Corona: బ్రెజిల్ పిల్లల్లో అన్ని మరణాలెందుకు..?
కరోనా విషయంలో చిన్నారుల గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బ్రెజిల్ అనుభవాలు వెల్లడిస్తున్నాయి. అక్కడి పిల్లల్లో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలుస్తోంది
బ్రెసిలియా: మనదేశంలో కరోనా వైరస్ మొదటి దశలో చిన్నారులపై పెద్దగా ప్రభావం లేదు. రెండోదశలో కొద్దిమేర దాని తీవ్రత కనిపించింది. మూడోదశలో దాని ముప్పు తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా విషయంలో చిన్నారుల గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బ్రెజిల్ అనుభవాలు వెల్లడిస్తున్నాయి. అక్కడి పిల్లల్లో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ‘వైటల్ స్ట్రాటజీస్’ అనే ఎన్జీఓ దీనిపై అధ్యయనం చేసింది.
ఇప్పటివరకు సుమారు 4,67,000 మంది బ్రెజిల్ దేశీయులు కరోనావైరస్తో ప్రాణాలు కోల్పోయారు. అందులో 10 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 0.5 శాతం, అంటే 2,200 కంటే ఎక్కువే చనిపోయారు. ఐదేళ్ల లోపువాళ్లలో 900కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇదే సమయంలో కరోనా మరణాల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 6 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. అందులో 113 మరణాలు ఐదేళ్లలోపు చిన్నారులవి. ఈ లెక్కన చూసుకుంటే కరోనా కారణంగా బ్రెజిల్లోని చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు విడిచారు. బ్రెజిల్లో అధిక జనాభా ఉన్న సావ్ పాలో నగరంలో వైటల్ స్ట్రాటజీస్ ఈ అధ్యయనం నిర్వహించింది. 2020 చివరి నుంచి కౌమార వయస్కులు, చిన్నారుల్లో నమోదవుతున్న కేసులు పెరగడంతో పాటు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా ఎక్కువైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఐదేళ్లలోపువారితో సహా శిశువులు కూడా ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది.
ప్రారంభ రోజుల్లో పెద్దలతో పోల్చుకుంటే చిన్నారుల్లో వైరస్ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే బ్రెజిల్ పిల్లల్లో చోటుచేసుకున్న మరణాలతో పరిశోధకులు దీనికి కారణాలను అన్వేషిస్తున్నారు. రానున్న రోజుల్లో వైరస్ తీరుతెన్నులు ఏవిధంగా ఉండొచ్చనే అంశాలను పరిశీలిస్తున్నారు. బ్రెజిల్లో మొదట గుర్తించిన కరోనా రకం పీ.1(గామా) సంక్రమణ అక్కడ వేగంగా ఉంది. అది యాంటీబాడీలను పాక్షికంగా తప్పించుకొని వ్యాప్తి చెందగలదని తెలుస్తోంది. ఈ తరహా వైరస్ మ్యుటేషన్లే పిల్లల్లో తీవ్రతకు కారణంగా భావిస్తున్నారు. అమెరికాలో కూడా ఈ గామా వేరియంట్ ఉనికి చాటుతోంది. అక్కడ మొత్తం కేసుల్లో ఏడు శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని అంచనా. ఇది చిన్నారులు, శిశువులపై ప్రభావం చూపుతుందేమోనని భావిస్తున్నారు. అలాగే అక్కడ మూడింట రెండు వంతుల కేసులకు ఆల్ఫా వేరియంట్ కారణమని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు గామా ఉద్ధృతి కూడా తీవ్ర స్థాయిలో ఉందన్నారు. దాంతో టీకాల పనితీరు కీలకంగా మారనుంది. బూస్టర్ డోసులు, చిన్నారులకు టీకాల ఆమోదం వంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. అలాగే పిల్లల్లో కొవిడ్ ముప్పుపై వైద్య సిబ్బందికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. బ్రెజిల్లో కొవిడ్ సంక్షోభానికి కారణం కట్టడి చర్యల్లో వైఫల్యం, టీకా సరఫరా సరిగా లేకపోవడమేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్లు పుట్టుకొని వస్తుండటంతో బ్రెజిల్తో సహా, భారత్, కాంగో వంటి దేశాల్లో కరోనా కల్లోలం బయటపడుతోంది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సమాజం సమయానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే చిన్నారులు ఎలా ఇబ్బంది పడతారో బ్రెజిల్ అనుభవం తెలియజేస్తోందని చెబుతున్నారు.
మరోవైపు, బ్రెజిల్లో 2007, 2008 మధ్యలో చిన్నారులను డెంగీ ఇబ్బంది పెట్టింది. మొత్తం మరణాల్లో సగం కంటే ఎక్కువ పసిపిల్లలవే. అలాగే 2015లో జికా వైరస్ వెలుగుచూసింది. ఆ సమయంలో దాని బారిన పడిన గర్భిణులు.. మైక్రోసెఫాలీ వంటి జనన లోపాలతో ఉన్న బిడ్డలకు జన్మనిచ్చారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఇతర పరాన్న జీవులు అక్కడి పిల్లల్లో ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయి. ఇది ఆ దేశంలోని పేద గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మేం 60 రన్స్ వెనుకబడ్డాం: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు