Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. విశాఖలో ‘ఇన్ఫోసిస్’ షురూ..
విశాఖపట్నంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఎంప్లాయి లీడర్షిప్ కనెక్ట్’ పేరుతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జులై 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని ఐటీ పార్కులోని హిల్-2, 3 జంక్షన్లో మౌరి టెక్ ఎదురుగా సిగ్నిటీ టవర్స్ భవన్లో ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ రెండు షిఫ్టులలో 1400 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మూడేళ్ల అనుభవం.. 30 కి.మీ. తప్పనిసరి
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ టెండరు నిబంధనల రూపకల్పనలో మెట్రో వర్గాలు పకడ్బందీగా వ్యవహరించాయి. హైదరాబాద్ విమానాశ్రయ ఎక్స్ప్రెస్ మెట్రో(హెచ్ఏఎంఎల్) సంస్థ విధించిన షరతులు కఠినంగా ఉన్నాయని.. బిడ్డింగ్కు అర్హత సాధించే సంస్థలు తక్కువగా ఉంటాయని ఇన్ఫ్రా సర్కిల్లో చర్చ నడుస్తోంది. బిడ్లో పాల్గొనాలంటే ఇది వరకు 30 కి.మీ. మెట్రో రైలు పనులు చేపట్టిన అనుభవం ఉండాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఒక మిరపకాయ రూ.3.. ఒక టమాటా రూ.5
హైదరాబాద్: టమాటా ధర ఈ నెల ప్రారంభంలో కిలో రూ.15 ఉండేది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.100 దాటేసింది. కొన్నిచోట్ల రూ.120కి కూడా విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కూడా రూ.100-120కి చేరింది. హనుమకొండలో ఏకంగా రూ.200కి కూడా విక్రయిస్తున్నారు. ఇవేకాదు.. ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయలు, ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. గ్రామాల నుంచి నగరాల దాకా అన్నిచోట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Hyderabad: గ్యాస్ కావాలా.. వాట్సాప్ చేస్తే చాలు
హైదరాబాద్: కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ చేస్తున్నారా..? ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారా..? ఇక ఆ ప్రయాస అవసరం లేదు. వాట్సాప్లో ఆప్షన్ ఎంపిక చేసుకుంటే చాలు కొత్త కనెక్షన్ సులభంగా పొందొచ్చు. వినియోగదారుల కోసం వాట్సాప్ సేవలు తీసుకొచ్చినా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. యిల్ కంపెనీల వాట్సాప్ నంబర్లతో సైతం వినియోగదారులు క్షణాల్లో బుకింగ్, రీఫిల్లింగ్, ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కూర్చోబెట్టండి.. రూ.కోట్లు కురిపిస్తాం
కోరుకున్న చోట పోస్టింగ్స్ కోసం పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి వరుస కడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏసీపీ, ఇన్స్పెక్టర్ల పోస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో జనావాస విస్తరణతో భూములకు గిరాకీ పెరిగింది. రూ.కోట్లు పలికే భూ వివాదాలతో లాభపడొచ్చనే ఆలోచన కూడా దీనికి కారణం కావచ్చని ఓ పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించడం పరిస్థితికి అద్దంపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ‘గుట్ట’క్కమన్నా.. ఆపేదెవరు?
అది ఓ గుట్ట. చిత్తూరు నగరంలో జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. రూ.10 కోట్ల విలువైన భూమిపై స్థానిక వైకాపా నాయకులు కన్నేశారు. కబ్జా చేసి మామిడి మొక్కలు నాటినా అడగాల్సిన, అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుందే తప్ప చర్యలు తీసుకోవడానికి మాత్రం సాహసం చేయలేదు. ఉన్నతాధికారులైనా రంగంలోకి దిగి కబ్జాకు గురైన గుట్టను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. పేదలకు గృహలక్ష్మి అనుగ్రహం!
సొంతిల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ విషయాన్ని ఆలోచించరు. ఈ నేపథ్యంలో వీరి ఆకాంక్షను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే కొన్ని చోట్ల మాత్రమే వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో కొందరికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఎన్ని విచిత్రాలో..
ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి. ప్రస్తుతం వరుస క్రమం తప్పడంతో ఎవరి ఓటు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జాబితా మొత్తం పరిశీలిస్తే తప్ప.. ఓటు ఉన్న విషయం తెలియని దుస్థితి. ఇష్టారాజ్యంగా జాబితాలు రూపొందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. cm jagan: జగన్ మామ.. ఘాటు ప్రేమ
నా ఎస్సీ... నా ఎస్టీ... దాదాపుగా ప్రతీ సభలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే పలికే మాట ఇది. పెదవుల్లోంచి వచ్చే పైపై మాటల ద్వారానే ఘాటు ప్రేమ చూపించడంలో ఆరితేరిపోయిన సీఎం జగన్... చేతల్లో వారి భవిష్యత్తుకు సమాధి కడుతున్నారన్నది నిష్ఠుర సత్యం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బంగారం ధర తగ్గినా.. కనిపించని మక్కువ..
అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో గత పది రోజులుగా బంగారం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు నెలలుగా 24 క్యారెట్లు పది గ్రాములు బంగారం ధర రూ.63,500 వరకు ఎగబాకింది. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.60,300కు దిగివచ్చింది. ధరలు తగ్గినా అమ్మకాలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని బులియన్ మార్కెట్ కళ తప్పుతోంది. ఆర్థిక మాంద్యం, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, ఉత్పత్తి పెరగడం తదితర కారణాలతో బంగారంపై పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ మాత్రమే ఎక్కువగా సాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత