ఎన్ని విచిత్రాలో..
ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి.
ఓటర్ల జాబితా అస్తవ్యస్తం
మాచవరం, న్యూస్టుడే
ఓటర్ల జాబితాలో చనిపోయిన వ్యక్తి పేరు
ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి. ప్రస్తుతం వరుస క్రమం తప్పడంతో ఎవరి ఓటు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జాబితా మొత్తం పరిశీలిస్తే తప్ప.. ఓటు ఉన్న విషయం తెలియని దుస్థితి. ఇష్టారాజ్యంగా జాబితాలు రూపొందిస్తున్నారు.
ఇంటి నంబరు, చిరునామాలు లేవు
మాచవరానికి చెందిన ఓటర్ల జాబితాలోని 161 పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తే.. తొలిపేరుకు డోర్ నంబరే లేదు. అలా వరుసగా 28 పేర్లకు అడ్రసు లేదు. తరువాత 1-1 డోర్ నంబరుతో 11 మంది పేర్లు నమోదయ్యాయి. వీరందరూ వేర్వేరు చోట్ల నివాసం ఉంటున్నారు. ఓటర్ల జాబితాలోని వరుస క్రమాన్ని పరిశీలిసే ఎన్నో విచిత్రాలు కనిపించాయి. 2-104 ఇంటి నంబరు తర్వాత 2-105 వరుస క్రమం రావాలి. కానీ 2-156 డోర్ నంబరులోని ఓటర్లు కనిపిస్తున్నారు. అదే విధంగా 3-15 తరువాత 3-101 ప్రచురితమైంది. ఈ ఒక్క పోలింగ్ కేంద్రమే కాకుండా, మిగిలిన అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. తల్లిదండ్రుల ఓట్లు ఒకచోట ఉంటే, పిల్లలవి మరో చోట ఉన్నాయి. గ్రామ ఓటర్ల జాబితా అంతా పరిశీలిస్తే కానీ, అసలు ఓటు ఉందో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉంది.
* మాచవరానికి చెందిన ఓ యువకుడికి 18 ఏళ్లు నిండటంతో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నాడు. బీఎల్వో, తహసీల్దారు కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరగడంతో ఓటు హక్కు లభించింది. తీరా చూస్తే వేరొక చోట నమోదై ఉంది. ఈ విధంగా వచ్చిన చేర్పులన్నీ ఏదో ఒక పోలింగ్ కేంద్రంలోని చివరి పేజీలో ప్రచురిస్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులతోపాటు కాకుండా విడిగా నమోదవుతున్నాయి.
మరణాల సంగతి దేవుడెరుగు..
సాధారణంగా ప్రతి గ్రామంలో ఏటా కొంతమంది వివిధ కారణాలతో చనిపోతూ ఉంటారు. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి. ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓటర్ల జాబితా సవరణ చేసిన ప్రతిసారీ అవే పేర్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మాచవరంలో దాదాపు 254 మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఇందులో పదేళ్ల కిందట చనిపోయిన వారి పేర్లు ఉండటం గమనార్హం. ఓ గ్రామంలోనే ఇన్ని ఓట్లు ఉంటే, నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. శాఖల మధ్య సమన్వయలోపం ఉందనడానికి ఇదో ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM