బండలాగుడు పోటీలను తిలకించిన సీఎం జగన్‌

కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పందేలను సీఎం తిలకించారు.

Updated : 14 Jan 2020 18:25 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పందేలను సీఎం తిలకించారు. పోటీల నిర్వహణ తీరును మంత్రి కొడాలి నాని తదితరులు జగన్‌కు వివరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అంతకుముందు చిన్నారులపై సీఎం భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు.

 

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని