AP News District: ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు?

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

Updated : 05 Apr 2022 16:04 IST

అమరావతి: ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. మచిలీపట్నంలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. కొత్త జిల్లా ఏర్పాటుపై మాట్లాడారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలన్నీ ఒకే జిల్లాగా ఉండాలనేది సీఎం జగన్‌ ఆలోచనని తెలిపారు. రానున్న రోజుల్లో ఆదివాసీ ప్రాంతాలను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని నాని చెప్పారు. పాలనను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నామన్నారు. 

ఇప్పటికే రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని తాజా వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని