cm jagan: జగన్ మామ.. ఘాటు ప్రేమ
నా ఎస్సీ... నా ఎస్టీ...దాదాపుగా ప్రతీ సభలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే పలికే మాట ఇది.
ఎస్సీ, ఎస్టీ సాంకేతిక విద్యార్థులపై సర్కారు నిర్లక్ష్యం
జీఎంఆర్ కళాశాలల నిర్వీర్యం
నా ఎస్సీ... నా ఎస్టీ...
దాదాపుగా ప్రతీ సభలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే పలికే మాట ఇది. పెదవుల్లోంచి వచ్చే పైపై మాటల ద్వారానే ఘాటు ప్రేమ చూపించడంలో ఆరితేరిపోయిన సీఎం జగన్... చేతల్లో వారి భవిష్యత్తుకు సమాధి కడుతున్నారన్నది నిష్ఠుర సత్యం.
ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలలను చూడండి.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా ఆ వర్గాల విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేయడంలో జగన్ సర్కారు వందశాతం విజయం సాధించింది.
* ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ (జీఎంఆర్) పాలిటెక్నిక్ కళాశాలలు 7. అవి కేఆర్పురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, శ్రీశైలం, ఏటపాక, రంపచోడవరం, పాడేరు. ఇక్కడ 85శాతం సీట్లు ఎస్టీ విద్యార్థులకే.
* ఎస్సీల కోసం ఏర్పాటు చేసినవి 2. అవి మదనపల్లె, రాజమహేంద్రవరం. ఇక్కడ 70 శాతం సీట్లు వారితోనే భర్తీ చేయాలి.
* వీరికి అన్ని సదుపాయాలు కల్పించి, డిప్లమో విద్యను అందించాలి.
* జగన్ సర్కారు వచ్చాక నిర్వీర్యం చేసే దిశగానే అడుగులేసింది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గతంలో ఏర్పాటు చేసిన జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలను జగన్ సర్కారు గాలికొదిలేసింది. నిధులివ్వకుండా.. అధ్యాపకులను నియమించకుండా.. వసతిగృహాలను పట్టించుకోకుండా.. సదుపాయాలను సమకూర్చకుండా.. కోర్సుల్లో మార్పులు చేయకుండా.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది.
* జీఎంఆర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు ఇవ్వడం మానేసింది.
* విద్యార్థుల భోజన ఖర్చుకు డబ్బులు అప్పుడప్పుడూ ఇస్తూ వారిని ఇబ్బంది పెడుతోంది.
* నాణ్యమైన విద్య అందకుండా.. అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయడం లేదు.
* ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక నిధులనూ ఇవ్వటం లేదు.
* ఉచిత పుస్తకాల సరఫరా కూడా అంతంతమాత్రమే. గుర్తొచ్చినప్పుడు ఇవ్వటం, లేదంటే ఎగనామం పెట్టడం జగన్ సర్కారుకు అలవాటుగా మారిపోయింది.
* గతంలో విద్యాశాఖలో ఉన్న పాలిటెక్నిక్లను నైపుణ్యాభివృద్ధి శాఖలోకి తీసుకొచ్చినా. నిధులిస్తున్న దాఖలాల్లేవు.
అధ్యాపకుల్లేరు.. పాఠాలు ఎలా?
* రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలుండగా వీటిల్లో 11 కళాశాలలకు అధ్యాపక పోస్టులే లేవు. మరో 13 కళాశాలలకు అరకొరగానే మంజూరు చేశారు.
* 11 కళాశాలల్లోనూ ప్రిన్సిపల్ లేదా హెచ్ఓడీని ఓఎస్డీగా నియమించి, ఒప్పంద అధ్యాపకులతో పాఠాలు చెప్పిస్తున్నారు..
* నిబంధనల ప్రకారం బ్రాంచికి హెచ్ఓడీ, సీనియర్ లెక్చరరు, ఐదుగురు లెక్చరర్లు ఉండాలి. 24 కళాశాలల్లో 223 పోస్టులకుగాను 65 మందే రెగ్యులర్ వాళ్లున్నారు.
* తాజాగా బేతంచర్ల, గుంతకల్, మైదుకూరుల్లో కొత్త పాలిటెక్నిక్లను మంజూరు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశాలు నిర్వహిస్తోంది. పోస్టులను మాత్రం ఇవ్వలేదు.
* అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఐదేళ్లలో తప్పనిసరిగా పోస్టులను మంజూరు చేయాలి. సాంకేతిక విద్యాశాఖ ఈ నిబంధనను పాటించడం లేదు. కొత్త పోస్టుల మంజూరు కోసం కమిషనరేట్ నుంచి ఆర్థిక శాఖకు దస్త్రం పంపినా పక్కన పడేస్తున్నారు. ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, రంపచోడవరం, కేఆర్ పురం పాలిటెక్నిక్లకు ఒక్క పోస్టూ ఇవ్వలేదు.
* అధ్యాపకుల కొరత కారణంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలువురు ఒప్పంద అధ్యాపకులు నెలలో సగం రోజులు ఒకచోట, మరో సగం రోజులు మరోచోట బోధన చేస్తున్నారు. ఏఐసీటీఈ ప్రకారం అధ్యాపకుడు వారానికి 18 గంటలు బోధించాలి. రెండుచోట్ల పని చేసే ఒప్పంద అధ్యాపకులు 36 గంటలు బోధిస్తే తప్ప పాఠాలు పూర్తి కాని పరిస్థితి.
ప్రవేశాలేవీ?
* ఏలూరు జిల్లా కేఆర్ పురం పాలిటెక్నిక్లో గతేడాది ఒక్కరూ చేరలేదు. ప్రస్తుతం విద్యార్థుల్లేరు. అధ్యాపకులూ లేరు. రికార్డుల్లో మాత్రం సివిల్, ఈఈఈల్లో 120 సీట్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. భవన నిర్మాణాలు పూర్తి కాలేదు.
* అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం జీఎంఆర్లో మూడేళ్లలో కలిపి 10 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ మెకానికల్లో 60, ఈఈఈలోలో 30 చొప్పున సీట్లు ఉన్నాయి.
* పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట జీఎంఆర్ పాలిటెక్నిక్లో మూడేళ్లకు కలిపి కేవలం ఆరుగురే ఉన్నారు. గతేడాది ఒక్క విద్యార్థి మాత్రమే చేరారు. ఇక్కడ సివిల్, మెకానికల్లో 54 చొప్పున సీట్లు ఉన్నాయి.
* గుమ్మలక్ష్మీపురం కళాశాలలో గతేడాది ఒక్కరే చేరారు. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు చదువుతున్నారు. ఇక్కడ ఈఈఈ, ఎంఈసీల్లో 60 చొప్పున సీట్లున్నా పిల్లలు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
* కాకినాడ జిల్లా అనపర్తి కళాశాలకు ఇంతవరకు భవనమే నిర్మించలేదు. అనకాపల్లి జిల్లా చోడవరంలో పాఠశాల భవనంలోనే కళాశాలను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులోనూ ఇదే పరిస్థితి. ఆరు బయటే ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వసతిగృహం దూరంగా ఉండడం, సదుపాయాలు లేకపోవడంతో గతేడాది ఐదుగురు మాత్రమే చేరారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే