Health: క్లోమగ్రంధిలో వాపు ప్రాణాంతకమా? తెలుసుకోండి..
తినగానే పొట్టలో నొప్పి మొదలవుతుంది. అది కూడా బొడ్డు పైభాగంలో వస్తే ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి
ఇంటర్నెట్ డెస్క్: తినగానే పొట్టలో నొప్పి మొదలవుతుంది. అది కూడా బొడ్డు పైభాగంలో వస్తే ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనక పాంక్రియాటైటీస్ కారణం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. క్లోమగ్రంధికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినపుడు అది క్రమంగా తనను తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మృత్యుముఖంలోకి తీసుకెళ్తుంది. ప్రాణాంతకంగా మారే ఈ పాంక్రియాటైటీస్ గురించి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు పీవీ రమణమూర్తి వివరించారు.
క్లోమగ్రంధి ఏం చేస్తుందంటే: క్లోమగ్రంధి మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంతో పాటు కీలకమైన ఇన్సులిన్ హార్మొన్ను స్రవించడంతో శరీరంలో మధుమేహం స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. ఏదైనా కారణంతో క్లోమగ్రంధిలో అడ్డంకులు ఎదురయినపుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు వాపు మొదలవుతుంది.
వాపు ఎందుకొస్తుందంటే..: క్లోమగ్రంధిలో వాపు ఎక్కువగా మధ్యపానం, గాల్బ్లాడర్లో రాళ్లు ఉన్నపుడు వస్తుంది. ఆల్కాహాల్ తాగినపుడు తర్వాతి రోజు బాగా కడుపునొప్పి రావడం, వాంతులు రావడం, నడుం లోపల పొడిచినట్టు ఉంటుంది. ఇది పాంక్రియాటైటీస్ అని నిర్థారణ అయితే ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాలి. రక్తంలో ట్రైగ్లిసరైడ్ కొవ్వు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నా క్లోమగ్రంధి వాపు వస్తుంది. ఆస్తమాను అదుపులో పెట్టే మందులతో కూడా రావచ్చని తెలుస్తోంది.
చికిత్స ఎలాగంటే: పాంక్రియాటైటీస్ వచ్చిందని గుర్తించిన తర్వాత రోగి స్థితి ఆధారంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. రక్త ప్రసరణ తగ్గి కొంత భాగం కుళ్లిపోయినట్టు అయి ఇన్ఫెక్షన్ సోకితే వందకు వందశాతం ఓపెన్ ఆపరేషన్ చేయాల్సిందే. ఈ పరిస్థితి వచ్చినపుడు వందలో 40 మందికి ప్రాణాంతకంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?