ఇక్కడ ఏనుగులను దత్తత తీసుకోవచ్చు

వన్య ప్రాణి ప్రేమికులు ఏనుగులను దత్తత తీసుకునే కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రాష్ర్టంలోని బాంధవ్‌గఢ్‌ నేషనల్‌ పార్కులోని ఏనుగులను ఒకరోజు.. నెల.. సంవత్సరం పాటు దత్తత తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభంలో

Published : 30 Sep 2020 01:39 IST

కార్యక్రమం ప్రారంభించిన మధ్యప్రదేశ్‌

భోపాల్ : వన్య ప్రాణి ప్రేమికులు ఏనుగులను దత్తత తీసుకునే కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రాష్ర్టంలోని బాంధవ్‌గఢ్‌ నేషనల్‌ పార్కులోని ఏనుగులను ఒకరోజు.. నెల.. సంవత్సరం పాటు దత్తత తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా తొలుత 74 ఏళ్లు గల గౌతమ్‌, 69 ఏళ్ల వయస్సున్న తూఫాన్‌ అనే పేర్లు కలిగిన రెండు ఏనుగులను దత్తత తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వీటితో పాటు మరో 13 అందుబాటులో ఉంటాయని పార్కు అధికారులు తెలిపారు. ఏనుగు దత్తత కార్యక్రమంలో ఒక రోజుకు రూ. 500, సంవత్సరానికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.  

 వీటిని నెల, సంవత్సరం పాటు దత్తత తీసుకున్న వారికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు. బాంధవ్‌గఢ్‌ నేషనల్‌ పార్కు, టైగర్‌ రిజర్వులో ఏటా సెప్టెంబరులో జరిగే ఏనుగుల రీజువెనేషన్‌ కార్యక్రమంలో వారు పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా ఒక రోజు ఏనుగులను దగ్గరి నుంచి చూస్తూ వాటికి ఆహారం అందించవచ్చు. దీంతో పాటు వాటిని అర్థం చేసుకోడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం మంచి అవకాశం అని ముఖ్య అధికారి అలోక్‌ కుమార్‌ తెలిపారు. గతంలో పార్కుకు వచ్చేవారు టైగర్‌ రిజర్వు చూడటానికి ఏనుగులపై సంచరించేవారు. దాని వల్ల వచ్చే ఆదాయాన్ని వాటి పోషణకు, ఆరోగ్య సమస్యలపై ఖర్చు చేసేవారు. ఈ దత్తత కార్యక్రమం వల్ల వచ్చే ఆదాయం ఏనుగుల పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని