Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. కోడికత్తి కేసు.. బెయిల్కు సుప్రీంకోర్టుకు వెళ్లండి: నిందితుడికి ఎన్ఐఏ కోర్టు సూచన
కోడికత్తి కేసుపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించాడు. బెయిల్ అంశం తమ పరిధిలో లేదని ఎన్ఐఏ కోర్టు అతడికి స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. గతంలో శ్రీనివాస్కు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కమిన్స్వైపు బెయిర్స్టో సీరియస్ లుక్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ (Ashes 2023) రెండో టెస్టు సందర్భంగా బెయిర్స్టో (Bairstow)ను ఔటైన తీరుపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. తనకు ఎదురుపడిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్కు షేక్ హ్యాండ్ ఇస్తూ బెయిర్స్టో హావభావాలు నెట్టింట వైరల్గా మారాయి. మరి అదేంటో మీరూ చూసేయండి..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్కు ప్రమాదం..!
ప్రముఖ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్కు ( Shah Rukh Khan) ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్ ప్రమాదానికి గురయ్యారట. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం భారత్కు తిరిగి వచ్చారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోదీ 8న ఉదయం దిల్లీ నుంచి బయల్దేరి 9.45 గంటలకి హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు హెలికాప్టర్లో వరంగల్కు బయల్దేరతారు. 10.35కి అక్కడి హెలిప్యాడ్కు చేరుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. భారత కాన్సులేట్పై ఖలిస్థాన్ మద్దతుదారుల దుశ్చర్య.. ఖండించిన అమెరికా
ఖలిస్థాన్ మద్దతుదారుల శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం(Indian Consulate in San Francisco)పై దాడికి పాల్పడ్డారు. దానిని దహనం చేయడానికి ప్రయత్నించారు. నెలల వ్యవధిలో రెండోసారి ఈ తరహా దుశ్చర్య జరగ్గా.. దీనిని అమెరికా(US) ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నేరపూరిత చర్య అంటూ అభివర్ణించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ట్విటర్కు పోటీగా ‘థ్రెడ్స్’.. మెటా కొత్త యాప్
ట్విటర్ (Twitter)కు పోటీగా మెటా (Meta) కొత్తగా టెక్స్ట్ ఆధారిత సంభాషణల యాప్ను తీసుకువస్తోంది. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకువస్తోన్న ఈ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ఫామ్ను ఈ వారంలోనే వినియోగదారులకు పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్ తరహా ఫీచర్లతోనే దీన్ని తీసుకురావటం విశేషం. కానీ, ఈ అంశంపై మెటా యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం.. కొత్త ఆంక్షలు విధించిన తాలిబన్లు
అఫ్గానిస్థాన్ (Afghanistan)లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహిళల హక్కులను కాలరాస్తూ.. కొత్త నిబంధనలను తాలిబన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాబూల్లోని మహిళల బ్యూటీ సెలూన్ (Beauty Salon)లపై నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్ మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్ (Kabul)మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘రూ.7 లక్షలిస్తే నీట్ పరీక్ష రాసిపెడతాం..’: దిల్లీ ఎయిమ్స్ విద్యార్థుల ఘరానా మోసం
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో భారీ మోసం (NEET racket)బయటపడింది. నీట్లో ఉత్తీర్ణత సాధించేందుకు అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో ఓ ముఠా పరీక్ష (NEET Exam) రాయిస్తోంది. దేశ రాజధాని దిల్లీలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ (Delhi AIIMS) విద్యార్థులు నడిపిస్తున్న ఈ ‘నీట్ రాకెట్’ను దిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా నాయకుడు సహా ఇప్పటివరకు నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అనారోగ్యమైతే ప్రమాణ స్వీకారం ఆపాలా..? ఇదేం వింత..! దిల్లీ ప్రభుత్వంపై ఎల్జీ ఆగ్రహం
దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi)లో లెఫ్టినెంట్ గవర్నర్(Delhi Lt Governor), ఆప్ ప్రభుత్వం(AAP Govt) మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (DERC) కొత్త ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. తన అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆప్ నేత, విద్యుత్ శాఖ మంత్రి అతిషి వాయిదా వేయగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. సముద్రంపై సరస్సు.. చూస్తే ఔరా అనాల్సిందే!
నదులు సముద్రంలో కలిసే సంగమ ప్రదేశాలు మీరు ఎక్కడైనా చూసుంటారు. కానీ, సముద్రానికి అల్లంత ఎత్తులో సరస్సు ఉండటం చూశారా? అలా కూడా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఫోరే దీవులకు వెళ్లాల్సిందే. డెన్మార్క్ సమీపంలో ఉన్నాయి ఈ దీవులు. ఇక్కడి వాగర్ ద్వీపం వద్ద సర్వాగ్స్వాటన్ సరస్సు ప్రవహిస్తోంది. సర్వాగర్, వాగర్ మున్సిపాలిటీల మధ్యలో ప్రవహిస్తున్న ఈ సరస్సు 3.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు