బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రశ్నించిన పాపానికి వార్డు సభ్యుడి నిర్బంధం
వృద్ధుడనీ చూడకుండా 2 రోజులు ఠాణాలోనే
ఈనాడు, కర్నూలు: నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మూడోసారి గెలవాలనుకున్న మంత్రికి ఎదురుగాలి సంకేతాలు కన్పిస్తున్నాయో లేక ఓటమి భయం వెంటాడుతుందో ఏమో కానీ, ఇటీవల విపక్ష నాయకులపై పోలీసులను ఉసిగొల్పుతున్నారు. బుగ్గన బుధవారం నియోజకవర్గంలోని ఎన్.రంగాపురానికి రాగా.. గ్రామ ఆరో వార్డు సభ్యుడు సుంకన్న వైకాపా కార్యకర్తల అరాచకాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ‘శ్మశానాన్ని కొందరు వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారు. బడి స్థలాన్ని ఆక్రమించారు. వాగు భూమిలో మట్టి తోలడంతో సమీపంలోని కోనేరుకు నీరు రావడం లేద’ని చెప్పారు. నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన మంత్రి, ఆయన అనుచరులు వృద్ధుడన్న కనికరం లేకుండా సుంకన్నపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో బుధవారం ఉదయం 11 గంటలకు సుంకన్నను స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు.. గురువారం సాయంత్రం వదిలారు. సుమారు 30 గంటల పాటు తమ సమక్షంలో ఉంచుకున్నప్పటికీ అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేదని సుంకన్న కన్నీటి పర్యంతమయ్యారు. ‘మంత్రిని అడగడం తప్పా? నాకు అడిగే హక్కు లేదా? సమస్యకు పరిష్కారం చూపిస్తారని చెప్పాను. అంతకుమించి నాకే ఉద్దేశమూ లేదు. నేను వార్డు సభ్యుడిని. నా వయసును చూసైనా గౌరవించకుండా చిత్రహింసలు పెడుతున్నారు’ అని వాపోయారు.
ఎన్నికల ముందర కేసుల పరంపర
- డోన్ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి అనుచరుడైన గుమ్మకొండకు చెందిన సర్పంచి దశరథరామిరెడ్డిపై మార్చి 26న పోలీసులు కేసు పెట్టారు. వైకాపా కార్యాలయం ముందు రెచ్చగొట్టేలా, అసభ్యంగా మాట్లాడారన్నది అభియోగం. మంగళవారం ఆయన ఓ వేడుకలో ఉండగా, పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో బయటపడ్డారు.
- కోట్ల అభిమాని అయిన లద్దగిరికి చెందిన మిన్నెల్ల అనే వ్యక్తి 20 రోజుల కిందట ఓ వాట్సప్ గ్రూపులో గుత్తేదారుల కష్టాలు, తెదేపా వాళ్లపై అకారణంగా పెడుతున్న కేసుల గురించి ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ఆ వాయిస్ మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. డోన్ ఎంపీపీ ఫిర్యాదుతో మిన్నెల్లపై 4 సెక్షన్లతో కేసు పెట్టారు. ఆయన అరెస్ట్కు సిద్ధంకాగా, కోట్ల కల్పించుకొని పోలీసులకు ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రస్తుతానికి మిన్నెల్లను అరెస్ట్ చేయకుండా ఆపారు.
- బుగ్గన ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం సమీపానికి వచ్చినా స్పందించని పోలీసులు.. తెదేపా అభ్యర్థి సూర్యప్రకాశ్రెడ్డి అనుచరులను మాత్రం అర కిలోమీటర్ దూరంలోనే ఆపేశారు. వైకాపా కార్యకర్త ఒకరు పోలీసు స్టేషన్ సమీపంలోనే మద్యం తాగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తిరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..