Anantapuram: జగన్‌ పర్యటన బందోబస్త్‌.. అల్పాహారం కోసం ఎగబడిన పోలీసులు

జగన్‌పర్యటన బందోబస్త్‌కు వెళ్లిన పోలీసులకు సకాలంలో అల్పాహారం అందలేదు. ఒకే ఒక్క వాహనం అక్కడికి రావడంతో పోలీసులంతా టిఫిన్‌ పొట్లాల కోసం ఎగబడ్డారు.

Updated : 08 Jul 2023 12:19 IST

కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాదుర్గంలో సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పోలీస్‌ సిబ్బంది ఆకలితో అలమటిస్తున్నారు. బందోబస్తు కోసం వేకువజామున 3 గంటలకే వచ్చినా.. ఉదయం 10 గంటలైనా అల్పాహారం ఇవ్వకపోవడంతో పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని హోటళ్లు,దుకాణాలు మూసివేతతో టిఫిన్‌ దొరక్క అవస్థలు పడుతున్నారు. దీర్ఘకాలిక జబ్బులు, షుగర్‌, బీపీ ఉన్న సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒక వాహనంలో అల్పాహారం తీసుకురావడంతో పొట్లాల కోసం ఖాకీలు ఎగబడ్డారు. కొంతమందికే అల్పాహారం దక్కడంతో మిగిలిన వారంతా నిరాశతో ఎదురు చూస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు