నీటి ట్యాంకర్‌లో పట్టుబడిన మద్యం!

గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టుబడింది.

Published : 05 Sep 2020 22:53 IST

గుంటూరు: గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి నీటి ట్యాంకర్‌లో మద్యం తరలిస్తుండగా 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా వేసిన పోలీసులు.. నిందితుల నుంచి సుమారు 10వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నా తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని