రిమ్స్ నుంచి కరోనా బాధితుల పరారీ
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా పాజిటివ్ బాధితులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. పరారైన వారిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఇంద్రవెల్లి మండలవాసులు ఇద్దరు, నిజామాబాద్ వాసి ఒకరు..
ఆదిలాబాద్ వైద్య విభాగం: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా పాజిటివ్ బాధితులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. పరారైన వారిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఇంద్రవెల్లి మండలవాసులు ఇద్దరు, నిజామాబాద్ వాసి ఒకరు ఉండగా.. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన వారు ఇద్దరు, కైలాస్ నగర్, ఖానాపూర్, ద్వారకానగర్, కుమ్మరికుంట కాలనీ వాసులు ఒక్కొక్కరు ఉన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలానికి చెందిన మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. సిబ్బంది ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తుండగా బాధితులు తప్పించుకున్నట్లు రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం చెబుతున్నారు. బాధితుల పరారీపై జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు రిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. బాధితుల చరవాణి ఆధారంగా బాధితుల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, అవి అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?