
రాజకీయ చదరంగంలో అయితే ఎత్తు వేశాక ఇక నిద్ర మత్తు రానే రాదు. కునికితే కుర్చీ కాకులెత్తుకుపోవా మరి..
ఇంతకీ హాయిగా నిద్రపోయేవాడు ఎవడు?
ఇంకెక్కడి గాఢ నిద్ర..
చూస్తుంటే.. కొన్నాళ్లకు పిల్లలు గురక అంటే ఏంటీ? అని అడిగే రోజులు వచ్చేస్తాయేమో అనిపిస్తోంది.
మనిషి బతకడానికి సవాలక్ష సమస్యలూ.. శతకోటి సైంధవులూ. ఎలా నిద్రపోగలం? బాగా నిద్రపట్టడానికి ఏదైనా యాప్ ఉందా.. అని వెతికే కాలం ఇది. అందుకని.. ‘మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలరా..’ అన్న కొసరాజు మాటలు మర్చిపోవాలి. ‘మత్తు వదలకూ.. నిద్దుర మత్తు వదలకూ..’ అని అనుకోవడమే ఇప్పటి ఆరోగ్యమంత్రం. ‘సరైన నిద్ర.. ఆరోగ్యకరమైన భవిత..’ అంటూ ఈ ఏడాది వేడుకలు చేస్తున్నారు.
బాబ్బాబూ.. ఊరకే తిని తొంగోండయ్యా.. కనీసం గొడ్డులా ఆరోగ్యంగా అయినా ఉంటారు.
- కుప్పిలి సుదర్శన్
(మార్చి 19, వరల్డ్ స్లీప్ డే సందర్భంగా..)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు