ఆంధ్రప్రదేశ్‌ కరోనా @ 1,555

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి...

Updated : 09 Jul 2020 14:15 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. ఈ రోజు రాష్ట్రంలో కరోనాతో 13 మంది చనిపోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు 277 మంది కరోనాతో మృతి చెందారు.  ఈ రోజు నమోదైన కేసులలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 53 మంది కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు. రాష్ట్రానికి చెందివారు 1500 మంది. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు మరో 904 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

జిల్లాల వారీగా వివరాలు...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని