జగిత్యాలలో కరోనా అనుమానిత కేసు

తెలంగాణలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. జగిత్యాల మండలం గోపాల్‌రావుపేటకు చెందిన ఓ యువకుడు (30) కరోనా వ్యాధి లక్షణాలతో జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన యువకుడు దగ్గు, జలుబుతో పాటు...

Updated : 06 Mar 2020 18:14 IST

జగిత్యాల: తెలంగాణలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. జగిత్యాల మండలం గోపాల్‌రావుపేటకు చెందిన ఓ యువకుడు (30) కరోనా వ్యాధి లక్షణాలతో జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన యువకుడు దగ్గు, జలుబుతో పాటు కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. వారమైనా తగ్గకపోవడంతో జగిత్యాల ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు ప్రాథమికంగా పరీక్షించి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువకుడి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని