Delhi: అనారోగ్యమైతే ప్రమాణ స్వీకారం ఆపాలా..? ఇదేం వింత..! దిల్లీ ప్రభుత్వంపై ఎల్జీ ఆగ్రహం
అనారోగ్యం కారణంగా దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (DERC) కొత్త ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయడంపై ఎల్జీ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కేజ్రీవాల్(Arvind Kejriwal)కు లేఖ రాశారు.
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi)లో లెఫ్టినెంట్ గవర్నర్(Delhi Lt Governor), ఆప్ ప్రభుత్వం(AAP Govt) మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (DERC) కొత్త ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. తన అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆప్ నేత, విద్యుత్ శాఖ మంత్రి అతిషి వాయిదా వేయగా.. డిజిటల్ యుగంలో ఇదేం తీరు అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా( Delhi Lieutenant Governor VK Saxena) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఆయన లేఖ రాశారు.
‘ఈ డిజిటల్ యుగంలో రాష్ట్రపతి 2023 జూన్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ను అమలు చేయకలేకపోతున్నట్లు మంత్రి వెల్లడించడం వింతగా అనిపిస్తోంది’ అని సక్సేనా అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రక్రియను వర్చువల్గా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ ఉదయం పదిగంటలకు దానిని పూర్తి చేయాలని వెల్లడించగా.. ఆ సమయానికి ఎల్జీ ఆదేశాలు అమలుకాలేదు.
ఏం జరిగిందంటే..?
జస్టిస్ ఉమేశ్ కుమార్.. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఆయన దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (DERC) ఛైర్మన్గా నియమితులయ్యారు. వాస్తవంగా మంత్రి అతిషి సోమవారం సాయంత్రం ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారని దిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దానికి సంబంధించి జస్టిస్ ఉమేశ్కు సమాచారం ఇచ్చారు. దానికి ఆయన కూడా అంగీకరించారు. తర్వాత అనూహ్యంగా అతిషి అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆ కార్యక్రమం కాస్తా గురువారానికి వాయిదా పడింది.
సుప్రీంకోర్టులో ఎల్జీకి చుక్కెదురు..
దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ను ఆప్ తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో ప్రస్తుత నియామకం మరోసారి ఆప్ ప్రభుత్వం, ఎల్జీ మధ్య విభేదాలు సృష్టించింది. దీనిని ఆప్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఈ ప్రమాణ స్వీకారాన్ని కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ ఉమేశ్ కుమార్ ప్రమాణ స్వీకారం నిర్వహణ గురించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అడగకూడదని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్కు నోటీసులు ఇస్తామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?