‘గో కరోనా, కరోనా గో’.. కేంద్ర మంత్రికి కరోనా!
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ముంబయి: రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయన్ను దక్షిణ ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా ఆయన సోమవారం తన పార్టీ(రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా)లోకి నటి పాయల్ ఘోష్ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో కరోనా వైరస్ మొదలైన సమయంలో మంత్రి అథవాలే విభిన్నమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కరోనాను ఆపేందుకు మంత్రం జపించాలని ఆయన చెప్పడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద‘గో కరోనా, కరోనా గో’అనే మంత్రాన్ని ఆయన జపించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.