నడిరోడ్డుపై చిరుత...ఆందోళనలో జనం
లాక్డౌన్ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేశ్చగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలికి గాయమై కదల్లేని స్థితిలో చిరుత రహదారిపై కూర్చొని ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. వాహనదారులపై చిరుత దాడి చేసే అవకాశముండటంతో జాతీయ రహదారిపై రాకపోకలను నియంత్రించారు.
అటవీశాఖ, జూపార్క్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని సమీపంలో ఫంక్షన్హాలులోకి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ లారీ డ్రైవర్ను గాయపరిచింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఫంక్షన్ హాలు ప్రాంగణం నుంచి సమీపంలో ఉన్న బొప్పాయి తోటలోకి వెళ్లింది. డ్రోన్ కెమెరా సాయంతో చిరుత ఉన్న ప్రదేశాన్ని అధికారులు గుర్తించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిరుతను బంధిస్తామని, ఆ తర్వత జూపార్క్కు తరలించి కోలుకున్న తర్వాత అటవీప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?