‘ఇన్ఫోసిస్’ షురూ..
విశాఖపట్నంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఎంప్లాయి లీడర్షిప్ కనెక్ట్’ పేరుతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
నేడు ఐటీపార్కులో ‘ఎంప్లాయ్ లీడర్షిప్ కనెక్ట్’ సమావేశం
జులై 1వ తేదీ నుంచి కార్యకలాపాలు!
ఇటీ పార్కులో ఇన్ఫోసిస్ భవనం ఇదే
ఈనాడు - విశాఖపట్నం: విశాఖపట్నంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఎంప్లాయి లీడర్షిప్ కనెక్ట్’ పేరుతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జులై 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని ఐటీ పార్కులోని హిల్-2, 3 జంక్షన్లో మౌరి టెక్ ఎదురుగా సిగ్నిటీ టవర్స్ భవన్లో ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ రెండు షిఫ్టులలో 1400 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది.
వర్క్ ఫ్రం హోం నుంచి ఆఫీస్కు..
కొవిడ్తో సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం పనిచేస్తున్నారు. అదే ఇంకా కొనసాగుతూ వస్తోంది. ‘వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్’కు ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలకు తమ సంస్థలను విస్తరించి ఉద్యోగులకు దగ్గరగా ఆఫీసు నెలకొల్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ భారతదేశంలో మొదటగా విశాఖపట్నం, నాగపూర్, కోయంబత్తూర్, భోపాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులను ఇక్కడ పనిచేసేందుకు ఒప్పించడం సులువవుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన (అపాయింట్మెంట్స్) వారు ఇక్కడ పనిచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి వారానికి రెండు, మూడు రోజులు కార్యాలయంలో పనిచేసేలా ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే భవనంలో....
ఇన్ఫోసిస్ నిర్ణయంతో ప్రభుత్వ ఐటీ విభాగం ముందుకొచ్చి అవసరమైన భవనం కేటాయించాలని ఏపీఐఐసీకి సూచించింది. ఆర్థిక మండలిలో ఆంక్షలతో కూడిన భవనాలు తమకు వద్దని, ఐటీ సెజ్లో డీనోటిఫై చేసిన భవనాలు, నగరంలోని పలు భవనాలను సంస్థ ప్రతినిధులు పరిశీలించినట్లు సమాచారం. చివరకు హిల్-2 సమీపంలోని మౌరి టెక్ భవనాన్ని ఎంపిక చేశారు. గత ప్రభుత్వం ఇదే భవనంలో బ్లాక్చెయిన్ టెక్నాలజీతో నడిచే పలు సంస్థలకు అవకాశం కల్పించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక అక్కడున్న సంస్థలు ప్రత్యామ్నాయం చూసుకుని వెళ్లిపోవడంతో ఆ భవనం ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులోనే ఇప్పుడు ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
[ 02-05-2024]
తెదేపా హయాంలో ‘బీఆర్ అంబేడ్కర్’ పేరుతో అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ముఖ్యమంత్రి జగన్ నీళ్లొదిలారు. ఈ పథకానికి తన పేరు పెట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. -
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాడికుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. -
మాటలు బడాయి.. పేదల వైద్యానికి బకాయి
[ 02-05-2024]
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మెరుగైన వైద్య సేవలందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది. -
మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసా..
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ కేంద్రం ఎక్కడ? ఎలా చేరుకోవాలి? అనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. -
నేడు ‘దక్షిణం’లో పవన్ సభ
[ 02-05-2024]
దక్షిణ నియోజకవర్గ దుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
ఫలితాలు తేల్చేది వనితలే!
[ 02-05-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 25 నాటికి 12,89,371 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి గత శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో ప్రకటించారు. -
కాపులకు మేలు చేసింది తెదేపానే: గంటా
[ 02-05-2024]
రాష్ట్రంలో కాపులకు మేలుచేసిన పార్టీ తెదేపా మాత్రమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం
[ 02-05-2024]
జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. -
విదేశీ విద్య.. అంతా మిథ్య
[ 02-05-2024]
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల కలను జగన్ కల్లగానే మిగిల్చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు కఠిన నిబంధనలు అడ్డుగా మారాయి. -
జనసేనానికి జన నీరాజనం
[ 02-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. -
ఎమ్మెల్యే సారూ.. జెట్టీ ఒట్టి మాటేనా..
[ 02-05-2024]
పరవాడ మండలం ముత్యాలమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మెంగిపాలెంలోని మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. -
నోటా కోసమే ఒక బ్యాలెట్ యూనిట్
[ 02-05-2024]
జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే విశాఖ దక్షిణంలో పోలింగ్ ఈసారి కాస్త భిన్నంగా ఉండనుంది. ఇ -
స్వగ్రామానికి ఆర్మీ ఉద్యోగి మృతదేహం
[ 02-05-2024]
పశ్చిమబెంగాల్లో హఠాన్మరణం చెందిన ఆర్మీ హవల్దార్ చిల్ల త్రినాథరెడ్డి (36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిట్టివలస సమీప జీరుపేట గ్రామానికి బుధవారం తీసుకువచ్చారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం....
[ 02-05-2024]
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. -
బాలికపై అత్యాచార యత్నం
[ 02-05-2024]
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఎండాడ దిశా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు భీమిలి సీఐ డి.రమేశ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM