TS News: గద్వాల ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. రూ.5లక్షల చొప్పున పరిహారం

గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

Published : 10 Oct 2021 11:50 IST

హైదరాబాద్‌: గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు చనిపోవడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. మృతులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని సీఎం ఆదేశించారు. నిన్న కురిసిన వర్షానికి ఇంట్లో నిద్రిస్తున్న ఏడుగురిపై గోడ కూలడంతో ఐదుగురు మృతిచెందడంతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని