ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా
నగర జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్రం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ రాష్ట్రవ్యాప్తంగా...
న్యూయార్క్లో కేసుల తీరు..
నమూనా ‘యాంటీబాడీ పరీక్షల’ ఆధారంగా గుర్తింపు
న్యూయార్క్(అమెరికా) నగర జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్రం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ రాష్ట్రవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు, బిగ్ బాక్స్ స్టోర్ల బయట నిర్వహించిన 3 వేల యాంటీబాడీ పరీక్షల ఆధారంగా ఈ లెక్క కట్టారు. ‘‘న్యూయార్క్ నగరంలో 21% మంది (దాదాపుగా 20 లక్షల మంది)లో, రాష్ట్రవ్యాప్తంగా 13.9% మందిలో వైరస్ యాంటీబాడీలు ఉన్నాయి. అంటే 3 నుంచి 6 వారాల క్రితమే వారు వైరస్ బారిన పడి కోలుకున్నారు’’ అని రాష్ట్ర గవర్నర్ కుమోవ్ గురువారం వెల్లడించారు. ఈ లెక్కలను మొత్తం జనాభాతో పోల్చలేమని, పూర్తిస్థాయిలో బాధితుల సంఖ్యని ఈ అధ్యయనం వెల్లడించలేదని చెప్పారు. ‘‘వీరంతా షాపింగ్కు వచ్చినవారు. ఇళ్లలో ఉన్నవారు, క్వారంటైన్లో, ఐసోలేషన్లో ఉన్నవారు, వైద్యులు, ఆరోగ్య సేవకులు, విధుల్లో ఉన్నవారు ఈ సర్వేలో భాగం కాలేదు’’ అని కుమోవ్ పేర్కొన్నారు.బాధితుల్లో తెల్లవారి కంటే నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్లు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో నిప్పులు చెరిగిన భానుడు
రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?