Tomato price: టమాటా.. వందకు పైమాటే!
టమాటా ధర ఈ నెల ప్రారంభంలో కిలో రూ.15 ఉండేది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.100 దాటేసింది. కొన్నిచోట్ల రూ.120కి కూడా విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కూడా రూ.100-120కి చేరింది.
పచ్చిమిర్చి మహా ఘాటు!
మండుతున్న కూరగాయల ధరలు
అకాలవర్షాలతో తగ్గిన ‘యాసంగి’ ఉత్పత్తులు
ఎండలతో మందగించిన దిగుమతులు
ఈనాడు, హైదరాబాద్: టమాటా ధర ఈ నెల ప్రారంభంలో కిలో రూ.15 ఉండేది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.100 దాటేసింది. కొన్నిచోట్ల రూ.120కి కూడా విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కూడా రూ.100-120కి చేరింది. హనుమకొండలో ఏకంగా రూ.200కి కూడా విక్రయిస్తున్నారు. ఇవేకాదు.. ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయలు, ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. గ్రామాల నుంచి నగరాల దాకా అన్నిచోట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమాటా, పచ్చిమిర్చితో పాటు చిక్కుడు వంటివాటి ధరలు కిలో రూ.100-150 మధ్య పలుకుతూ చుక్కలు చూపిస్తున్నాయి. బీర, బజ్జీమిర్చి, చిక్కుడు, క్యాప్సికం ధర రూ.80; గోకర, క్యారెట్, వంకాయ, బెండ, కాకర రూ.60.. ఇలా సామాన్యుల కొనుగోలుశక్తికి మించి ధరలు పెరుగుతున్నాయి. బీన్స్ ధర మునుపెన్నడూ లేనివిధంగా కిలో రూ.120కి చేరింది. ఉల్లి రూ.20కి తగ్గడం లేదు. నిమ్మకాయ డజను రూ.60 అయింది. కరోనా తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. రైతుబజార్లలోనూ ధరలు దడ పుట్టిస్తుండగా.. బహిరంగ మార్కెట్లలో వ్యాపారులు అంతకంటే భారీగా పెంచి విక్రయిస్తున్నారు. ప్రధాన కూరగాయలన్నీ కిలో రూ.40కి పైమాటే. ఆకుకూరలూ అదేరీతిలో మండుతున్నాయి. కరివేపాకు, పుదీనా కట్టల గురించి చెప్పనక్కర్లేదు. మెంతి, పుంటి, చుక్క, తోట, పాలకూరలు ఇదివరకు రూ.10కి నాలుగేసి కట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు 2 మాత్రమే ఇస్తున్నారు. రైతుబజార్లలోనూ పట్టికలపై ఒక ధర, విక్రయించేది మరో ధరగా ఉంది. అక్కడ రైతుల పేరిట వ్యాపారులు, దళారులు దందా నడుపుతున్నారన్న విమర్శలున్నాయి.
- నిజామాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మంలలో రూ.100కి కిలో చిన్న టమాటాలు విక్రయిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మార్కెట్లలో రూ.110కి చేరింది. హనుమకొండ తదితర ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఏకంగా రూ.120కి విక్రయిస్తున్నారు. తెలంగాణలో మిగిలిన కూరగాయలతో పోలిస్తే టమాటా వాడకం ఎక్కువ.
- యాసంగిలో కూరగాయల సాగు రాష్ట్రంలో విస్తరించింది. దిగుబడులు బాగుంటాయని రైతులు సంతోషంగా ఉన్న తరుణంలో మార్చి 16 నుంచి మొదలైన అకాల వర్షాలు వారి ఆశలకు గండికొట్టాయి. 2.15 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టగా 72 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా పండే రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లింది. మార్కెట్లకు రావాల్సిన కూరగాయలు తగ్గిపోయాయి.
- తెలంగాణకు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి నిత్యం కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. కొద్దిరోజుల క్రితం వరకూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చే వాహనాలు తగ్గిపోయాయి. డిమాండ్కు, ఉత్పత్తికి మధ్య అంతరం పెరిగిపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. దీంతో కొనుగోలుకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. కిలోకి బదులు అరకిలో, పావుకిలోతోనే సర్దుబాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు. వానాకాలం సీజన్లో ఆరంభంలోనే రైతులు కూరగాయలను సాగు చేస్తుంటారు. ఈ ఏడాది వర్షాల రాక ఆలస్యం అయింది. ఈమేరకు వర్షాలు కురిసి.. సాగు చేపట్టి.. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతే ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
దేశమంతటా పైపైకి..
దిల్లీ: దేశవ్యాప్తంగానూ పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ.100కి చేరింది. దిల్లీలో రూ.80కి విక్రయిస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్లో హోల్సేల్ ధర కిలోకి రూ.80-90 వరకూ పలుకుతుండగా.. రిటైల్లో రూ.100 దాటింది. కాన్పుర్కు టమాటాలు ఎక్కువగా బెంగళూరు నుంచి వస్తాయని, రానున్న రోజుల్లో ఇవి కిలో రూ.150కి చేరుకోవచ్చని స్థానిక కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ముంబయి, బెంగళూరుల్లోనూ రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. టమాటాను అధికంగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటం, సరఫరాలో అంతరాయమే ధరల పెరుగుదలకు కారణాలుగా వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. టమాటా సాగు మధ్యప్రదేశ్, ఏపీ, కర్ణాటకతోపాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్లలో అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపించింది. మొన్నటివరకూ వడగాలులతో ఈ ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినప్పటికీ.. పలుప్రాంతాల్లో భారీ వర్షాలవల్ల పంట దెబ్బ తింటోంది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. ప్రధాని విధానాలవల్ల టమాటా ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్ విమర్శించింది.
త్వరలో తగ్గుతాయి: కేంద్రం
టమాటా ధరల పెరుగుదల తాత్కాలిక సీజనల్ ధోరణి అని, త్వరలో ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘టమాటా త్వరగా చెడిపోయే పంట. ఆకస్మిక వర్షాలతో రవాణాకు ఇబ్బంది తలెత్తింది. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. ప్రతి ఏడాదీ ఈ సమయంలో ధరలు ఇలాగే పెరుగుతాయి’ అని వినియోగ వ్యవహారాలశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ వెల్లడించారు.
ఒక మిరపకాయ రూ.3
ఒక టమాటా రూ.5
నేను కిలో పచ్చిమిర్చి రూ.200కి కొన్నాను. కిలోకి 70 కాయలు వచ్చాయి. అంటే దాదాపు 3 రూపాయలకు ఒక మిరపకాయ చొప్పున కొనుగోలు చేశాను. టమాటా రూ.110 ఉంది. కిలోకి 20 కాయలు మాత్రమే వచ్చాయి. అంటే ఒక్కో కాయ ధర రూ.5 కంటే ఎక్కువే. నా జీవితంలో ఇంత ధర పెట్టలేదు.
అమీరుద్దీన్, హనుమకొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి