CJI: అమరావతిలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఘన స్వాగతం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జస్టిస్‌

Updated : 26 Dec 2021 15:53 IST

అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జస్టిస్‌ ఎన్వీ రమణ అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాయపూడి వద్ద సీజేఐకి అమరావతి ఐకాస రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. జాతీయ జెండాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం హైకోర్టు ప్రాంగణంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులను న్యాయవాదులు సన్మానించారు.  సీజేఐ దంపతులను గజమాలతో హైకోర్టు సిబ్బంది సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని