USA: భారత కాన్సులేట్పై ఖలిస్థాన్ మద్దతుదారుల దుశ్చర్య.. ఖండించిన అమెరికా
భారత దౌత్యకార్యాలయం(Indian Consulate)పై ఖలిస్థాన్ మద్దుతుదారులు చేసిన దాడిని అమెరికా(USA) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు శిక్ష తప్పదని హెచ్చరించింది.
వాషింగ్టన్: ఖలిస్థాన్ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం(Indian Consulate in San Francisco)పై దాడికి పాల్పడ్డారు. దానిని దహనం చేయడానికి ప్రయత్నించారు. నెలల వ్యవధిలో రెండోసారి ఈ తరహా దుశ్చర్య జరగ్గా.. దీనిని అమెరికా(US) ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నేరపూరిత చర్య అంటూ అభివర్ణించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..
రెండురోజుల క్రితం వేకువజాములో ఖలిస్థాన్ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కో(San Francisco) దౌత్యకార్యాలయానికి నిప్పంటించారు. అయితే స్థానిక అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించి మంటల్ని ఆర్పేశారు. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడిపై అమెరికా స్పందించింది. ‘దౌత్యకార్యాలయంపై విధ్వంసానికి పాల్పడటం, దహనం చేయడానికి చేసిన యత్నాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. దౌత్యకార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై హింసకు పాల్పడటం వంటి చర్యలను అమెరికాలో తీవ్ర నేరాలుగా పరిగణిస్తాం’అని యూఎస్ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన వీడియోను ఖలిస్థాన్ మద్దతుదారులు విడుదల చేశారని, దీనికి ఎలాంటి ధ్రువీకరణ లేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ వీడియోలో.. హింస హింసను ప్రేరేపిస్తుందనే వ్యాఖ్యలతో పాటు ఇటీవల కెనడాలో మృతి చెందిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్కు సంబంధించిన వార్తా కథనమూ కనిపించింది. గత నెల కెనడాలోని ఓ గురుద్వారాలో నిజ్జర్ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు.. కార్యకలాపాల నిర్వహణ, నెట్వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ అందించేవాడు. ఇతడిపై ఎన్ఐఏ భారత్లో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హర్దీప్ సింగ్కు ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇతడి హస్తం ఉంది. హర్దీప్ సామాజిక మాధ్యమ ఖాతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు, చిత్రాలు ఉన్నాయి. గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఉన్న సమయంలో కెనడా(Canada)కు అప్పగించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఇతడి పేరును కూడా చేర్చారు. 2018లో ఈ జాబితాను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అప్పగించారు.
ఇదిలా ఉంటే మార్చిలో కూడా శాన్ఫ్రాన్సిస్కో దౌత్యకార్యాలయంపై దాడి జరిగింది. ఈ వరుస ఘటనలపై సోమవారం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ (S. Jaishankar) స్పందించారు. భారత్ భాగస్వామ్య దేశాలైన కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియా.. ఈ తరహా అతివాద భావజాలానికి తావివ్వకూడదని, అది దేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.
కెనడా రాయబారికి కేంద్రం సమన్లు..
ఖలిస్థాన్ మద్దతుదారులు జులై ఎనిమిదిన కెనడాలోని టొరంటోలో స్వేచ్ఛార్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి అంటించిన పోస్టర్లలో ఒట్టావా, టొరంటోలోని దౌత్యవేత్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం తమ దేశంలోని భారత దౌత్యవేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ర్యాలీని ఖండిస్తూ భారత ప్రభుత్వం మన దేశంలోని కెనడా రాయబారికి సమన్లు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే