ap corona update: ఏపీలో కొత్తగా 1,171 కరోనా కేసులు.. 11 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇప్పటికీ వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు..

Updated : 23 Sep 2021 19:20 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇప్పటికీ వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,207 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,749 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని