దర్శనం టికెట్లు లేవని ఆందోళనకు దిగిన భక్తులు

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి తితిదే శుక్రవారం రాత్రే టికెట్లు జారీ చేసింది. ఫలితంగా..

Updated : 31 Oct 2020 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి తితిదే శుక్రవారం రాత్రే టికెట్లు జారీ చేసింది. ఫలితంగా ఈరోజు టికెట్లు లేకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల ఆన్‌లైన్‌పై అవగాహన లేని అనేకమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూదేవి కాంప్లెక్స్‌కు వచ్చిన అదనపు ఈఓ ధర్మారెడ్డి భక్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆదివారం, సోమవారం దర్శనాలకు సంబంధించిన టోకెన్లను జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని