కరోనా మృతుడి అంత్యక్రియలు పూర్తి

కరోనాతో మృతిచెందిన నిర్మల్‌ జిల్లావాసి అంత్యక్రియలు పూర్తయినట్లు నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ తెలిపారు. నిర్మల్‌కు చెందిన వ్యక్తి కరోనాతో గాంధీలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయిన విషయం తెలిసిందే.

Updated : 02 Apr 2020 19:26 IST

నిర్మల్‌: కరోనాతో మృతిచెందిన నిర్మల్‌ జిల్లావాసి అంత్యక్రియలు పూర్తయినట్లు నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ తెలిపారు. నిర్మల్‌కు చెందిన వ్యక్తి కరోనాతో గాంధీలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. మృతుడు దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చినట్లు గుర్తించామని కలెక్టర్‌ చెప్పారు. దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మృతుడు 36 మందిని కలిసినట్లు నిర్ధారణ అయిందని.. వారిని కూడా క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన నేపథ్యంలో మృతుడి కుటుంబం నివాసం ఉంటున్న కాలనీలో కిలోమీటర్‌ మేర దిగ్బంధం చేసినట్లు కలెక్టర్‌ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 52 మంది దిల్లీ ప్రార్థనలకు వెళ్లినట్లు గుర్తించామని.. రేపటి నుంచి నిర్మల్‌లో 100 వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని