TTD: తిరుమలలో పెరుగుతున్న రద్దీ ... సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో ఆదేశం
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని తితిదే ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. అన్నమయ్య భవన్లో శుక్రవారం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని తితిదే ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీ శనివారం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లలోని భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత కొన్నినెలలుగా గురువారం నుంచి ఆదివారం వరకు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోందని ఈవో వివరించారు. రద్దీ వేళ రోజుకు దాదాపు 90 వేల మంది శ్రీవారి దర్శించుకుంటున్నారని వెల్లడించారు.
పోలీసులతో సమన్వయం చేసుకోవాలి...
క్యూలైన్ల నిర్వహణలో తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. ఆరోగ్యాధికారి తిరుమలలో పరిశుభ్రతతో పాటు భక్తులకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రిసెప్షన్ అధికారులు గదుల కేటాయింపులో అలస్యం లేకుండా చూడాలన్నారు. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా తిరుమలలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్యాణకట్టలో రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారని, రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ఈవో స్పష్టం చేశారు. చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ2 జగదీశ్వర రెడ్డి, వీజీవో బాలిరెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే