నిర్భయ దోషుల న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం
నిర్భయ దోషుల తరఫు న్యాయవాది తీరుపై పటియాలా హౌస్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారీ చివరి క్షణంలోనే ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారని......
దిల్లీ: నిర్భయ దోషుల తరఫు న్యాయవాది తీరుపై పటియాలా హౌస్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారీ చివరి క్షణంలోనే ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారని మండిపడింది. నిర్భయ దోషులకు న్యాయపరంగా ఇంకొన్ని అవకాశాలు ఉన్నాయంటూ వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ బుధవారం మరోసారి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించింది. ఇందుకు గల కారణలతో తిహాడ్ జైలు ఉన్నతాధికారులు నుంచి గురువారం నివేదిక తీసుకురావాలని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్రరానా సూచించారు. దోషులకు ఇంకా ఎలాంటి అవకాశాలూ లేవని, వారి ఉరిశిక్ష అమలుకు కేవలం 36 గంటలు మాత్రమే సమయం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. నిర్భయ దోషులైన పవన్ గుప్తా, ముకేశ్సింగ్, అక్షయ్ఠాకూర్, వినయ్శర్మను ఈ నెల 20న ఉదయం 5.30గంటలకు ఉరితీయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?