‘మైసమ్మ’ పాటతో ఆకర్షిస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌!

నాగర్‌కర్నూల్‌లో ఓ బస్సు డ్రైవర్‌ మైసమ్మపై పాట పాడి ఆకట్టుకుంటున్నారు. జిల్లా కేంద్రం నుంచి పెద్దకొత్తపల్లి మండలం నాయిన్‌పల్లి మైసమ్మకు ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సుల్ని నడుపుతారు.

Published : 02 Mar 2021 00:58 IST

నాగకర్నూల్‌ జిల్లా: నాగర్‌కర్నూల్‌లో ఓ బస్సు డ్రైవర్‌ మైసమ్మపై పాట పాడి ఆకట్టుకుంటున్నారు. జిల్లా కేంద్రం నుంచి పెద్దకొత్తపల్లి మండలం నాయిన్‌పల్లి మైసమ్మకు ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సుల్ని నడుపుతారు. ఈ నేపథ్యంలోనే నిన్న అమ్మవారి దగ్గరకు వెళ్లేందుకు బస్సు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు మైసమ్మ పాటపాడి అలరించారు. కరోనాతో కష్టకాలంలో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని డ్రైవర్‌ శాంతయ్య పేర్కొన్నాడు. అయితే, ఆయన పాట పాడుతూ.. అలరించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని