Anand Mahindra: దేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ఎప్పుడవుతారు? ఆనంద్‌ మహీంద్రా రిప్లై ఇదే!

దేశంలో సంపన్న వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌ ఇండియా (Forbes India) ఇటీవల విడుదల చేసింది.  దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎప్పుడు మారుతారని సామాజిక మాధ్యమాల్లో అడిగిన ప్రశ్నకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Published : 12 Dec 2022 01:13 IST

ముంబయి: సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. స్ఫూర్తిదాయక కథనాలతో పాటు సమకాలీన సంఘటనలపై నిత్యం స్పందిస్తుంటారు. యూజర్లు వేసే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలో.. దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో (India's richest) మీరెప్పుడు నంబర్‌ 1 అవుతారని ఇటీవల ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఆనంద్‌ మహీంద్రా తాజాగా స్పందించారు.

‘నిజమేంటంటే.. నేను ఎప్పటికీ అత్యంత సంపన్నుడిని కాలేను. ఎందుకంటే అది ఎప్పుడూ నా కోరిక కాదు’ అని ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. దేశంలో అత్యంత సంపన్నుల జాబితా 2022ను ఫోర్బ్స్‌ ఇండియా (Forbes India) ఇటీవల విడుదల చేసింది. 2.1బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులతో ఆనంద్‌ మహీంద్రా ఈ జాబితాలో 91స్థానంలో ఉన్నారు. దేశంలో తొలి వంద స్థానాల్లో నిలిచిన సంపన్నుల మొత్తం ఆస్తుల విలువ 800 బిలియన్‌ డాలర్లు. ఇక ట్విటర్‌లో ఆనంద్‌ మహీంద్రాకు కోటికి పైగా ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని