Gold: ధర తగ్గినా.. కనిపించని మక్కువ..
అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో గత పది రోజులుగా బంగారం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.
కళ తప్పిన బులియన్ మార్కెట్
నరసాపురం తూర్పుతాళ్లు, న్యూస్టుడే: అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో గత పది రోజులుగా బంగారం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు నెలలుగా 24 క్యారెట్లు పది గ్రాములు బంగారం ధర రూ.63,500 వరకు ఎగబాకింది. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.60,300కు దిగివచ్చింది. ధరలు తగ్గినా అమ్మకాలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని బులియన్ మార్కెట్ కళ తప్పుతోంది. ఆర్థిక మాంద్యం, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, ఉత్పత్తి పెరగడం తదితర కారణాలతో బంగారంపై పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ మాత్రమే ఎక్కువగా సాగుతోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బంగారం వ్యాపారానికి నరసాపురం పేరుగాంచింది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 900 దుకాణాలు ఉండగా నరసాపురంలోనే 90 వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో నెలకు సరాసరి రూ.200 కోట్లు వ్యాపారం జరుగుతుందని అంచనా. ఆ పరిస్థితి ఇటీవల కాలంలో కానరావడం లేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఆషాఢ మాసం, ముహూర్తాలు లేకపోవడం, ఆక్వా, వ్యవసాయ రంగాల్లో నష్టాలు తదితర కారణాలతో బంగారం కొనుగోళ్ల శాతం తగ్గింది. బులియన్ మార్కెట్ ప్రభావం ఇతర రంగాలపైనా పడింది. గతంలో జిల్లాతోపాటు తూర్పు, కృష్ణా జిల్లాలు, తెలంగాణ నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. విక్రయాలు తగ్గడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నరసాపురం సర్కిల్ పరిధిలో ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఆదాయం కూడా తగ్గింది. ‘బంగారం ధరలు కొంత మేర తగ్గినా విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. తప్పనిసరి అయితేనే కొంటున్నారు. ఎక్కువ మంది పాత బంగారం తాకట్టు, విక్రయించడమే కనిపిస్తోంది’ అని నరసాపురం బంగారు వర్తకుల సంఘ అధ్యక్షుడు వినోద్కుమార్ జైన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనలో చేరనున్న వైకాపా నాయకులు
[ 29-04-2024]
వైకాపాకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఈ నెల 30 న కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. -
జగనన్న బీమాయాజాలం
[ 29-04-2024]
అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
నేటి నుంచి పవన్ ప్రచార భేరి
[ 29-04-2024]
ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్కల్యాణ్ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
హామీలపై దగా.. ప్రశ్నించినందుకు పగ!
[ 29-04-2024]
‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్మోహన్రెడ్డి చివరకు మొండి చేయి చూపారు. -
ఆదుకోమంటే బాదేశారు
[ 29-04-2024]
పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. -
ప్రలోభాల బటన్ నొక్కేశారు!
[ 29-04-2024]
ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరువ చేశాం.. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ నిన్నమొన్నటి వరకు బీరాలు పలికిన అధికార వైకాపా నాయకులు.. -
ఎన్నికల వేళ.. ఇసుకాసురుల తెగింపు
[ 29-04-2024]
ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు. -
వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 29-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
కొల్లేరుపై అన్నీ కోతలే
[ 29-04-2024]
దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు.. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని పక్షి జాతులు.. అరుదైన మత్స్యజాతికి ఆలవాలం.. ఎన్నో సంస్కృతుల సమాహారం.. ద్వీపాలు, ద్వీపఖండాల మనోహరం కొల్లేరు. -
జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల
[ 29-04-2024]
రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. -
‘వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నాశనం’
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని నరసాపురం పార్లమెంట్ భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
ఉపాధి పనుల్లో పశువులు!
[ 29-04-2024]
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
ఏటా కొలువులన్నావ్.. కన్నీటినే మిగిల్చావ్..!
[ 29-04-2024]
జగన్మోహన్రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. -
ఇంటింటికీ ప్రచార వాహనం....
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ రేషన్ పేరిట వైకాపా నాయకులు, అనుచరులకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్ కుటుంబం అవినీతితో ఎదిగింది : జోగయ్య
[ 29-04-2024]
వైఎస్సార్ కుటుంబమంతా అవినీతిలోనే ఎదిగిందని మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య అన్నారు. -
కొత్త ఓటర్లు 24,599 మంది
[ 29-04-2024]
ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు లేనివారికి ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఏప్రిల్ 15 వరకూ గడువిచ్చింది. -
నేడు కొయ్యలగూడెంలో షర్మిల పర్యటన
[ 29-04-2024]
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన న్యాయయాత్ర సోమవారం కొయ్యలగూడెం చేరుకోనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?