TS High Court: డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది.

Updated : 21 Dec 2023 12:15 IST

హైదరాబాద్‌: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎన్నికలు వాయిదా వేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని