‘గుట్ట’క్కమన్నా.. ఆపేదెవరు?
అది ఓ గుట్ట. చిత్తూరు నగరంలో జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. రూ.10 కోట్ల విలువైన భూమిపై స్థానిక వైకాపా నాయకులు కన్నేశారు.
రూ.10 కోట్ల భూమిని కబ్జా చేసిన వైకాపా నాయకులు
పక్క స్థలం ఆక్రమణకు పావులు
మీనమేషాలు లెక్కిస్తున్న యంత్రాంగం
ఈనాడు, చిత్తూరు- న్యూస్టుడే, చిత్తూరు గ్రామీణ:
గుట్టను ఆక్రమించి మామిడి మొక్కలు నాటిన దృశ్యం
అది ఓ గుట్ట. చిత్తూరు నగరంలో జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. రూ.10 కోట్ల విలువైన భూమిపై స్థానిక వైకాపా నాయకులు కన్నేశారు. కబ్జా చేసి మామిడి మొక్కలు నాటినా అడగాల్సిన, అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుందే తప్ప చర్యలు తీసుకోవడానికి మాత్రం సాహసం చేయలేదు. ఉన్నతాధికారులైనా రంగంలోకి దిగి కబ్జాకు గురైన గుట్టను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు.
చిత్తూరు నగరానికి సమీపం నుంచే రెండు జాతీయ రహదారులు వెళుతుండటం, మరో రెండు ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం చురుగ్గా సాగుతుండటంతో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ప్రజలు ఒక ప్లాటు కొనుగోలు చేయాలన్నా అప్పటివరకూ కష్టపడి సంపాదించిన డబ్బుతోపాటు రుణం తీసుకోవాల్సి వస్తోంది. అదే అధికార పార్టీ నాయకులు చమట చుక్క చిందించకుండానే ఎకరాల కొద్దీ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ గుట్ట, మేత, ప్రభుత్వ స్థలాలను ఆగమేఘాలపై గుర్తించి రాత్రికి రాత్రే ఆ ప్రాంతంలో మామిడి మొక్కలు నాటేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి తంతే చిత్తూరు మండలంలో జరిగింది.
కంచె వేసేందుకు యత్నాలు
సదరు గుట్ట దాదాపు ఎనిమిది ఎకరాల్లో విస్తరించగా మొదట ఓ వైకాపా నేత నాలుగు ఎకరాలు ఆక్రమించాడు. దాని చుట్టూ కంచె వేసేందుకు రాతి కూసాలు కూడా పాతారు. పొక్లెయిన్లతో ఆ ప్రాంతాన్ని చదును చేసిన తర్వాత మామిడి మొక్కలు గుట్టపై మామిడి మొక్కలు నాటారు. వాటికి నీటి సదుపాయం కల్పించేందుకు కింద నుంచి ప్రత్యేకంగా పైప్లైన్ సైతం ఏర్పాటు చేశారంటే ఆక్రమణల విషయంలో అధికార పార్టీ నాయకులు ఎంత పకడ్బందీగా ముందుకు కదులుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడంటే..
చిత్తూరు సమీపంలోని తేనెబండ రెవెన్యూ పరిధిలో చెర్లోపల్లి పంచాయతీ కమ్మపల్లి విద్యుత్తు ఉప కేంద్రం పక్కనున్న గుట్టను స్థానిక వైకాపా నేతలు ఆక్రమించుకున్నారు. చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ భూమిని ఆక్రమించకూడదని స్థానికులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా అక్రమార్కులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.
కలెక్టర్, జేసీ పదేపదే హెచ్చరిస్తున్నా..
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ, మేత, పొరంబోకు ఆక్రమణలు జరగకుండా చూడాలని తహసీల్దార్లను పదేపదే కలెక్టర్ షన్మోహన్, జేసీ శ్రీనివాసులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే రెవెన్యూ సిబ్బందితో ఫిర్యాదులు చేయించి ఆయా స్టేషన్లలో క్రిమినల్ కేసులు కట్టించాలని ఆదేశిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇంత సీరియస్గా ఉన్నా చిత్తూరు మండలంలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది మాత్రం నిర్లిప్తంగా ఉండటంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణమా? లేదంటే స్థానికంగా ఉన్న అధికారులు, సిబ్బందికే తెలిసే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇంతటితో ఆగేలా లేరు..
జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో గుంట రూ.15 లక్షలకుపైగా పలుకుతోందని స్థానికులు అంటున్నారు. ఈ లెక్కన దాదాపు రూ.10 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని చెబుతున్నారు. కొంతకాలం తర్వాత మిగతా ప్రాంతాన్నీ స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. దీన్ని కూడా కలుపుకొంటే సుమారు రూ.20 కోట్ల భూమికి రెక్కలు వచ్చినట్టే.
మొక్కల కోసం ఏర్పాటు చేసిన కుళాయి
కఠిన చర్యలు తీసుకుంటాం
చిత్తూరు మండలంలో భూ ఆక్రమణలు జరిగితే అడ్డుకోవాలని స్థానిక వీఆర్వోలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చెర్లోపల్లి పంచాయతీలోని ఆక్రమణలపై కూడా విచారిస్తాం.
కిరణ్, తహసీల్దారు, చిత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపాలరావు వంక.. గుటకాయ స్వాహా..!
[ 17-05-2024]
కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. మంచి ధరలు పలుకుతుండటంతో.. ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. -
ఎవరి కళ్లకు కడతారు గంతలు?
[ 17-05-2024]
ఎక్కడైనా ప్రకృతి వనరులను అక్రమార్కులు దోచేస్తుంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రంగంలోకి దిగి తవ్వకాలు, రవాణాను నిలిపేస్తుంది. -
శివయ్యా.. ఇదేం ఘోరమయ్యా
[ 17-05-2024]
శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 17-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. -
ప్రవేశాల ప్రకటన ఆలస్యమేనా..?
[ 17-05-2024]
పది తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్లో భాగంగా మూడేళ్లు డిప్లమో చదివితే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ప్రవేశ ప్రకటన ఈ ఏడాది ఆలస్యం కానుంది. -
క్షేత్రస్థాయికి వెళ్తే.. కార్యాలయానికి తాళమే
[ 17-05-2024]
సచివాలయ వ్యవస్థతో గొప్ప మార్పు తెచ్చామని.. ప్రజల ముగింటకే అధికారులను తెచ్చామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
జీతాలు చెల్లించండి.. మహాప్రభో
[ 17-05-2024]
తమకు న్యాయంగా అందాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయా డెయిరీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. -
విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?
[ 17-05-2024]
సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్నాయక్ ఆరోపించారు. -
సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
[ 17-05-2024]
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. -
బండ వేషం.. జాతర విశేషం
[ 17-05-2024]
గంగజాతరలో బండ వేషధారణలు అలరించాయి. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా.. పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండోరోజు గురువారం సందడిగా సాగింది. -
వేసవి శిబిరాలు లేనట్టే..!
[ 17-05-2024]
వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం.. ఉల్లాసం.. ఉత్సాహాన్ని పొందుతుంటారు. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 17-05-2024]
భూసార పరీక్షలు అటకెక్కాయి. సాగులో మట్టి నమూనాలు కీలకం కాగా ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. ఎక్కడో ఓ చోట తీసి అయ్యిందనిపిస్తున్నారు. -
చెవికెక్కించుకుంటే ఇంతే..!
[ 17-05-2024]
వైకాపా నేతలతో భుజాలు రాసుకుని వారి చెప్పినట్లు వంతపాడిన అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు అధికారులు నిర్ధారించారు. -
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ