ఏపీలో కరోనా: మళ్లీ పదివేలు దాటిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ రోజు రోజుకూ పెరిగిపోతోంది. మరోసారి ఒక్కరోజులోనే కేసులు...

Updated : 08 Aug 2020 18:42 IST

బులిటెన్‌ విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ రోజు రోజుకూ పెరిగిపోతోంది. మరోసారి ఒక్కరోజులోనే కేసులు పది వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో (ఉదయం 9గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు) కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. ఇవాళ మరో 97 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 1,939 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 14, అనంతపురంలో 11,  కర్నూలులో 10, పశ్చిమ గోదావరిలో 10, చిత్తూరులో 8, నెల్లూరులో 8,  ప్రకాశం జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, విశాఖపట్నం ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కడపలో ఇద్దరు మృతి చెందారు. 

గడిచిన 24 గంటల్లో 62,123 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 85,486 మంది చికిత్స పొందుతుండగా.. 1,29,615 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 24,24,393 నమూనాలను పరీక్షించామని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని